నాయకులకే నమ్మకం లేని ఏపీ వైద్యం..హైదరాబాద్‌కి పరుగుల వెనుక నిజాలేంటి..?

Publish Date:Jul 27, 2026

Advertisement

 

చిన్న జ్వరం వచ్చినా, భుజం నొప్పి పెట్టినా, ఆఖరికి పన్ను బిగించుకోవాలన్నా.. ఏపీ నాయకులు వెంటనే హైదరాబాద్ విమానమెక్కుతారు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల బాట పడతారు. కానీ, అదే రాష్ట్రంలో రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్యుడికి అనారోగ్యం వస్తే? సొంత ఆస్తులు అమ్ముకుని, ఊళ్లలో అప్పులు చేసి, చేతిలో ఉన్న పైసలన్నీ పక్క రాష్ట్రంలోని ఆసుపత్రులకు ధారపోస్తూ అంపశయ్యపై కొట్టుమిట్టాడుతున్నారు. పాలించే పాలకులకే తమ రాష్ట్ర వైద్య విధానంపై నమ్మకం లేనప్పుడు, నమ్మి ఓటేసిన జనం ఏమైపోవాలి? ఇది కేవలం రాజకీయాల ప్రశ్న కాదు.. లక్షలాది మంది సామాన్య కుటుంబాల జీవిత మరణాల సమస్య. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర చర్చ నిర్వహించారు.

పాలకుల పరుగు.. పేదల బలిపశువులువిభజన తర్వాత స్వంత రాష్ట్రాన్ని కట్టుకుంటామని గొప్పగా చెప్పిన నాయకులు, కనీసం ఒక అత్యుత్తమ ప్రభుత్వాసుపత్రిని, పరిశోధనా కేంద్రాన్ని ఎందుకు తీర్చిదిద్దలేకపోయారు? గుంటూరు, విశాఖ, కర్నూలు, తిరుపతి వంటి చారిత్రాత్మక మెడికల్ కాలేజీల నుంచి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డాక్టర్లు తయారయ్యారు. మంగళగిరిలో ఎయిమ్స్ (AIIMS) వంటి ఉన్నత వైద్య సంస్థ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ చిన్నపాటి ఆరోగ్య సమస్య రాగానే సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. పాలకులే కార్పొరేట్ దవాఖానాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతుంటే, సామాన్య ప్రజలలో తీవ్రమైన భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. "నాయకులే ఏపీలో చికిత్స చేయించుకోవడం లేదంటే, ఇక్కడ డాక్టర్లు సరిగా లేరా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన మిషన్లు లేవా?" అనే అనుమానంతో మధ్యతరగతి, పేద ప్రజలు తమ సర్వస్వాన్ని అమ్ముకుని హైదరాబాద్‌కి పరుగులు తీస్తున్నారు.

నలిగిపోతున్న సంసారాలు.. అప్పుల ఊబిలో సామాన్యుడుకోవిడ్ కాలం నుండి నేటి వరకు ఏపీ నుంచి వేల కోట్ల రూపాయలు పక్క రాష్ట్రపు కార్పొరేట్ హాస్పిటళ్లకు తరలిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఎక్స్‌రే, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ (MRI) వంటి ప్రాథమిక సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. ఆరోగ్యశ్రీ పేరు చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంపై ఉన్న శ్రద్ధ, సొంత రాష్ట్రాన్ని 'మెడికల్ హబ్'గా మార్చడంపై పాలకులకు లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యం వల్ల ఏపీలోని పేద కుటుంబాలు అనుభవిస్తున్న నరకం వర్ణనాతీతం. ఇంట్లో ఒక్కరికి పెద్ద జబ్బు చేస్తే చాలు.. పొలాలు అమ్ముకోవాల్సి వస్తోంది, ఆడాళ్ల పుస్తెల తాళ్లు కుదవబెట్టాల్సి వస్తోంది. హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులు కట్టలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పాలకుల బాధ్యతారాహిత్యం వల్ల సామాన్యుడి ప్రాణాలకు, ఆరోగ్యానికి ఏమాత్రం రక్షణ లేని పరిస్థితి దాపురించింది.

కావాల్సింది ప్రచారాలు కావు.. ఆత్మపరిశీలన.. కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును నాణ్యమైన ప్రజా వైద్యం కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదు? ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులకు పదవులు కట్టబెట్టడంపై ఉన్న ధ్యాస, ప్రభుత్వ వైద్యశాలలను బలోపేతం చేయడంపై ఏ నాయకుడికీ లేదు. నాయకులకు కాస్తయినా ఇంగితజ్ఞానం, సామాజిక బాధ్యత ఉంటే.. ముందుగా తమ సొంత రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. పాలకులు ఇక్కడే చికిత్స పొంది భరోసా ఇచ్చినప్పుడే, సామాన్యుడు ధైర్యంగా జీవించగలడు. ఏపీ ప్రజా ఆరోగ్యం నామరూపాలు లేకుండా పోకముందే, పాలకుల తీరు మారాలి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.

