Publish Date:May 30, 2023
మరి కొన్ని గంటలలో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా అంటే న్యాయనిపుణులు ఔననే అంటున్నారు. ఏపీ సీఎం జగన్ స్వంత బాబాయ్ వైఎస్ వివేకానాందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసిన నేపథ్యంలో అవినాష్ కు ముందస్తు బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమేనని అంటున్నాయి.
అయితే గత శనివారం (మే 27) తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాష్ ముందస్తు బెయిలు పిటీషన్ పై వాదనలు విన్న అనంతరం తీర్పును బుధవారం(మే31)కు వాయిదా వేసింది. అంతకు ముందు వరుసగా రెండు రోజుల పాటు అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు, డాక్టర్ సునీత తరఫు న్యాయవాదులు, సీబీఐ తరఫు న్యాయవాదులు సుదీర్ఘవాదనలు వినిపించాయి. ఆ తరువాత హైకోర్టు వేకేషన్ బెంచ్ తీర్పు బుధవారం(మే 31)కి వాయిదా వేసింది. 31వరకూ అవినాష్ ను అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు సీబీఐ దర్యాప్తు తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది.
అవినాష్ కు అరెస్టు కాకుండా ఎటువంటి రక్షణా లేకున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది? అవినాష్ ఫోన్ ను ఇంత వరకూ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని నిలదీసింది. కాగా అవినాష్ ముందస్తు బెయిలు పిటిషన్ పై వాదనలు క్లోజ్ గా ఫాలో అయిన న్యాయ నిపుణులు ఆయనకు యాంటిసిపేటరీ బెయిలు లభించే అవకాశాలు దాదాపు శూన్యమని చెబుతున్నాయి.
అసలు మొదటి నుంచీ సీబీఐ వర్సెస్ అవినాష్ టామ్ అండ్ జెర్రీని తలపించేలాగే సాగింది. సీబీఐ విచారణకు పిలిచినప్పుడల్లా ఏవేవో కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటారు. ఇక హాజరు కాక తప్పదన్న పరిస్థితి వస్తే కోర్టులను ఆశ్రయిస్తారు. గత జనవరి నుంచీ ఈ గేమ్ ఇలా సాగుతూనే ఉంది. ఇక చివరి అంకానికి వచ్చేసింది. అవినాష్ ముందస్తు బెయిలుపై తెలంగాణ హై కోర్టు వెకేషన్ బెంచ్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఉత్కంఠకు బుధవారం (మే 31) తెరపడుతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-anticipatory-bail-25-156090.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!