రాష్ట్రపతి పాలన సరైన నిర్ణయమేనా!

Publish Date:Jan 30, 2016

Advertisement

మన దేశం ఈ నెల 26న తన 67వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంది. అయితే ఇదే రోజున అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలను విధిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఒక ప్రాంతంలో రాష్ట్రపతి పాలనను విధించడం మన దేశంలో కొత్తేమీ కాదు. ఇప్పటికి దాదాపు 90 సార్లు మనం ఆ పరిస్థితిని చూశాము. కానీ అలాంటి పాలనను విధించిన ప్రతిసారీ ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించిందన్న అపకీర్తిని ఎదుర్కోవడమే బాధాకరం! రాష్ట్రపతి పాలనను దుర్వినియోగపరచకుండా ఉండేందుకు సుప్రీం కోర్టు 1994 సంవత్సరంలో ‘S.R. Bommai v. Union of India’ కేసులో కొన్ని సూచనలు చేసింది. అప్పటి నుంచీ కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలు తగ్గిపోయాయి. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనను విధించడంతో ఇలాంటి నిర్ణయాల వెనుక ఉండే న్యాయాన్యాయాల చర్చ మళ్లీ మొదలైంది.

సుదీర్ఘ కాలం ఈ దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సందర్భాలలో అతి సులువుగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ని ఉపయోగించి రాష్ట్రపతి పాలనను విధించేది. కేంద్రానికి అనుకూలం కాని ప్రభుత్వం ఏమున్నా సరే, 356 అధికరణాన్ని ఉపయోగించి తొలగించి వేసే పరిస్థితులు ఉండేవి. ఒక్కసారి వెనక్కి తిరిగి రాష్ట్రపతి పాలనను విధించిన సందర్భాలను పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టమైపోతుంది. శాసనసభలో పరిపూర్ణమైన మెజారిటీ ఉండి, రాష్ట్రంలోని శాంతిభద్రతలు హాయిగా ఉన్న సందర్భాలలో కూడా రాష్ట్రపతి పాలన విధించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తుంది. ఇప్పడు అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో కూడా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి సంజాయిషీ చెప్పుకోవల్సిన పరిస్థితులు వచ్చాయి.

అరుణాచల్‌ ప్రదేశ్‌ చిన్న రాష్ట్రమే అయినా చాలా కీలకమైన ప్రదేశం. ఈ రాష్ట్రం మీ పట్టు సాధించేందుకు ఇటు ఉల్ఫా వంటి తీవ్రవాద సంస్థలూ, అటు చైనా వంటి సరిహద్దు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో గవర్నరు రాజ్‌కొవా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నివేదికలు ఇవ్వడం, వాటిని కేంద్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆమోదించి రాష్ట్రపతి పాలనను విధించడం జరిగిపోయాయి. నిజానికి గవర్నరు మీద ‘పరిపాలనలో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నా’రంటూ ఆరోపణలు వచ్చాయి. గవర్నరే స్వయంగా అధికార పార్టీ సభ్యులలో చీలిక తెచ్చి, ముఖ్యమంత్రి మీదకు ఉసిగొలిపేందుకు ప్రయత్నాలు చేశారంటారు. ఇలా గవర్నరుకీ, ముఖ్యమంత్రికీ మధ్య మొదలైన వివాదం కాస్తా ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఎసరు పెట్టింది.

ఇందులో కేంద్ర ప్రభుత్వపు తప్పు ఉన్నా లేకున్నా గవర్నరు పాత్ర మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. మరి ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పడు ఆసక్తికరమైన ప్రశ్న! భవిష్యత్తులో రాష్ట్రపతి పాలనను విధించే ముందు కేంద్రం మరింత జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ సమస్య నేర్పే పాఠం. అక్కడ తమకు అనుకూలం కాని ప్రభుత్వం ఉందనో, గవర్నరుగారికి అక్కడి పరిస్థితులు నచ్చలేదనో కాకుండా నిజంగా అక్కడి శాంతిభద్రతలను, ప్రభుత్వపు నిలకడను పరిశీలించి… పరిస్థితులను చక్కదిద్దలేని సందర్భాలలో మాత్రమే రాష్ట్రపతి పాలనను విధించడం దేశానికి శ్రేయస్కరం! లేకపోతే ఇలాంటి నిర్ణయాలు దేశ సార్వభౌమాధికారానికే ముప్పు తెచ్చే ప్రమాదం ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.