అరెస్టు భయంతో అజ్ణాతంలో వల్లభనేని వంశీ?

Publish Date:Jul 18, 2024

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయారా? నియోజకవర్గంలోని ఆయన ముఖ్య అనుచరులపై కేసులు, అరెస్టులే ఇందుకు తార్కానమా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  వంశీ ఇప్పుడు దాదాపు అజ్ణాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అన్నది ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. 

అయితే గతంలో ఆయన చేసిన అక్రమాలు, వ్యవహరించిన తీరు పట్ల నియోజకవర్గంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రజాగ్రహాన్ని ముందే గమనించిన వంశీ ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించేసినట్లుగా మాట్లాడి సానుభూతి దండుకుందామని ప్రయత్నించారు. ఆ ప్రయత్నం ఫలించే అవకాశం లేదని అర్ధమైన పిమ్మట, వైసీపీలో తనను వ్యతిరేకించే వర్గం వారిని మంచి చేసుకోవడానికి ఇవే తన చివరి ఎన్నికలంటూ ఓ విధంగా బతిమలాడారు. మద్దతు ఇవ్వమని ప్రాధేయపడ్డారు. అవన్నీ విఫలమయ్యాయి. గన్నవరం ప్రజలు ఆయనను ఘోరంగా ఓడించారు.  అయితే ఓటమితో వంశీ తప్పులు ప్రక్షాళన కాలేదు.  ఓటమి తరువాత వంశీ తప్పులన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

తెలుగుదేశం తరఫున రెండు సార్లు గవన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ   మూడోసారి వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగి పరాజయం పాలైన సంగతి తెలిసిందే. రెండో సారి అంటే 2019 ఎన్నికలలో విజయం తరువాత వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. అలా చేరిన క్షణం నుంచీ ఆయన తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లక్ష్యంగా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారు.  తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దాడులూ, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వంశీ ప్రత్యక్ష పర్య వేక్షణలో జరిగిన దాడి కేసులో ఇప్పుడు వంశీపై కేసు నమోదైంది.  

అలాగే గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్ లో కూడా వంశీ అరాచకాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మట్టి తవ్వకాలలో అక్రమాల నుంచి ఎస్సీ భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూముల రిజిస్ట్రేషన్ లు ఇలా వంశీ పాల్పడిన అక్రమాలపై ప్రజాదర్బార్ లో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో  వాటన్నిటినీ పరిశీలించి కేసుల నమోదుకు అధికారులు రెడీ అవుతున్నారు.   ఈ నేపథ్యంలోనే తన అరెస్టు తథ్యమన్న భయంతోనే  వంశీ నియోజకవర్గానికి దూరంగా అజ్ణాతంలో గడుపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.