Publish Date:Jul 13, 2025
ఫ్లయిట్ యాక్సిడెంట్ జరిగిన రెండు మూడు రోజుల తర్వాత వెలుగు చూసిన కోణాల్లో ఇదీ ఒకటి. అదేంటంటే.. ఇంధన స్విచ్ ని ఆన్ చేయకుండానే అహ్మదాబాద్ టు లండన్ ప్లయిట్ టేకాఫ్ అయ్యింది. ఆ మాటకొస్తే ఫ్యూయల్ పాస్ కాకుండా ఫ్లయిట్ ఎలా టేకాఫ్ అయ్యిందని కొందరు అడిగిన ప్రశ్నకు వీరు చెప్పిన సమాధానం ఏంటంటే.. పైపుల్లో మిగులు గా ఉన్న ఇంధనంతో ఫ్లయిట్ పైకి లేచిందనీ.. ఇంతలో ఫ్యూయల్ అందక పోవడం వల్లే.. ఫ్లయిట్ టేకాఫ్ అయిన 32 సెకన్లకే క్రాష్ ల్యాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. టేకాఫ్ టైంలో స్విచ్చులతో ఆడుకునేంత తెలివి తక్కువ పైలెట్ ఎక్కడా ఉండడు. ఇదీ ఎయిర్ ఇండియా ఏఐ 171 క్రాష్ పై .. విడుదలైన ఏఏఐబి ప్రాథమిక నివేదికపై ఏవియేషన్ నిపుణుడు మార్క్ మార్టిన్ స్పందన. రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు ఆపేశారని, దీనివల్ల టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు ఆగిపోయాయని అంటోంది ఏఏఐబి రిపోర్ట్. ఒక వేళ అదే నిజమైతే.. 787 బోయింగ్ ఆపరేటర్లపై ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం పడుతుందని అంటారు మార్టిన్.
దానికి తోడు.. కేంద్ర విమానయాన మంత్రి కూడా ఇదే ఫైనల్ రిపోర్ట్ కాదని అన్నారు. దీన్నిబట్టీ చూస్తే ఫ్యూయల్ స్విచ్ మాత్రమే ఈ ప్రమాదంలో కీలకం కాదన్నది తెలుస్తూనే ఉంది. ఇక మార్టిన్ చెబుతున్నట్టు అలా జరిగే అవకాశముందా? అన్నది కూడా అత్యంత ముఖ్యమైన విషయమే. ఎందుకంటే ఒక ఫ్లైట్ పైలట్ సీట్ లో కూర్చున్నాక.. అన్ని స్విచ్ లను చెక్ చేసుకోవడం ఒక అలవాటుగా మార్చుకుంటారు. అంతే కాదు.. ఇక్కడ ఒకరికి ఇద్దరున్నపుడు.. అది మరింత ఎక్కువ జాగరూకతతో సాగుతుంది.
ఫ్లయిట్ ఇంధన స్విచ్ ని ఆపుకుని ఒక ఫ్లయిట్ టేకాఫ్ అయ్యిందంటే అది ప్రపంచ ఏవియేషన్ చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఎందుకంటే విమానం నడిచేదే ఇంధనం మీద. అలాంటి ఇంధనం స్విచ్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా? చూసుకోకుండా ఒకరికి ఇద్దరు పైలెట్లు టేకాఫ్ చేశారంటే.. అది ఫ్లయిట్ మేనేజ్మెంట్ కే కాదు పైలెట్ మేనేజ్మెంట్ కి కూడా అవమానకరమే.
