శాకాహారులకు దక్కని విటమిన్‌- B12

Publish Date:Jul 21, 2016

Advertisement

‘B విటమిన్’ మన శరీరానికి చాలా అవసరం అన్న విషయంలో ఎవరకీ ఏ సందేహమూ లేదు. ఇందులోనూ ఒకటి కాదు రెండు కాదు 8 రకాల విభాగాలు (B1, B2...) ఉన్నాయనీ, అవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం అనీ తెలుసు. కానీ వీటిలో విటమిన్‌ B12 గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు!

జీవక్రియలకు తప్పనిసరి

ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలోనూ, నాడీ వ్యవస్థ పనితీరులోనూ B12ది చాలా ముఖ్య పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరంలోని జీవక్రియ సాగడంలో B12ది ఒక ప్రధాన పాత్ర. ఈ విటమిన్‌ కనుక లేకపోతే మన DNA వ్యవస్థ కూడా కుదేలవక తప్పదు. దురదృష్టవశాత్తూ మన శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారుచేసుకోలేదు. దాంతో బయట నుంచి వచ్చే ఆహారం మీదే శరీరం ఆధారపడవలసి ఉంటుంది. అక్కడే వస్తుంది అసలు చిక్క!

మాంసాహారంలోనే ఎక్కువ

వృక్షసంబంధమైన ఏ ఆహారంలోనూ ఈ B12 కనిపించదు. కేవలం మాంసాహారంలోనూ, పాలపదార్థాలలోనూ, గుడ్లలోనే ఈ విటమిన్‌ కనిపిస్తుంది. పెద్దవారిలో పాలు తాగే అలవాటు తక్కువ కాబట్టి, సహజంగానే ఈ విటమిన్‌ను తగినంతగా తీసుకునే శాకాహారుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. తగినన్ని పాలని తీసుకున్నా కూడా ఒకోసారి వాటిని జీర్ణం చేసుకోలేకపోవడం, వాటిలోని విటమిన్‌ను శరీరం శోషించుకోలేకపోవడం వల్ల కూడా అవసరమైనంత మేర B12 లభించకపోవచ్చు.

ఇతరత్రా కారణాలు

VEGAN అనే నియమాన్ని పాటించేవారు కొందరుంటారు. వీరు పాలు, పెరుగులతో సహా జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ ముట్టుకోరు. వీరిలో ఈ విటమిన్‌ లోపం మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ఇక జీర్ణాశయం సరిగా పనిచేయకపోవడం, రక్తహీనత, మద్యపానం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం... ఇవన్నీ కూడా మన శరీరానికి తగినంత B12 లభించకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది.

నష్టాలు అపారం

శరీరానికి తగినంత B12 లభించకపోతే అపారమైన నష్టాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని నష్టాలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. B12 లోపం వల్ల ఏర్పడే ఇబ్బందులలో కొన్ని...

- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు.
- అతిగా ఆలోచించడం, ప్రతి విషయానికీ క్రుంగిపోవడం.
- ఆకలి మందగించడం, అరుగుదలలో సమస్యలు.
- రక్తహినత, దాని వల్ల శరీరం పాలిపోయినట్లు కనిపించడం.
- నాడీవ్యవస్థలో ఇబ్బందుల. వాటి వల్ల శరీరం తిమ్మిర్లు ఎక్కినట్లు తోచడం, కండరాలు బలహీనపడిపోవడం.
  పరిష్కారం

మాంసాహారులకి B12 లోపాన్ని అధిగమించడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే మాంసం, చేపలు వంటి ఆహారంలో ఈ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎటొచ్చీ శాకాహారుల మాత్రం ఈ విషయంలో కాస్త తరచి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. B12 లోపాన్ని అధిగమించేందుకు సూక్ష్మజీవుల ద్వారా మందులను (supplements) తయారుచేస్తూ ఉంటారు. వైద్యుల సలహా మేరకు ఈ మందులను తీసుకోవడం మంచిది. అయితే పాలు, పాల పదార్థాలను పుష్కలంగా తీసుకుంటే కనుక ఈ సమస్యను చాలావరకూ నివారించవచ్చు. ఏది ఏమైనా మన శరీరానికి తగినంతగా B12 అందుతోందా లేదా? అందకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న విషయమై ఒకసారి వైద్యుని సంప్రదించడం మేలు.

 

- నిర్జర.
 

By
en-us Political News

  
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.