ధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదు పేజీల లేఖ రాశారు. రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన దారుణ ఘటనతో పాటు.. గత నాలుగు రోజులుగా ఏపీలో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్ఐమ్ రేట్ పై వివరాలు, మీడియాలో వచ్చిన కథనాలు, వీడియోలను తన లేఖకు చంద్రబాబు జతచేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో విఫలమైన పోలీసులతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు. పేట్రేగిపోతున్న వైసీపీ గూండాలను అదుపు చేయలేక పోలీసుశాఖ చతికిలపడుతోందని ఆరోపించారు. జంగిల్ రాజ్ ఏలుబడిలో రాష్ట్ర ప్రజలకు భద్రతే లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం అయ్యిందని చంద్రబాబు రాసిన లేఖలో పేర్కొన్నారు. జంగిల్ రాజ్ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలం అవుతోందని ఆరోపించారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి. కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్రారావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిన విషయాన్ని తన లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలమయ్యారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో ఆ దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా.. పోలీసుశాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
అనంతపురంలో పింఛన్ అడిగిన పాపానికి పోలీసు ఎస్సై టీడీపీ కార్యకర్తపై దాడి చెయ్యడం పోలీసు శాఖలో వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోందని అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకపోయినా.. కర్ణాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్టు చేశారని గుర్తుచేశారు. తాజాగా ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్న విషయం డీజీపీకి చంద్రబాబు రాసిన తన లేఖలో ప్రస్తావించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని తన లేఖలో చంద్రబాబు కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-letter-to-dgp-on-atrcities-in-ap-25-135339.html
ఈనెల 19 నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్యాండ్ బాజా బారాత్ మొదలు కానుంది. జగన్ మీద వున్న కేసుల విచారణ ఆరోజు నుంచి సీబీఐ కోర్టు ప్రారంభించనుంది.
తమను నామినేట్ చేసిన ప్రభుత్వం పడిపోగానే తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా తెలియని తోలుమందం బ్యాచ్ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లుగా, డైరెక్టర్లుగా, సభ్యులుగా వున్నారు.
వల్లభనేని వంశీ కుటుంబం అయితే ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు గన్నవరంలో గౌరవంగా బతికి, ఇప్పుడు సొంత ఊరిని, ఇంటిని వదిలేసి హైదరాబాద్లో వుండాల్సి రావడం, వంశీ ఆరోగ్యం బాగాలేకపోవడం, తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటూ వుండటం చూసి వాళ్ళు బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
మృగశిర కార్తె రోజు వర్షం పడటం రివాజు. నైరుతి రుతుపవనాలు వారం రోజుల ముందే..
. నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ అయ్యారు
వైసీపీలో కీలక నేత పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ చిత్తూరు జిల్లాలో కుప్పం వినా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ విజయం సాధించడం వెనుక ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డే.
ఢిల్లీ మద్యం స్కాంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ దొరికే అవకాశాలు కనిపించడం లేదు. కవిత బెయిల్ కోసం దరఖాస్తు చేసి ఇన్ని రోజులైనప్పటికీ కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడవం లేదు. దీంతో బెయిల్ రాదని డిసైడ్ అయిపోయిన కవిత కాలక్షేపానికి పుస్తకాలు కావాలని కోర్టుకు మొదపెట్టుకుంది.
ఇప్పటి వరకు ఓ పాతిక శవాల వరకు సంపాదించిన జగన్ పార్టీ వర్గాలు.. ఆ శవాల లిస్టు వందో, రెండొందలో అయ్యాక తమ నాయకుడిని రంగంలోకి దింపే ఆలోచనలో వున్నట్టు తెలుస్తోంది.
సిట్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు గల్లంతు అయ్యాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే.. అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన వెంటనే ఎందుకైనా మంచిదని అధికారులు కీలక ఫైళ్లను మాయం చేసినట్లు సమాచారం.
ఈనెల 12న జరగబోయే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు... ‘సూపర్స్టార్’ రజనీకాంత్.
నందమూరి బాలకష్ణ చిన్నల్లుడు, విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి 5 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించిన శ్రీభరత్ని కేంద్ర యూనియన్ మినిస్టర్ పదవి వరించబోతున్నట్టు తెలుస్తోంది. శ్రీభరత్కి కేంద్ర క్యాబినెట్లో స్థానం ఖాయమైందని, అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి వుందని వార్తలు వస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి వైసీపీ లీడర్లు పెద్ద సంఖ్యలో చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపి క్లీన్ స్వీప్ చేయడంతో తెలుగు దేశంలో చేరే వారి సంఖ్య ఎక్కువవుతుంది.
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీకి గుడ్బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు పూర్తయ్యిందో లేదో అప్పుడే ఇండియా కూటమి భాగస్వామ్యపక్షాలలో చీలికలు, జంపింగులు ఆరంభమయ్యాయి.