Publish Date:May 19, 2023
చిన్నప్పుడు మీరు దొంగాపోలీస్ ఆట ఆడే ఉంటారు. ఒక వేళ ఆడకపోయి ఉంటే.. ఆ ఆట ఎలా ఉంటుందో తెలియకపోతే.. ప్రస్తుతం జరుగుతున్న కడప ఎంపీ అవినాష్.. సీబీఐ ఎపిసోడ్ గమనిస్తే సరిపోతుంది. సరిగ్గా దొంగా పోలీస్ ఆటలాగే అవినాష్ సీబీఐ ఎపిసోడ్ సాగుతోంది. నిరాటంకంగా గత నాలుగు నెలల నుంచీ ఈ ఆట సాగుతూనే ఉంది. తొలుత సీబీఐ అవినాష్ కు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే.. అవినాష్ కోర్టులను ఆశ్రయించి, విచారణకు డుమ్మా కొట్టి.. కొన్ని సార్లు హాజరై ఇలా సీబీఐకి అందకుండా తిరిగారు.
ఆ తరువాత కోర్టులు అవినాష్ ను అరెస్టు చేసుకుని విచారించవచ్చని తేల్చిసిన తరువాత సీబీఐ పరుగులు మొదలు పెట్టింది. ఆ పరుగులు అవినాష్ ను అరెస్టు చేయడానికి కాకుండా చేయకుండా ఉండేందుకా అనిపించేలా సాగాయి. సరే చివరాఖరికి శుక్రవారం (మే19)న సీబీఐ అవినాష్ కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తే ఇదిగో వస్తున్నానంటూ చివరి క్షణంలో తల్లి అనారోగ్యం అంటూ డుమ్మా కొట్టారు. ఇక అక్కడ నుంచి ఛేజ్ మొదలైంది. అవినాష్ తల్లి పులివెందుల ఆస్పత్రిలో ఉన్నారంటూ అక్కడికి బయలుదేరిన అవినాష్ ను సీబీఐ వెంటాడింది. రెండు కార్లలో అవినాష్ వాహనాన్ని వెంబడించింది.
దారిలో అడుగడుగునా అవినాష్ అనుచరులు సీబీఐని నిలువరించేందుకు మోహరించారు. ఇదిలా ఉండగా పులివేందుల ఆస్పత్రిలో ఉన్న అవినాష్ తల్లిని మెరుగైన వైద్య చికిత్స కోసం అంటూ హైదరాబాద్ కు తరలిస్తుంటే తల్లితో పాటు అవినాష్ కూడా హైదరాబాద్ కు వస్తారని అంతా అనుకున్నారు.
అయితే అందుకు భిన్నంగా ఆయన బెంగళూరు వెళ్లారంటూ వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం విచారణకు డుమ్మా కొట్టానని చెబుతున్న అవినాష్ తల్లితో పాటు హైదరాబాద్ కు రాకుండా బెంగళూరు ఎందుకు వెళుతున్నారన్నది బిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అరెస్టును తప్పించుకోవడానికి, సీబీఐ కళ్లు గప్పి అజ్ణాతంలోకి వెళ్లడానికి అవినాష్ ఎత్తులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ దొంగా పోలీస్ క్రీడను పోలిన సీబీఐ, అవినాష్ క్రీడ చివరకు ఎలా ముగుస్తుందో? నని సర్వత్రా ఆసక్తిగా గమనిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-plan-to-obscand-39-155594.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.