నకిలీ సర్టిఫికెట్ల గుట్టురట్టు.. బీహార్ లో 3వేల మందికి పైగా ఉపాధ్యాయులపై వేటు.!

Publish Date:Jul 9, 2026

Advertisement

బీహార్ విద్యాశాఖ   చరిత్రలోనే  భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ పట్టాలు, ఫోర్జరీ చేసిన విద్యా ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, మోసపూరిత మార్గాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించిన వారిపై ఉక్కుపాదం మోపింది. సుదీర్ఘ కాలంగా సాగిన విచారణ అనంతరం ఏకంగా 3 వేల 35 మంది టీచర్లను ఒకేసారి విధుల్లోంచి తొలగిస్తూ  బీహార్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.   

 2006 నుండి 2015 మధ్య కాలంలో జరిగిన ఉపాధ్యాయుల నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై   ప్రభుత్వం సం రాష్ట్ర విజిలెన్స్ బ్యూరోతో సమగ్ర విచారణ జరిపించింది.  విజిలెన్స్ అధికారులు  తమ దర్యాప్తులో ఆ కాలంలో నియమితులైన  ప్రతి   ఉపాధ్యాయుడి సర్టిఫికెట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సుదీర్ఘ విచారణ ముగిసిన తర్వాత విజిలెన్స్ బ్యూరో సమర్పించిన అ నివేదిక ఆధారంగా  విద్యాశాఖ మూడు వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. 

  విచారణలో వెలుగులోకి వచ్చిన   విషయాలు అధికారులను విస్మయపరిచాయి. చాలామంది అభ్యర్థులు అసలు ఉనికిలోనే లేని నకిలీ కాలేజీల పేరుతో సర్టిఫికెట్లను సృష్టించినట్లు విచారణలో వెలుగులోకి వచ్చింది. అలాగే కొందరు ఒరిజినల్ సర్టిఫికెట్లను కంప్యూటర్ల సాయంతో ఫోర్జరీ చేసి ప్రభుత్వ కొలువులు దక్కించుకున్నట్లు వెల్లడైంది.  ఈ అక్రమాలకు పాల్పడిన నిందితులపై ప్రభుత్వం కేవలం శాఖాపరమైన చర్యలతో సరిపెట్టలేదు. ఈ కుంభకోణంలో నిందితులుగా తేలిన 3,035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 1,830 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. అంతే కాకుండా ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా, వీరు సర్వీసులో ఉన్న కాలంలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ప్రతి రూపాయిని తిరిగి వసూలు చేయాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు విద్యాశాఖ రికవరీకి ఆదేశాలు జారీ చేసింది.  

 Bihar fake teachers, bihar education department,  Dismisses teachers, fake certificate scam,  vigilance bureau investigation,  

By
en-us Political News

  
గురుగ్రామ్ ఐవీఎఫ్ డీఎన్ఏ వివాదం నేపథ్యంలో దేశంలోని ఐవీఎఫ్ క్లినిక్‌లు, స్పెర్మ్ బ్యాంకులపై జాతీయ మహిళా కమిషన్ NCW కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో కొత్త నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఆ వివరాలు ఇక్కడ చదవండి.
భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఐవీఎఫ్ IVF , ఏఆర్టీ ART క్లినిక్‌లలో జరుగుతున్న అక్రమాలు, ఆర్థిక దోపిడీని అరికట్టేందుకు జాతీయ మహిళా కమిషన్ NCW రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆశా మీనన్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. మహిళల పునరుత్పత్తి హక్కులు మరియు భద్రతను కాపాడటమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తైతే, ఇన్వెస్ట్ చేశాక క్రమశిక్షణ పాటించడం మరో ఎత్తు. ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకుల్లో చేసే 3 సాధారణ తప్పులు, వాటి వల్ల జరిగే భారీ నష్టాలు మరియు నిపుణుల కీలక సూచనలు ఈ స్టోరీలో తెలుసుకోండి.
ఎన్‌ఎస్ఈ ఎమర్జ్‌లో ఐసీ ఎలక్ట్రికల్స్ ఐపీఓ 67.7 శాతం భారీ ప్రీమియంతో బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ సాధించింది. 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకిన ఈ రైల్వే షేరు ఆర్థిక వృద్ధి వివరాలు ఇక్కడ చూడండి.
అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత గ్రూప్ బిగ్ డీమెర్జర్ తర్వాత సరికొత్త జూన్ త్రైమాసిక ఫలితాలు వచ్చాయి. వేదాంత పవర్ సేల్స్ ఏకంగా 245 శాతం పెరగగా, ఐరన్ అండ్ స్టీల్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకింది. వేదాంత అనుబంధ కంపెనీల లేటెస్ట్ స్టాక్ మార్కెట్ ప్రదర్శన, షేర్ల ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బెంగళూరు కోరమంగళలోని ప్రసన్న గణపతి ఆలయానికి టెక్కీ గణేశా గా ఎందుకు పేరొచ్చింది? సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ప్రమోషన్ల కోసం ఈ గుడికి క్యూ కడుతున్న ఐటీ భక్తుల పూర్తి వివరాలు మీకోసం.
గోల్డియామ్ ఇంటర్నేషనల్ షేరు ధర ఒకే రోజు 24 శాతం పడిపోవడానికి కారణం క్రాష్ కాదు, 1:3 బోనస్ షేర్ల సర్దుబాటు. ఈ బోనస్ లెక్కలు మరియు ఇన్వెస్టర్ల లాభాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూరోపియన్ యూనియన్ కొత్తగా కార్లలో డ్రైవర్ ముఖంపై నిఘా పెట్టే కెమెరా సిస్టమ్‌ ADDW ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ ప్రైవసీ ఆందోళనలను ఎలా పెంచుతోందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
2026 పాపులర్ గేమ్ జీరో పరేడ్స్ ఫర్ డెడ్ స్పైస్ నుండి సరికొత్త మేజర్ అప్‌డేట్ వచ్చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా, అసలు గేమ్ లేకపోయినా ఆడుకునేలా ఉచిత టేబుల్‌టాప్ వెర్షన్‌ను డెవలపర్లు విడుదల చేశారు. పూర్తి వివరాలు మరియు స్టీమ్ డిస్కౌంట్ ఆఫర్లు ఇక్కడ చూడండి.
చైనా అత్యున్నత సైన్స్ అవార్డు గెలుచుకున్న ఇద్దరు పల్లెటూరి శాస్త్రవేత్తలు చెన్ లిక్వాన్, బెన్ డే ల అద్భుత విజయ గాథ. ఈవీ బ్యాటరీలు, ఫైటర్ జెట్ రాడార్ సాంకేతికతలో వారు సృష్టించిన విప్లవం గురించి ఇక్కడ చదవండి.
మాజీ ప్రధానమంత్రి దివంగత సీవీ నరసింహరావు గతంలో ఒక సారి ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అన్నారు. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా.. మనవడికి ఆటబొమ్మలాంటి తాతే అని రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో, పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీ అయినా.. గారాల మనవడు అడిగితే.. వంటింట్లో గరిట పట్టాల్సిందే.
దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీతో పాటు ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల లేటెస్ట్ బంగారం ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ పన్నిన సరికొత్త కుట్రను ఇజ్రాయెల్ నిఘా వర్గాలు బయటపెట్టాయి. అగ్రరాజ్యాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ సంచలన ఇంటెలిజెన్స్ నివేదిక పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.