Publish Date:Aug 17, 2022
ఆహార భద్రత లబ్ధి దారులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త అందించింది. ఈ కార్డ దారులకు ఆరోగ్య శ్రీ సేవలను అందుబాబులోకి తీసుకు వచ్చింది. ఈ మేరకు తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆరోగ్యశ్రీ - ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే అన్ని ఉచిత వైద్య సేవలకు, చికిత్సలకు ఆహార భద్రత కార్డు హోల్డర్ ను అర్హులను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసిందన్నారు.
గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డుదారులకు ఆరోగ్య శ్రీ కార్డులు అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కోసం తెల్ల కార్డు స్థానంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసింది. వీటిని కేవలం రేషన్ కు మాత్రమే పరిమితం చేశారు. ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్లో చికిత్సలు పొందాలంటే.. సంబంధిత కార్డులైనా ఉండాలి. లేదా తెల్ల రేషన్ కార్డు అయినా ఉండాలనే నిబంధనలున్నాయి.దీంతో ఆహార భద్రత కార్డు దారుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఆహార భద్రత కార్డులను అందజేసింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో స్పందించి, ఆహార భద్రత కార్డు దారులకు కూడా ఆరోగ్య శ్రీ వర్తింపజేయాలని ఆదేశించారని హరీష్ రావు తెలిపారు. దీంతో ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రులన్నీ ఇకపై ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులను కూడా ఉచిత చికిత్సలకు అనుమతిస్తాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ - ఆరోగ్యశ్రీ పథకాలకు ఆహార భద్రత కార్డులను కూడా అర్హతగా పరిగణనలోకి తీసుకోనున్నట్టు ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ కూడా ప్రకటించింది.
ఈ మేరకు అన్ని నెట్వర్క్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ సమాచారం అందించిందని పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన, ఆరోగ్యశ్రీ పథకాలను కలిపి ఒకే రూఫ్ కిందకు తీసుకువచ్చిన సంగతి సంగతి తెలిసిందే. ఆ ఆహార భద్రత కార్డు లేనివారు... రేషన్ కార్డుతోపాటు ఆధార్ కార్డును కూడా చూపించి ప్రయోజనం పొందవచ్చు. ఈ మేరకు ఆరోగ్యశ్రీ హెల్త్కేర్ ట్రస్ట్ బుధవారం ఓ ప్రకటన జారీచేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/arigya-sri-available-to-aharabhadrata-card-holders-also-25-142135.html
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.