అయోధ్య రాముడి నిధుల చోరీ కేసు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

Publish Date:Jun 29, 2026

Advertisement

అయోధ్య రామమందిర నిర్మాణానికి దేశవిదేశాల నుంచి భక్తులు సమర్పించిన విరాళాలు, చందాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిధుల చోరీపై నిష్పాక్షికంగా, అత్యంత వేగంగా,  దర్యాప్తు జరపాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో  పిటిషన్ దాఖలైంది.  దేశవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న వ్యవహారం కావడంతో, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని పిటిషనర్లు సుప్రీం కోర్టును కోరారు. అయితే అత్యవసర విచారణకు నిరాకరిస్తూ సుప్రీం కోర్టు సోమవారం.. వెకేషన్ తరువాత ఈ పిటిషన్ ను లిస్ట్ చేస్తామని స్పష్టం చేసింది.  జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీం వెకేషన్  ధర్మాసనం  ఈ పిటిషన్‌ను ప్రస్తుత వేసవి సెలవుల  అనంతరం, కోర్టు పునఃప్రారంభమయ్యాక సాధారణ జాబితాలో చేర్చి విచారిస్తామని   స్పష్టం చేసింది. 

ఈ సందర్భంగా   వెకేషన్ బెంచ్   చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు న్యాయ,  రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.  ఈ కేసును ఇప్పుడే, ఇంత అత్యవసరంగా విచారించకపోతే ఆకాశమేమీ విరిగిపడదు కదా.. ఇందులో అంత అత్యవసరమేముంది  అంటూ న్యాయమూర్తులు  వ్యాఖ్యానించారు. కోర్టులు సెలవుల్లో ఉన్న సమయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన, ప్రాణాలతో లేదా అత్యవసర రాజ్యాంగ సంక్షోభాలతో ముడిపడిన కేసులనే విచారిస్తామని.. ఈ నిధుల దుర్వినియోగం కేసు దర్యాప్తును సెలవుల తర్వాత కూడా పరిశీలించవచ్చని బెంచ్ స్పష్టం చేసింది.  

మరోవైపు, ఈ  కేసులో ఇప్పటికే  దర్యాప్తు సాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఈ నిధుల గోల్ మాల్ కుంభకోణంపై  విచారణ జరుపుతోంది. ఎవరెవరు ఈ నిధుల మళ్లింపునకు పాల్పడ్డారు, ఎక్కడికి ఈ చందాలు చేరాయి అనే  కోణంలో సిట్  ఆరా తీస్తోంది. ఈ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుండగానే..  అయోధ్య బార్ అసోసియేషన్ కూడా ఈ కేసులో రాముడి నిధులను దొంగిలించిన నిందితుల తరఫున అయోధ్యలోని ఏ   లాయర్ కూడా వకాలత్ పుచ్చుకోకూడదనీ.. వారి తరఫున వాదించకూడదని  తీర్మానించింది. ఒకవేళ ఈ నిబంధనను ఎవరైనా లాయర్ ధిక్కరిస్తే, వారికి  రూ. 5 లక్షల భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.   

By
en-us Political News

  
వేడివేడి బజ్జీల వాసనతో ఆకర్షితులైన స్థానికులు వాటిని ఆస్వాదించేందుకు ఆగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం వీఐపీల భద్రత కుదింపు నిర్ణయాని కారణం, రాష్ట్రంలో పూర్తిగా తొలగిపోయిన నక్సల్స్ సమస్యగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తెలంగాణ సరిహద్దుల్లోనూ, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తీవ్రంగా ఉన్న మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు కలికానిక్కూడా కనిపించనంతా తగ్గిపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నదని పేర్కొంది.
ఇరాన్‌పై అమెరికా దాడి చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల దేశాలపై ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ క్రమంలో పనామా జెండా ఎగురవేస్తున్న కికు అనే చమురు నౌకపై డ్రోన్‌ దాడి జరిగింది. ఆ నౌకలో సుమారు రెండు మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురు ఉండగా, సిబ్బంది ఎవరికీ హాని కలగలేదు. ఈ ఘటన తర్వాత అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ఇరాన్‌లోని పది ముఖ్యమైన సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులు చేసింది.
సాంకేతికత ఎంత పెరిగినా వైద్యానికి ప్రత్యామ్నాయం కాలేదనే చేదు నిజాన్ని మరోసారి నిరూపించింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా మధిరలో బహిరంగ సభ నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు తేల్చేశారు. హెలికాప్టర్ ప్రయాణానికి వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడం, మైదానాలు వాన నీటితో నిండిపోవడంతో ముఖ్యమంత్రి పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు.
గత కొంతకాలంగా ప్రేమించుకున్న యువతి, యువకుడు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు
ప్రభుత్వం చేపట్టిన ఎస్‌ఐఆర్ సర్వే, నివేదికల ప్రక్రియ ముజీబుర్ రహ్మాన్ జీవితంలో తీవ్ర ఆందోళనను నింపింది. ఈ ఎస్‌ఐఆర్ జాబితాలో తన పేరు లేదనే విషయం అతనికి తెలిసింది. తన పేరు నమోదు కాకపోవడంతో భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా వచ్చే ఎటువంటి సహాయం లేదా పెన్షన్లు, రేషన్ వంటి ప్రయోజనాలు తన ఇద్దరు దివ్యాంగులైన పిల్లలకు అందవేమోనని అతనుఆందోళనకుగురయ్యాడు.
ఆయన ఐదు రోజుల్లో నాలుగు రోజుల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో పేదల సేవలో కార్యక్రమం ద్వారా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు లబ్థిదారులకు అంద జేస్తారు. అదే రోజు తిరుపతి చేరుకుని అక్కడి శ్రీసిటీలో.. హీరో మోటో కార్ప్ సుమా . 750 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న గ్లోబల్ పార్ట్స్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి శ్రీసిటీలోనే బస చేస్తారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ అత్యంత దారుణ హత్యకు గురైన ఉదంతం
ఎల్ నినో కారణంగా తలెత్తే సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలనీ, ప్రకృతి సాగుతో పంటలు పండించి, భూమిని, ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకుందామని ఆయన పేర్కొన్నారు.
బజాజ్ ఆటో భవిష్యత్తు వృద్ధి కోసం సరికొత్త మల్టీ-ప్లాట్‌ఫామ్ వ్యూహాన్ని ప్రకటించింది. 125cc ప్లస్ మోటార్‌సైకిళ్లు, చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విస్తరణ మరియు 63,000 కోట్ల రూపాయల రికార్డు రెవెన్యూతో బజాజ్ ఆటో మార్కెట్లో దూసుకుపోతున్న తీరుపై ప్రత్యేక కథనం.
బిఎస్ఈ ఎస్ఎమ్ఈ మార్కెట్లో అనుభవ్ ప్లాస్ట్ Anubhav Plast షేర్లు ఫ్లాట్‌గా లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీఓ ధర, సబ్‌స్క్రిప్షన్ స్టేటస్ మరియు కంపెనీ ఫైనాన్షియల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కర్ణాటక ప్రభుత్వం మరియు పెరు దేశం మధ్య చారిత్రాత్మక ఒప్పంద ప్రతిపాదన. 10 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యంతో ఐటీ, ఏఐ, బయోటెక్ రంగాలు ఎలా మారబోతున్నాయో ఇప్పుడే చూడండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.