హమ్మయ్య వర్షాలు పడుతున్నాయి.!

Publish Date:Jul 16, 2026

Advertisement

వానాకాలంలో కూడా మండు వేసవిని తలపిస్తున్న వాతావరణం నుంచి తెలంగాణకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో  తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి.  ఈ నెల 22వ తేదీ వరకు రాష్ట్రం వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. 

బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతంలో  ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా  కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో   తెలంగాణలో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాలలో  ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం (జులై 17)   తెల్లవారుజామున హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.  

ఇలా ఉండగా గురువారం (జులై 16) రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో  ఓ మోస్తరు వానలు పడ్డాయి.  

 ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో  ఖరీఫ్ సాగు పనులు మందగించిన తరుణంలో  అల్పపీడనం కారణంగా కురుస్తున్న ఈ వర్షాలు వ్యవసాయ పనులకు ఊతమిస్తాయని, పంటలకు జీవం పోస్తాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Telangana Weather,  Low Pressure Bay of Bengal, Hyderabad Rains, IMD Hyderabad Forecast, Telangana Monsoon Rains 

By
en-us Political News

  
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు.
విద్యారంగంలో సంస్కరణలు పూర్తయ్యాయని, ఫలితాలపై దృష్టిపెట్టాలని అధికారులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
చిన్న జ్వరం వచ్చినా, భుజం నొప్పి పెట్టినా, ఆఖరికి పన్ను బిగించుకోవాలన్నా.. ఏపీ నాయకులు వెంటనే హైదరాబాద్ విమానమెక్కుతారు
హైడ్రా కమిషనర్ పదవి నుండి తొలగించండి హైకోర్టు ప్రభుత్వన్నికి ఆదేశం..! 
సీఎంను కలిసి మూడు రోజులకే గిరిజన విద్యార్థిని సుసైడ్..!
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన రిచ్ కిడ్స్ ట్రాప్ ఘటన ఇంకా మరవకముందే, అదే తరహాలో సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకుని మైనర్ బాలికలను ప్రేమ
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు గ్రామంలో ప్రతిపాదిత శ్రీరామ మందిర నిర్మాణానికి ఎదురైన చట్టపరమైన ఆటంకాలు తొలగిపోయాయి.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది.
నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..!
తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం
స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసుల గాలింపు..!
బీజేపీ ఎంపీ ఇంట్లో చెలరేగిన పొలిటికల్ రచ్చ..!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురు స్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.