Publish Date:Feb 10, 2020
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఎన్నికల సంఘం పోలింగ్ శాతాన్ని తేల్చింది. మొత్తం మీద 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ ప్రకటించింది. అయితే ఈ ఆలస్యంపై ఆమాద్మీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంత ఆలస్యంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించడం వెనుక మతలబు ఏంటని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. అక్రమంగా ఈవీఎం లను తరలించి ఉంటారని ఆరోపిస్తున్నారు. పోలింగ్ ముగిసిన ఒక రోజు తరువాత ఓటింగ్ శాతాన్ని ప్రకటించడంపై ఆమాద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈసీ తీరు తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్నికల సంఘం అధికారులు నిద్రపోతున్నారా? పోలింగ్ ముగిసిన 24 గంటల తరువాత ఓటింగ్ శాతాన్ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈవీఎం లు ట్యాంపర్ చేసే కుట్ర జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను కూడా ఆప్ నేతలు పోస్టు చేసారు. బాబున పూర్ లోని ఓ పోలింగ్ స్టేషన్ లో కొన్ని ఈవీఎం లను వాడకుండా పక్కన పెట్టినట్లు తాము గుర్తించామని ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు.
ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఆప్ నేతల ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. ఖచ్చితమైన సమాచారం అందించడం కోసమే ఆలస్యం జరిగిందని కొన్ని చోట్ల పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా ఓటర్లు క్యూలో నిల్చోవడం వల్ల పోలింగ్ శాతంపై క్లారిటీ రాలేదన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 10 గంటల 17 నిమిషాలకు 61.43 శాతం పోలింగ్ జరిగినట్లు తాము యాప్ లో అప్ డేట్ చేసినట్టు ఎన్నికల సంఘం అధికారి రణవీర్ సింగ్ చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు ఈసీకి సంబంధించిన యాప్ లో అప్ డేట్ చేస్తూ వచ్చారు. కాని, వాస్తవ పరిస్థితుల కంటే అందులో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. మొత్తం డేటా ఎన్నికల సంఘానికి వచ్చి దానిని అనలైజ్ చేసేసరికి ఆలస్యమైందని అందుకే పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి దాదాపు 5 శాతం పోలింగ్ తగ్గింది. ఢిల్లీలో మొత్తం డెబ్బై స్థానాలకు పోలింగ్ జరగ్గా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా కేజ్రివాల్ సీఎంగా పగ్గాలు చేపడతారని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఈ నెల పదకొండున అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/arvind-kejriwal-slams-ec-over-delay-in-final-voter-turnout-25-94037.html
రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నియోజకవర్గాలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడ నుంచి పవన్ కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.