మీకు ఉదయాన్నే ఈ అలవాట్లు ఉన్నాయా? వెంటనే మానేయడం మంచిది..

Publish Date:Feb 13, 2025

Advertisement

 

శరీరాన్ని ఆరోగ్యంగా,  దృఢంగా ఉంచుకోవడానికి, సరైన ఆహారం, సరైన  జీవనశైలిని నిర్వహించడం చాలా ముఖ్యం.  రోజంతా ఏమి చేస్తారు, ఏమి తింటారు,  రోజును ఎలా గడుపుతారు అనేవి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా  రోజును ఎలా ప్రారంభిస్తారనేది  ఆరోగ్యానికి డైరెక్ట్ గా లింక్ కలిగి ఉంటుంది.అందుకే ఆరోగ్య నిపుణులు రోజూ ఉదయాన్నే ప్రజలు ఫాలో అయ్యే కొన్ని చెడ్డ అలవాట్ల గురించి చెప్పుకొచ్చారు.  ఈ అలవాట్లు వెంటనే మానేయడం వల్ల ఆరోగ్యం విషయంలో చాలా మంచి మార్పులు వస్తాయని కూడా పేర్కొన్నారు.  ఇంతకీ ఉదయాన్నే మానుకోవాల్సిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.

అల్పాహారం తరువాత..

 ఉదయం నిద్రలేచి, అల్పాహారం తీసుకుని, మళ్ళీ నిద్రపోయేవారు ఉంటారు.  ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది.  ఇలాంటి ఆహారపు అలవాటు ఉన్నవారు  అనేక కడుపు సంబంధిత సమస్యలతో బాధపడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తరచుగా  ఉదయం నిద్రలేవగానే మొబైల్ లేదా టీవీ చూడటం చాలామందికి అలవాటైపోయింది. ఈ అలవాటు చిన్నదిగా అనిపిస్తుంది.  కానీ ఇది  వయస్సుకు ముందే వ్యక్తులను వృద్ధులను చేస్తోంది. మొబైల్ ఫోన్‌ను అధికంగా వాడటం వల్ల కళ్ళు,  మెదడుపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇది నిద్ర నాణ్యతను కూడా ప్రభావితం చేస్తుంది.

కాఫీ, టీ..

చాలా మంది టీ లేదా కాఫీ తాగడం ద్వారా తమ రోజును ప్రారంభిస్తారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కెఫిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది గుండె,  రక్తపోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.

ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం   జీర్ణ ఆరోగ్యానికి మంచిది కాదు, ఈ అలవాటు వల్ల గ్యాస్, మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి.

వైద్యులేమంటారంటే..

ఆరోగ్యంగా ఉండటానికి  దినచర్యను మెరుగుపరచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూసే అలవాటు ప్రమాదకరం. దానికి బదులుగా వార్తాపత్రికలు లేదా పుస్తకాలు చదవాలి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఇది  మెదడుకు శక్తినిస్తుంది.  దీని వల్ల  రోజు ఆరోగ్యంగా  ప్రారంభమవుతుంది. చాలా మంది ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేయకుండా ముఖం, చేతులు కడుక్కున్న తర్వాత పనికి వెళతారు. ఈ అలవాటును క్రమం తప్పకుండా అలవాటు చేసుకోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  అనేక అంటు వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంది.  దినచర్య,  రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకుంటే ఆరోగ్యంగా ఉండటం సులభం అవుతుంది.


                                              *రూపశ్రీ.

By
en-us Political News

  
అశ్వగంధ ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలిక. ఇది ఒత్తిడిని తగ్గించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో,  శారీరక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దాని వేర్లు గుర్రపు వాసన రావడం వల్ల దీనికి అశ్వగంధ అనే పేరు వచ్చిందట....
ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటోంది.  ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్క ఫోన్ ఉంటుంది.  చాలా వరకు ఫోన్ ఎక్కడికి వెళ్లినా వెంట ఉంటుంది. ఇక చాలామందికి  ఉదయాన్నే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది...
ఎవరి ఇంటికైనా వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదని అంటారు.  అందుకే చాలామంది పండ్లు తీసుకెళతారు. ఇలా తీసుకెళ్లే పండ్లలో అరటికే ప్రథమ స్థానం ఉంటుంది.  కేవలం ఇలా తీసుకెళ్లడమే కాదు....
వయసు పెరిగే కొద్దీ  ఎముకలు పెళుసుగా,  బలహీనంగా మారతాయి. అయితే అనుసరించే జీవనశైలి,  అలవాట్లు బలమైన ఎముకలకు,  శరీరం  సాఫీగా కదలడానికి దోహదం చేస్తాయి. చాలా మంది మోకాళ్ సమస్య వచ్చేవరకు మోకాళ్ల గురించి అస్సలు ఆలోచించరు...
భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా...
నేటి బిజీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోంది. మధుమేహం గురించి చెప్పాలంటే నేటి కాలంలో ఇది ఒక సాధారణ వ్యాధిగా మారింది. గతంలో ఈ వ్యాధి వృద్ధులలో కనిపించేది, కానీ ఇప్పుడు మధుమేహం చిన్నవారిని కూడా ప్రభావితం చేస్తోంది....
శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు.
మంచి ఆరోగ్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని వైద్యులు చెప్పడమే కాకుండా ఆరోగ్యం మీద స్పుహ ఉన్న ప్రతి ఒక్కరూ అదే చెబుతారు. ఏది తిన్నా అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం పోషకాలతో సమతుల్యంగా ఉండాలని చెబుతారు. అంతేకాదు.. తీసుకునే ఆహారమే కాకుండా ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యమని చాలా మంది చెబుతారు. కానీ అధిక శాతం మంది తీసుకునే ఆహారం విషయంలో చూపించిన శ్రద్ద ఆహారం తీసుకునే సమయం విషయంలో అస్సలు చూపించరు...
కళ్ళు మన శరీరంలో అతి ముఖ్యమైన,  సున్నితమైన భాగం.
నేటి బిజీ జీవితంలో మానసిక ఒత్తిడి దాదాపు ప్రతి వ్యక్తి లైఫ్ లో  భాగంగా మారింది.
కాఫీ.. భారతీయులు ఎక్కువగా తీసుకునే పానీయాలలో ఒకటి.  
చాలా మంది రాత్రి నిద్రపోతున్నప్పుడు కాళ్ళ సిరలు అకస్మాత్తుగా ఉబ్బుతాయి.
రోగనిరోధక వ్యవస్థను శరీరానికి కవచం అని పిలుస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.