పప్పూయాదవ్ దాడి.!
Publish Date:Aug 2, 2026
Advertisement
దేశ రాజధాని హస్తినలో ఎంపీ పప్పుయాదవ్ పై దాడి యత్నం జరిగింది. బిహార్లోని పూర్ణియా నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా విజయం సాధించిన రాజేష్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్పై హస్తినలో ఆయన అధికారిక నివాసంలోనే దాడి జరగడం కలకలం రేపింది. వ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం (ఆగస్టు 2) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పప్పూయాదవ్ పై ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అదే సమయంలో మరో వ్యక్తి.. కత్తితో దాడికి ప్రయత్నించాడు. పప్పు యాదవ్ సిబ్బంది, మద్దతుదారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దాడితో ప్రెస్మీట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ మద్దతుదారులు చెప్పు విసిరిన వ్యక్తిపై భౌతిక దాడికి ప్రయత్నించారు. అయితే.. ఎంపీ పప్పు యాదవ్ ఆ దాడి జరగకుండా నివారించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాధు సంత్ ల పట్ల పప్పు యాదవ్ అనుచితంగా మాట్లాడారనే ఆగ్రహంతోనే తాను ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు తెలిపినట్లు సమాచారం. కాగా ఈ దాడి ఘటనపై పప్పుయాదవ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు జరిగాయని తాను బహిరంగంగా ఆరోపించినప్పటి నుంచీ, తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయన్నారు. కొందరైతే తన 51 లక్షల రివార్డు ప్రకటించారని తెలిపారు. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిజాలను నిర్భయంగా మాట్లాడే ప్రజాప్రతినిధులపై ఇలాంటి దాడు దాడులు దారుణమని పప్పుయాదవ్ అన్నారు.
Pappu Yadav shoe thrown, Purnia MP attack Delhi, Ram Mandir donation controversy, Pappu Yadav knife attack attempt, Telugu One
http://www.teluguone.com/news/content/attack-on-pappu-yadev-36-227828.html





