బీఆర్ఎస్ నేత‌ల్లో అరెస్టుల భ‌యం.. ముందు జైలుకెళ్లేదెవ‌రో?

Publish Date:Oct 27, 2024

Advertisement

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ దూకుడు పెంచిందా? అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ‌ల‌తో హ‌డావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి,  ఆ త‌రువాత కాస్త నెమ్మ‌దించారు. అయితే, మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీపావ‌ళి పండుగ నాటికి బీఆర్ఎస్ కీల‌క నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు అరెస్టు కాబోతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇందుకు కార‌ణం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు. 

బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణ తుది దశకు వచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంద‌ని పొంగులేటి వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టి పారేశారు. ఏం చే్స్తారో చేసుకోండి.. భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అయితే, బీఆర్ఎస్ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతిపై విచార‌ణ చివ‌రి ద‌శ‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణతో పాటు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, విద్యుత్ కొనుగోలులో గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌పై విచార‌ణసైతం తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్ ల‌లో ఎవ‌రో ఒక‌రు అరెస్టు అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 

బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిర్మించారు. ఇందుకోసం ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించారు. అయితే, ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయ‌మూర్తితో విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. దాని ఆధారంగా కేసులు, అరెస్టులు జరిగే అవ‌కాశం ఉంది. విచారణలో మాజీ ఈఎన్‌సీలు, ఇంజినీర్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే ప్రాజెక్టులో నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.  

దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. 2014లో మొదటి దఫా బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను పర్యవేక్షించారు. స్పష్టంగా చెప్పాలంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల్లో ప్ర‌తిదీ కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఇంజ‌నీరింగ్ అధికారులు, ప్ర‌భుత్వ అధికారులు న‌డుచుకున్నారు. ఇది బ‌హిరంగ విష‌య‌మే. ప్ర‌స్తుతం క‌ళేశ్వ‌రం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి బ‌య‌ట‌ప‌డినా అది కేసీఆర్ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

 ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపైనా విచార‌ణ ఫైన‌ల్ స్టేజికి వ‌చ్చింది.  బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, సినీ, వ్యాపార‌, రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించింది. విచార‌ణ క్ర‌మంలో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఈ విచార‌ణ ప్ర‌క్రియ తుదిద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు హైద‌రాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపింది. ఈ అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈడీ విచార‌ణ‌కు కూడా ఆదేశించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ధ‌ర‌ణి పోర్ట‌ల్ విష‌యంలోనూ విచార‌ణ జ‌రుగుతుంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పెద్దెత్తున రాష్ట్రంలోని భూముల‌ను అన్యాక్రాంతం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిపైనా విచార‌ణ కొన‌సాగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హ‌యాంలో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం నుంచి జ‌రిపిన విద్యుత్ కొనుగోళ్ల‌లోనూ భారీగా అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తుంది. ఈ అంశంపైనా విచార‌ణ కొన‌సాగుతున్నది.  వీట‌న్నింటిలో చాలా వ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. విచార‌ణ నివేదిక‌లు పూర్తి స్థాయిలో వ‌చ్చిన త‌రువాత.. నివేదిక వివ‌రాల‌ను బ‌ట్టి త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను తీసుకొనేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. 

దీపావ‌ళి పండుగ నాటికి రాష్ట్రంలో పొలిటిక‌ల్ బాంబు పేలుతుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బీఆర్ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై, ఫోన్ ట్యాపింగ్ పై విచార‌ణ నివేదిక‌లు రెండుమూడు రోజుల్లో ప్ర‌భుత్వానికి అంద‌బోతున్నాయ‌ని.. దీపావ‌ళి నాటికి అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? ఏ  కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే  ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి పేల్చ‌బోయే బాంబుల‌ కోసం తాను ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లోనే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. దీంతో కాంగ్రెస్ గూటికి చేర‌బోయే బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఎవ‌ర‌నే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.