బాదుడుపై టీడీపీ దూకుడు- బాబు జిల్లాల పర్యటనలు!

Publish Date:May 2, 2022

Advertisement

తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ధరల బాదుడుపై ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్వయంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల నాలుగు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు నుంచి విడతల వారీగా మహానాడు వరకూ ఆయన ఈ పర్యటనలు కొనసాగించనున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు ఆందోళనా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు.  నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో ఆయన పర్యటిస్తారు, ఆ మరుసటి రోజు అంటే 5వ తేదీన భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో పర్యటిస్తారు, ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో పర్యటిస్తారు. ఈ మూడు సందర్భాలలోనూ కూడా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇప్పటికే చంద్రబాబు వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని చెబుతున్న చంద్రబాబు, జగన్ సర్కార్ నిర్వాకాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. అలాగే ఏపీలో దారుణాలపై డీజీపీకి లేఖ రాశారు. 
మే 28న ఒంగోలులో తెలుగుదేశం మహానాడు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ లో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ నింపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాట స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.    రాష్ట్రంలో నిరసన గళమెత్తిన వారిపై పోలీసులు, వైసీపీ శ్రేణులూ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు జిల్లాల పర్యటన పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే వారికి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుందన్న భరోసాను ప్రజలకు చంద్రబాబు తన పర్యటనల ద్వారా ఇవ్వనున్నారని చెబుతున్నాయి.  రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ ధరల బాదుడుకు గురౌతున్నారనీ, ప్రభుత్వ అసమర్ధ, అస్తవ్యస్థ విధానాలే రాష్ట్రంలో ధరల బాదుడుకు కారణమని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడానికి చంద్రబాబు జిల్లా పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనలతో పార్టీ క్యాడర్ లో  నూతనోత్సాహం నిండటం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా జగన్ ఇంకెంత మాత్రం ఉచిత పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉందనీ, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్, ఉచితాలు నిలిపివేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడం కూడా  బాబు పర్యటనలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

By
en-us Political News

  
మంత్రి లోకేష్ ఆరు సూత్రాలంటే..వైసీసీ క్రిమినల్ ఐడియాలజీని ఆవిష్కరిస్తోందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ప్రజలు సైకిల్‌తో కొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని ఆయన అన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శన క్యూలైన్లలో అది కూడా ఆలయం లోపల కొందరు వైసీపీ నేతలు కావాలనే భక్తులను రెచ్చగొడుతూతురని ఆయన అన్నారు.
హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్-2025 పోటీల్లో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. సుచాత మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ లో సుచాత జన్మించారు.
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ టీమ్‌ఇండియా యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. లఖ్‌నవూలోని ఓ లగ్జరీ హోటల్‌లో వీరి నిశ్చితార్థం ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు.
క‌నిపించ‌వు కానీ నీలో కూడా ఒక స్మార్ట్ పొలిటీషియ‌న్ ఉన్నాడ‌య్యా నాగార్జునా.. అనే వాళ్లుంటారు. నాగార్జున ఏమంత సామాన్యంగా పావులు క‌ద‌ప‌రు. ఆయ‌న స్కెచ్ వేస్తే అందుకంటూ ఒక లెక్కుంటుంద‌ని అంటారు.
ఏపీలో వ్యాప్తంగా మళ్లీ రేషన్ షాపులు తెరుచుకున్నాయి. 29,796 రేషన్‌ దుకాణాల్లో సరకులు పంపిణీ చేస్తున్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటలు ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇటు మాజీ సీఎం కేసీఆర్ దేవుడు అంటూనే అటు త‌న సొంత నిర్ణ‌యాలు తాను తీసుకుంటున్నారు. త‌న తండ్రి చేసే తప్పులు వ‌రుస‌గా దిద్దే య‌త్నం చేస్తున్నారు.
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తడం కొండచరియలు విరిగి పడుతుండటంతో 25 మంది మృతి చెందారు.
రైలు కింద పడి ఏఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కడపలో జరిగింది. కడప రైల్వే స్టేషన్ పరిధిలోని సిద్దవటం కనుమలోపల్లి వద్ద రైలు పట్టాలపై ఏఎస్ఐ బుక్కే పురుషోత్తమ్ నాయక్ మృత దేహాన్ని శనివారం (మే 31( కనుగోన్నారు.
తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆదివారం ఉదయం శ్రీవారి మెట్ల మార్గంలో 500వ మెట్టు వద్ద చెట్ల పొదలలో సేదదీరుతున్న చిరుతను గమనించిన భక్తులు వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటం, వారాంతం కావడంతో తిరుమల గిరులు భక్త జనసంద్రంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.