బీఆర్ఎస్ నేత‌ల్లో అరెస్టుల భ‌యం.. ముందు జైలుకెళ్లేదెవ‌రో?

Publish Date:Oct 27, 2024

Advertisement

కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ళ్లీ దూకుడు పెంచిందా? అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజుల్లో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై విచార‌ణ‌ల‌తో హ‌డావుడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి,  ఆ త‌రువాత కాస్త నెమ్మ‌దించారు. అయితే, మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీపావ‌ళి పండుగ నాటికి బీఆర్ఎస్ కీల‌క నేత‌ల్లో ఒక‌రిద్ద‌రు అరెస్టు కాబోతున్నార‌ని తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇందుకు కార‌ణం మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు. 

బీఆర్ఎస్ సర్కార్‌ హయాంలో వివిధ శాఖల్లో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణ తుది దశకు వచ్చిందని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుంద‌ని పొంగులేటి వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్య‌ల‌ను బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టి పారేశారు. ఏం చే్స్తారో చేసుకోండి.. భ‌య‌ప‌డేది లేద‌న్నారు. అయితే, బీఆర్ఎస్ నేత‌ల్లో మాత్రం ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతిపై విచార‌ణ చివ‌రి ద‌శ‌కు చేరింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణతో పాటు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌, విద్యుత్ కొనుగోలులో గోల్ మాల్ వ్య‌వ‌హారాల‌పై విచార‌ణసైతం తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసుల్లో కేసీఆర్‌, కేటీఆర్ ల‌లో ఎవ‌రో ఒక‌రు అరెస్టు అయ్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ బీఆర్ ఎస్ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. 

బీఆర్ఎస్ హ‌యాంలో కేసీఆర్ కాళేశ్వ‌రం ప్రాజెక్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని నిర్మించారు. ఇందుకోసం ల‌క్ష‌ల కోట్ల‌ను వెచ్చించారు. అయితే, ఈ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు గ‌తంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజయం సాధించి కాంగ్రెస్  అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వ‌రం ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ న్యాయ‌మూర్తితో విచార‌ణ‌కు ఆదేశించారు. విచార‌ణ జ‌రిపిన జ‌స్టిస్ పీసీ ఘోష్ తుది నివేదికను సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. త్వరలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని సమాచారం. దాని ఆధారంగా కేసులు, అరెస్టులు జరిగే అవ‌కాశం ఉంది. విచారణలో మాజీ ఈఎన్‌సీలు, ఇంజినీర్లు చెబుతున్న దాన్నిబట్టి చూస్తే ప్రాజెక్టులో నిర్మాణంలో అవినీతి, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.  

దీంతో క్రిమినల్ కేసులు పక్కాగా నమోదయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే, గత ప్రభుత్వ పెద్దల అరెస్టులు, కాంట్రాక్టు సంస్థలకు చిక్కులు తప్పేలా లేవు. 2014లో మొదటి దఫా బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో హరీశ్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. రెండో దఫా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల‌ను పర్యవేక్షించారు. స్పష్టంగా చెప్పాలంటే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల్లో ప్ర‌తిదీ కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింది. కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు ఇంజ‌నీరింగ్ అధికారులు, ప్ర‌భుత్వ అధికారులు న‌డుచుకున్నారు. ఇది బ‌హిరంగ విష‌య‌మే. ప్ర‌స్తుతం క‌ళేశ్వ‌రం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి బ‌య‌ట‌ప‌డినా అది కేసీఆర్ మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

 ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపైనా విచార‌ణ ఫైన‌ల్ స్టేజికి వ‌చ్చింది.  బీఆర్ఎస్ ప్ర‌భుత్వం హ‌యాంలో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు, సినీ, వ్యాపార‌, రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌ముఖుల ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ‌కు ఆదేశించింది. విచార‌ణ క్ర‌మంలో ప‌లువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్ర‌స్తుతం ఈ విచార‌ణ ప్ర‌క్రియ తుదిద‌శ‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌, కేటీఆర్ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రోవైపు హైద‌రాబాద్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన ఫార్ములా కారు రేసులోనూ భారీ ఎత్తున అక్ర‌మాలు జ‌రిగాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపింది. ఈ అవినీతిలో మాజీ మంత్రి కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. అవ‌స‌ర‌మైతే ఈడీ విచార‌ణ‌కు కూడా ఆదేశించే యోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ధ‌ర‌ణి పోర్ట‌ల్ విష‌యంలోనూ విచార‌ణ జ‌రుగుతుంది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ను తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం పెద్దెత్తున రాష్ట్రంలోని భూముల‌ను అన్యాక్రాంతం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వీటిపైనా విచార‌ణ కొన‌సాగుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హ‌యాంలో ఛ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రం నుంచి జ‌రిపిన విద్యుత్ కొనుగోళ్ల‌లోనూ భారీగా అవినీతి జ‌రిగింద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తుంది. ఈ అంశంపైనా విచార‌ణ కొన‌సాగుతున్నది.  వీట‌న్నింటిలో చాలా వ‌ర‌కు కేసీఆర్‌, కేటీఆర్ ప్ర‌మేయం ఉంద‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తోంది. విచార‌ణ నివేదిక‌లు పూర్తి స్థాయిలో వ‌చ్చిన త‌రువాత.. నివేదిక వివ‌రాల‌ను బ‌ట్టి త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను తీసుకొనేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. 

దీపావ‌ళి పండుగ నాటికి రాష్ట్రంలో పొలిటిక‌ల్ బాంబు పేలుతుంద‌ని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు బీఆర్ఎస్ నేత‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై, ఫోన్ ట్యాపింగ్ పై విచార‌ణ నివేదిక‌లు రెండుమూడు రోజుల్లో ప్ర‌భుత్వానికి అంద‌బోతున్నాయ‌ని.. దీపావ‌ళి నాటికి అందుకు బాధ్యులైన బీఆర్ఎస్ ముఖ్య నేతలపై కేసులు నమోదు చేసి.. వరుసగా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అరెస్టుల పర్వం మొదలైతే.. ముందుగా జైలుకు వెళ్లేది ఎవరు? ఏ  కుంభకోణంలో ఎవరెవరు ఇరుక్కుంటారన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు.. సామాన్య ప్ర‌జ‌ల్లోనూ ఆసక్తి రేపుతోంది. అయితే  ఈ అంశంపై తాజాగా టీపీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి పేల్చ‌బోయే బాంబుల‌ కోసం తాను ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లోనే మ‌రికొంత మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న కొత్త అంశాన్ని తెర‌పైకి తెచ్చారు. దీంతో కాంగ్రెస్ గూటికి చేర‌బోయే బీఆర్ఎస్ ముఖ్య‌నేత‌లు ఎవ‌ర‌నే అంశంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

By
en-us Political News

  
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.