రెండు నాలుకల ధోరణి!

Publish Date:Nov 2, 2013

Advertisement

 

నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాన్ని గత కొన్న సంవత్సరాలుగా టీఆర్ఎస్ బహిష్కరిస్తూ వస్తోంది. ఆరోజును విద్రోహదినంగా, బ్లాక్ డేగా పాటించాలని పిలుపు ఇస్తోంది. టీఆర్ఎస్ కార్యాలయాల్లో నల్లజెండాలు ఎగురవేస్తూ హడావిడి చేస్తోంది. టీఆర్ఎస్ ఏం చేసినా ఆంధ్రప్రదేశ్ అంతటా ముఖ్యంగా తెలంగాణ అంతటా ప్రతి ఏడాదీ అవతరణోత్సవాలు వైభవంగా జరుగుతూనే వున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించిన తర్వాత శుక్రవారం కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవం తెలంగాణలో కూడా వైభవంగా జరిగింది. యథావిధిగానే టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలు ఎగరేసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ చేసే దాడులకు భయపడి సామాన్య ప్రజలు సొంతగా ఆంధ్రప్రదేశ్ అవతరణ కార్యక్రమాలు తక్కువగా జరుపుకున్నప్పటికీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలలో మాత్రం ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ సమైక్యతకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ప్రాంతంలోని కొందరు ఎమ్మెల్యేలు, చాలామంది మంత్రులు ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఈ వేడుకలలో పాల్గొనలేదు.

 

అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి సంగారెడ్డిలో ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన సంస్కారం చాలా వుంది. ‘ఆంధ్రప్రదేశ్’ అనే నీడలో అధికారాన్ని అనుభవిస్తూ అవతరణ వేడుకలలో పాల్గొనకపోవడం క్షమించరాని నేరం. కన్నతల్లినే మరచిపోయినవారిని ఏమనాలి? మొన్నామధ్య మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర మంత్రి డి.కె.అరుణ ఆధ్వర్యంలో సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే సభ జరిగింది. ఆ సభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణకి ఎంతో అన్యాయం జరిగిందని అరుణమ్మ వాపోయారు. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవంలో అన్ని దినపత్రికలలో ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది.

 

ఆ ప్రకటనలలో సోనియా, మన్మోహన్, కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోతోపాటు సమాచార ప్రసార శాఖ మంత్రి డి.కె. అరుణ ఫొటో కూడా వుంది. ఆ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, తెలుగుజాతి ప్రగతికి నిలువెత్తు నిదర్శనం ఆంధ్రప్రదేశ్ అనే మాటలు కూడా వున్నాయి. ఆ ప్రకటనలో మంత్రిగారు డి.కె.అరుణ ఫొటో కూడా వుంది కాబట్టి, ఆ ప్రకటనలో వున్న వాక్యాలతో ఆమె ఏకీభవిస్తున్నట్టే అర్థం. పేపర్లలో ఇచ్చే ప్రకటనలలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ని పొగుడుతారు. మిగతా అన్నిచోట్లా ఆంధ్రప్రదేశ్‌ని తిట్టిపోస్తారు. దీన్నే రెండు నాలుకల ధోరణి అంటారు.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
ఈ శిలాఫలకంపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఎక్కడా కనిపించలేదు. ఈ వింత పరిస్థితిని గమనించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా కార్యక్రమానికి వచ్చిన ఆయన, ఆ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో నిరాశకు లోనయ్యారు.
కాంగ్రెస్ నేతల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి..
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడూ ఊహించని మలుపులు చోటుచేసుకుంటూనే ఉంటాయి
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.