ఇన్ చార్జి డీజీపీపై ఎన్నికల సంఘం వేటు.. ఇంత ఆలస్యంగానా?

Publish Date:May 6, 2024

Advertisement

ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ  రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ  వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.  

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటల వ్యవథిలో బెంగాల్ డీజీపీపై వేటు వేసిన ఎన్నికల సంఘం, ఏపీలో ఇన్ చార్జ్ డీజీపీని మార్చడంలో చేసిన తాత్సారం విమర్శలకు తావిస్తోంది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేసినా పట్టించుకోని ఎన్నికల సంఘం.. ఇక చివరి క్షణంలో ఇక తప్పని సరి పరిస్థితుల్లో, అదీ బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై అధకార పార్టీ మూకలు దాడి చేసిన తర్వాత బదలీ వేటు వేసింది.  కానీ  ఎన్నికల షెడ్యూల్ విడుదలైన ఈ నెలన్నర వ్యవధిలో సీఎం రేమేష్ పై దాడికి   ముందు జరిగిన అరాచకాలు, దౌర్జన్యాలూ, దాడులను ఎన్నికల సంఘం చూసీ చూడనట్లు వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తినా పెడచెవిన పెట్టింది.

వాస్తవానికి ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి.  ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా  ట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అన్నిటికీ మించి ఆయన ఇన్ చార్జ్ డీజీపీయే.  ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని విమర్శలు ఎదుర్కొంటున్నారు.  వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని తెలుగుదేశం  ఆరోపణలు చేసింది. వీటి వేటికీ స్పందించని ఎన్నికల సంఘం బీజేపీ అభ్యర్థిపై దాడి జరిగే సరికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని గుర్తించింది. మరీ ముఖ్యంగా సరిగ్గా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రావడానికి ఒక రోజు ముందు ఇన్ చార్జి డీజీపీపై వేటు వేసింది.

ఇప్పుడు ఇక వారం రోజులలో ఎన్నికలు జరగనుండగా కొత్తగా వచ్చే డీజీపీ పోలీసుల పని తీరును సమూలంగా మార్చేందుకు ఏం చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో విపక్షాలు ప్రచారం చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం ఇష్టం లేదన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా పోలీసు శాఖ పని చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైనా పోలీసుల పనితరులో మార్పు వచ్చి.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చక్కబడుతుందేమో చూడాలి.  

By
en-us Political News

  
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-8
కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి డౌట్‌గానే వున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చేరిస్తే భారీ స్థాయిలో ప్రచారం, ట్రోలింగ్ మొదలైపోతుంది కాబట్టి, ఇంట్లోనే ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ బొమ్మ ఎత్తిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపుపై సొంత పార్టీ నేతలే నమ్మకం కోల్పోయారు. రెండు వారాల కిందట ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. పోటీ హోరాహోరీగా జరుగుతుందని అంతా భావించినా పోలింగ్ తరువాత సీన్ అందరికీ అర్ధమైపోయింది.
చెన్సైలో లేడీస్ హాస్టల్లో లాప్‌టాప్‌కి ఛార్జింగ్ పెడుతూ శరణిత (32) అనే మహిళ మరణించారు.
ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో క‌విత బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణను ఢిల్లీ హైకోర్టు మంగ‌ళ‌వారానికి వాయిదా వేసింది. సీబీఐ, ఈడీ కేసుల్లో దాఖ‌లైన బెయిల్ పిటిష‌న్ల‌పై జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ రేపు తదుపరి విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు. కాగా, త‌న పిటిష‌న్ల‌లో క‌విత బెయిల్‌తో పాటు అరెస్టు, రిమాండ్‌ను ఆమె స‌వాల్ చేశారు. 
భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భార‌తి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు.
పన్నెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. ఔను 2012 మే 27న జగన్ ను సీబీఐ అరెస్టు చేసింది. అంటే సరిగ్గా పుష్కర కాలం కిందట అన్న మాట. ఆ విధంగా చూస్తు జగన్ కు ఇది పన్నెండవ జైలు వార్షికోత్సవం.
పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు ఓటమి అనివార్యమేనా, స్వయంగా వైసీపీ నేతలే ఆయన ఓటమిని కోరుకుంటున్నారా? పలాస ప్రజానీకం కూడా అహంభావి అయిన సిదిరి అపపలరాజుకు మరో అవకాశం ఇవ్వకూడదని డిసైడైపోయి ఓటు వేశారా? అన్న ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానం వస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిదిరి అప్పలరాజు తీరు పూర్తిగా మారిపోయిందని జనం భావిస్తున్నారు. వైసీపీ క్యాడర్ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు.
ఎపిలో త్రి కూటమి అభ్యర్థులు విజయపథంలో దూసుకెళ్లనున్నారు. పోలింగ్ తర్వాత ఈ అంచనాలు రావడంతో వైసీపీ నాయకత్వం ఆత్మరక్షణలో పడిపోయింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఫలితం వచ్చే నెల 4న వెలువడనుంది. అయితే అంచనాలు, విశ్లేషణలూ అన్ని కూడా ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని తేల్చేస్తున్నాయి. వైసీపీ లీడర్లు, క్యాడర్ లో కూడా ఓటమి కళ కనిపిస్తోంది. వారి భాషలోనూ, బాడీ లాంగ్వేజ్ లోనూ కూడా ఓటమిని అంగీకరించేసిన తీరు వినిపిస్తోంది. కనిపిస్తోంది. అయితే కొందరు వైసీపీ నేతలు మాత్రం విజయంపై ధీమా పేరుతో చేస్తున్న అతి నవ్వుల పాలౌతోంది.
వైసీపీ నాయకులు తాము గెలవబోతున్నామనే దానికి మరికొన్ని‘ఆధారాలను’ చూపిస్తూ ఆనందపడిపోతున్నారు. ఆ ‘ఆధారాలు’ ఏమిటో చూస్తే, కొంతమంది వైసీపీ నాయకుల మెంటల్ కండీషన్ ఏ స్థాయిలో వుంది అర్థమవుతుంది.
కృష్ణాజిల్లా పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థి బోడె ప్రసాద్ విక్టరీ ఖాయమైంది.
ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలపై కూడా ఆయ‌న నోటి దూల తీర్చుకుంటున్నారు. డబ్బుల కోసం ఎలా కావాలంటే అలా జాతకాలు చెబుతాడని పేరు తెచ్చుకున్న ఆయన, వైసీపీ పెయిడ్ చానల్స్ లో జగన్ గెలుస్తాడని జోస్యాలు చెబుతూ హడావుడి చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.