Publish Date:Feb 12, 2026
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రమైన ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదని మండిపడుతూ ఓ కాంగ్రెస్ అభ్యర్థి నడ్డిరోడ్డుపై హంగామా చేయడం చర్చనీయాంశ మైంది. అశ్వారావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, ఎన్నికల సమయం లో పంచిన డబ్బులు మరియు కుక్కర్లు వెనక్కి ఇవ్వాలని ప్రజలను డిమాండ్ చేస్తూ“నాకు ఓటు వేయకపోతే పంచిన డబ్బులు, కుక్కర్లు ఎందుకు తీసుకున్నారు?” అంటూ ప్రజలను నిలదీస్తూ అవమానకరంగా మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆ అభ్యర్థి నడ్డిరోడ్డుపై రచ్చ రచ్చ సృష్టించడంతో అక్కడికి చేరుకున్న ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యచకితు లయ్యారు. అభ్యర్థి చేసిన వ్యాఖ్యలపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “డబ్బులు, కుక్కర్లు ఇవ్వమని ఎవరడిగారు? ఎందుకు ఇలా అవమానిస్తు న్నారు?” అంటూ పలువురు ప్రజలు అతన్ని ప్రశ్నించారు. ఈ ఘటనతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ఈ వ్యవహారాన్ని వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియా లో షేర్ చేయడంతో విషయం మరింత వైరల్ అయింది.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాల్సిన సందర్భంలో, ఓటు వేయలేదనే కారణంతో ప్రజలను అవమానించడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ ఘటనపై ఎన్నికల అధికారులు లేదా పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఎన్నికల సమయంలో డబ్బులు లేదా బహుమతులు పంచడం చట్టవిరుద్ధమనే విషయం తెలిసిందే. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపడతారా.. లేదా వేచి చూడాల్సిందే..అశ్వారావుపేటలో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ashwaraopet-municipality-36-213960.html
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.
కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో అర్ధరాత్రి నిర్వహించిన ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.