మాములుగా మనం చిన్న కారు తోలితేనే.. అది ఫ్యూయల్ మార్క్ దగ్గర పదే పదే చూపిస్తుంది. అలాంటిది ఒక ఫ్లయిట్ ఇంకెంత ఇండికేట్ చేసి ఉండాలి. అది కూడా అల్ట్రా మోడ్రన్ అయిన బోయింగ్ ఫ్లయిట్ ఎంతగా హెచ్చరిస్తుంది? అన్న దగ్గరే అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్. మరి చూడాలి కాక్ పిట్ లో ఆ ఇద్దరు పైలెట్లు ఇంధన స్విచ్ సంభాషణే ఫైనల్ అవుతుందా? లేక మరేదైనా విషయం బయట పడుతుందా తేలాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aviation-experts-object-on-aaib-report-39-201898.html
దివంగత మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ కన్ను పడిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చావోరేవోగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో రెండు పార్టీలూ కూడా ఎన్టీఆర్ నామస్మరణ చేస్తున్నాయి. కేటీఆర్ అయితే ఏకంగా తనకు తన తండ్రి కేసీఆర్ ఎన్టీరామారావు పేరే పెట్టారంటూ సెంటిమెంట్ ప్లే చేశారు.
న్డీయేలో నిర్ణాయక శక్తిగా ఉన్న తెలుగుదేశం ఎన్డీఏ విజయం కోసం సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి విదితమే.
కేటీఆర్ హయాంలో స్కూలు ఎదుట కూడా గంజాయ్, డ్రగ్స్ దొరికేలాంటి కల్చల్ ఏర్పడిందని.. ఆయన హయాంలో పబ్ కల్చర్ పెరిగినంత మరెక్కడా పెరగలేదనీ.. సొంత బావమరిది ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీయే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు రేవంత్.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్రమోడీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రేవంత్ కు మాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న టీమ్ ఇండియా జట్టు సభ్యురాలు శ్రీచరణి ప్రభుత్వం పట్టించుకోలేదంటూ వైసీపీ విమర్శల రాగం మొదలు పెట్టింది. శ్రీచరణిని ఏపీ సర్కార్ పట్టించుకోలేదంటూ గగ్గోలు పెట్టేసింది. శ్రీకాంత్ రెడ్డి అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ ప్రభుత్వాన్ని విమర్శించేశారు.
గోపీనాథ్ బతికి ఉన్న కాలంలో ఎన్నడూ మాగంటి మొదటి భార్య అన్న ప్రస్తావనే రాలేదు. అసలు మాగంటి సునీత ఆయనకు రెండో భార్య అన్న విషయమే దాదాపుగా ఎవరికీ తెలియదు. కానీ మాగంటి మరణం తరువాత.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జూబ్లీ ఉప ఎణ్నిక ముంగిట మాగంటి కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది.
మాగంటి గోపీనాథ్ తొలిభార్య మాలినీ దేవికి పుట్టిన తారక్ ప్రద్యుమ్న ఇంటి పేరు కొసరాజుగా ఉంది. అదే సునీతకు పుట్టిన పిల్లల ఇంటి పేరు మాగంటిగా ఉంది. ఇందుకు తగిన సాక్ష్యాధారాలు సైతం వారి దగగర పదిలంగా ఉన్నాయంటారు మాగంటి సునీతకు చెందిన న్యాయవాదులు.
2009 ఎన్నికలలో మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి కరణం బలరాంపై విజయ ఢంకా మోగించారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరిన రవికుమార్ బలరాం కుమారుడు కరణం వెంకటేష్ పై పోటీ చేసి విజయం సాధించారు. అనంతర పరిణామాలలో గొట్టిపాటి ఫ్యాను పార్టీని వీడి సైకిల్ ఎక్కారు.
తొలి విడతలో పోలింగ్ విషయానికి వస్తే.. మహిళలు అత్యధికంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటింగ్ శాతం పెరగడం అధికార కూటమికా, లేక ఇండియా కూటమిగా ఎవరికి ప్లస్ కానుందన్న చర్చ అప్పుడే మొదలైంది. అలాగే.. జనసురాజ్ పార్టీ ప్రభావం ఏమేరకు ఉంటుందన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.
కోర్టు షరతును ఉల్లంఘిస్తాను అనుమతి ఇవ్వండి అంటూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రచార వేడి రోహిణీకార్తెను మించిపోతున్నది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో నియోజకవర్గం హోరెత్తిపోతున్నది. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ఈ తీరు పెరిగిపోతున్నది.
2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.