 

 

AP Healthcare System, AP Ministers Hyderabad Treatment, AIIMS Mangalagiri, AP Government Hospitals, Tone News,  AP Health Report, AP Political News Telugu, Sunkara Venkateswara Rao Analysis, AP Health Infrastructure, Arogyasri Scheme AP

By
en-us Political News

  
ప్రస్తుతం నేషనల్ హైవే నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా కనెక్టివిటీ కల్పించే రహదారి, ఫ్లై ఓవర్ నిర్మాణాలు, సర్కిల్ విభాగాలు, ల్యాండ్‌స్కేపింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రారంభోత్సవ సమయానికి అవసరమైన ప్రధాన మౌలిక వసతులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సిబ్బంది, వర్కర్లు నిరంతరం శ్రమిస్తున్నారు. విమానాశ్రయ ప్రాంగణంలోనే ప్రముఖుల ప్రసంగాలు, బహిరంగ సభ కోసం భారీ వేదికను సిద్ధం చేస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ నేతృత్వంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలోజరిగిన తొక్కిసలాటలో 41 మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించిన విజయ్, వారికి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు, తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
తాము ఏడడుగులు నడిచి, వివాహ బంధంతో ఒక్కటైన మరుక్షణం నుంచీ.. తన భర్త పవన్ కల్యాణ్ ఇంటిపేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారిపోయానన్నారు. ఈ పేరులోనే తనకు పరిపూర్ణత, ఆత్మసంతృప్తి లభిస్తున్నాయని ఎమోషనల్ గా పేర్కొన్నారు.
రావలకోట్‌లోని ప్రధాన మార్గాల్లో నిరసనలు తెలుపుతున్న ప్రజా సమూహంపైకి పాకిస్తాన్ రేంజర్స్ విరుచుకుపడ్డాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు తొలుత భాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు, ఆపై ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే కాల్పులకు తెగబడ్డారు.
కోట్లి జిల్లాలోని నిక్యాల్ ప్రాంతంలో పోలింగ్ జరుగుతుండగా.. జరిగిన కాల్పుల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కి చెందిన 35 ఏళ్ల ముఖ్తార్ యూనస్ మరణించాడు.
చైనీస్ చిప్‌మేకర్ చాంగ్ క్సిన్ 470% లిస్టింగ్ జంప్ సాధించి అర ట్రిలియన్ డాలర్ల విలువను తాకింది. ఈ గ్లోబల్ సెమీకండక్టర్ రేసులో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ద్వారా భారత్ ఎలాంటి సవాళ్లను అధిగమించి గ్లోబల్ లీగ్‌లోకి అడుగుపెట్టవచ్చో వివరంగా తెలుసుకోండి.
క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోవడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కోలుకున్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు లాభపడగా, ఆర్‌బిఐ చర్యలతో రూపాయి కూడా బలపడింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి!
మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టిన నూతన AI సెక్యూరిటీ టూల్స్ ప్రాజెక్ట్ పెర్సెప్షన్ మరియు MAI Cyber 1 Flash ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్‌ల కంటే 12% మెరుగైన 96% స్కోరుతో, సగం ధరకే లభిస్తున్నాయి. దీని పూర్తి సాంకేతిక వివరాలు మరియు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకోండి!
ర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది.
ప్రపంచంలోనే మొట్టమొదటి 2nm x86 సర్వర్ ప్రాసెసర్ AMD EPYC 9006 Venice విడుదల వివరాలు. 256 కోర్లు, 512 థ్రెడ్లు, PCIe 6.0 సపోర్ట్ మరియు 1.6 TB/s బ్యాండ్‌విడ్త్‌తో రాబోతున్న ఈ సూపర్ చిప్ విశేషాలు తెలుసుకోండి.
E20 పెట్రోల్ అంశంలో తనపై, తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారం మరియు డీప్‌ఫేక్ పోస్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెటా, గూగుల్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలపై పరువు నష్టం దావా వేసేందుకు బొంబాయి హైకోర్టు అనుమతి ఇచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వేర్వేరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కేటగిరీలలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్, లార్జ్ & మిడ్ క్యాప్ ఫండ్లలో దాదాపు 79.4% వరకు పోర్ట్‌ఫోలియో ఓవర్‌లాప్ ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. మీ పెట్టుబడులను ఎలా కాపాడుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు మరియు విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ మధ్య భారత రూపాయి ఎలా బలమైన ప్రదర్శన ఇచ్చిందో తెలుసుకోండి. ఆర్బీఐ తీసుకున్న సంచలన వ్యూహాత్మక చర్యలు, విదేశీ ద్రవ్య ప్రవాహాల పెంపుదల మరియు ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం గురించి సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.