ఆపన్నులను ఆదుకోవడంలో బాబు తగ్గేదేలే!

Publish Date:Jul 22, 2022

Advertisement

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీని అధికారపీఠంపై కూర్చోబెట్టేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు   మాస్టర్ ప్లానే వేశారు. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతలు చేస్తున్న పనికిమాలిన పనులన్నింటినీ వరుసపెట్టి ఏకేస్తున్న చంద్రబాబు ప్రతి సందర్భాన్నీ టీడీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా సరే.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి విజయం సాధించిపెట్టడం ద్వారా అసెంబ్లీలో  తాను చేసిన శపథాన్ని నెరవేర్చుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు. తన సతీమణిని వైసీపీ నేతలు అసెంబ్లీ వేదికగా విమర్శించినప్పుడు ఆవేదనతో మళ్లీ సీఎంగానే ఈ సభలో అడుగుపెడతా అంటూ బయటికి వచ్చేశారు. 

భారీ వర్షాలు, వరదలతో భారీగా నష్టపోయిన కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటించి, బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి పరామర్శించి, టీడీపీ తరఫున భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితులకు తక్షణమే సాయం చేసి, అండగా ఉండాల్సిన సీఎం జగన్ గాల్లో వచ్చి గాల్లోనే వెళ్లిపోయారని విమర్శించారు. అలా గాల్లో వస్తే.. బాధితుల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. అందుకే చంద్రబాబు స్వయంగా వరదనీటిలో పడవలపైన, బురద నిండిన గ్రామాల్లో కూడా పర్యటించారు. కష్టాల్లో ఉన్న తమను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబును చూసి గోదావరి జిల్లాల ప్రజల్లో చెప్పలేనంత సంతోషం వ్యక్తం అయింది. ఆయనకు నీరాజనాలు పట్టి మరీ స్వాగతం పలికారు.

వరద బాధితులకు పక్కరాష్ట్రం తెలంగాణలో పది వేలు పరిహారం ఇస్తే.. ఏపీలో కేవలం రెండు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ ఇస్తున్న రెండు వేల రూపాయలు వరదలో మునిగిపోయిన ఇళ్లలోని బురద తొలగించుకోడానికి కూడా సరిపోవని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడం తథ్యం అని, బాధితులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డి పాలన సరిగా లేదు కాబట్టే పోలవరం ముంపు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలిసిపోతామంటూ తీర్మానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

వరదనీరు నిండి ఉన్న లంక గ్రామాల్లో చంద్రబాబు నాయుడు సాహసం చేసి మరీ బాధితులను పరామర్శించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదానికి గురై, పలువురు నేతలు వరదనీటిలో పడిపోయారు. ఇలాంటి ప్రమాదాలకు కూడా ఏమాత్రం వెనుదిరగకుండా చంద్రబాబు తన పరామర్శ యాత్రను కొనసాగించారు. బాధితుల పక్షాన నిలిచారు.

వైసీపీ ప్రభుత్వం పెంచేసిన విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, పన్నులపై ‘బాదుడే.. బాదుడు’ పేరిట ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దాంతో పాటుగా ఏడు పదులు దాటిన వయస్సులో కూడా చంద్రబాబు విసుగు, విరామం, అలసట లేకుండా జిల్లాల యాత్రలు చేస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి దాష్టీకాలు, వైసీపీ నేతల దుర్మార్గాలపై ఎప్పకటికప్పుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు చేసిన గోదావరి జిల్లాల పర్యటనకు సంబంధించి రెండు విషయాలు చెప్పాల్సి ఉంది. సాధారణంగా వరదలు, భారీ వర్షాలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు రాజకీయ నేతలు బాధితులను ఒక చోట చేర్చి పరామర్శించడం, తోచినంత సాయం చేస్తుంటారు. కానీ చంద్రబాబు మాత్రం వరదలో చిక్కుకున్న మారుమూల గ్రామాలకు కూడా స్వయంగా వెళ్లడం, రోజంతా బాధితుల సమస్యలు వింటూ.. వారితో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరును ఎండగట్టడంలో ఎంతో ఓపికతో వ్యవహరించారు. రోజంతా విరామం లేకుండా బాధితుల పక్షాన నిలిచేందుకు చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. ఆయన ఓపిక, స్టామినాను చూసిన వరద బాధితులు కూడా అవాక్కయ్యారు.

వరద బాధితులను గాలికి వదిలేసి, గాల్లో వచ్చిన జగన్ గాల్లోనే చూసి వెళ్లిపోతే.. చంద్రబాబు మాత్రం సమస్య మూలాల్లోకి వెళ్లి, బాధిత జనం కోసం జనం మధ్యకే వెళ్లి, వారికి అండగా నిలబడతామని భరోసా ఇవ్వడం విశేషం. ఏదేమైనా తాను చేసిన శపథం ప్రకారం చంద్రబాబు నాయుడు సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టే సూచనలో ఏపీలో సర్వత్రా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

By
en-us Political News

  
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.