అతిగా ఆలోచించేవాళ్లకు భలే సొల్యూషన్.. 5-5-5 టెక్నిక్ గురించి తెలుసుకోండి..!

Publish Date:Nov 20, 2025

Advertisement


అతి సర్వత్రా వర్జయేత్  అని అన్నారు పెద్దలు.  అంటే అతిగా ఏం చేసినా అది నష్టాన్నే కలిగిస్తుంది అని. అతిగా తినడం, తాగడం, ఏదైనా పని చేయడం,  నిద్రపోవడం.. ఇలా ఒకటని కాదు.. అతిగా ఏం చేసినా దానివల్ల కలిగే లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా అతిగా ఆలోచించడం,  అతిగా స్పందించడం కూడా చాలా నష్టాన్ని కలిగించే అలవాట్లే.. కానీ చాలామందికి తెలియదు.. తాము అతిగా ఆలోచిస్తున్నామని, అతిగా రియాక్ట్ అవుతున్నామని.  జరగాల్సిన నష్టం జరిగినప్పుడు కూడా వెంటనే తాము అతిగా రియాక్ట్ అయ్యాం అని, అతిగా ఆలోచించాం అని వారు తెలుసుకోరు. అయితే ఈ అతిని అరికట్టడానికి ఒక సింపుల్ టెక్నిక్ చెబుతున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు. అదే 5-5-5 టెక్నిక్.. ఇంతకీ ఇదేంటో.. ఇదెలా పని చేస్తుందో తెలుసుకుంటే..


5-5-5 టెక్నిక్..

సోషల్ మీడియాలో ఈ నెంబర్స్ తాలూకు టెక్నిక్స్ చాలా ట్రెండ్ అవుతూ ఉంటాయి. వాటిలో పిట్నెస్ కు సంబంధించినవి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే అవి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన టెక్నిక్ ఏదైనా ఉందంటే అదే 5-5-5..

 5-5-5 రూల్ ఇదే..

ఈ టెక్నిక్ లో రూల్ ను రివీల్ చేసేవి ఈ నెంబర్స్ ఏ. ఏదైనా ఒక పని  చేయడానికి ముందు లేదా ఏదైనా ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు, ఇతరుల దగ్గర ఏ విషయం గురించి అయినా స్పందించాలని అనుకునే ముందు 5 నిమిషాలు ఆలోచించాలని చెబుతున్నారు. అంతేకాదు.. 5 నిమిషాల తర్వాత ఈ విషయం 5 రోజులు లేదా 5 ఏళ్ళ తర్వాత కూడా నాకు ముఖ్యమా? అనే విషయాన్ని ఆలోచించాలని చెబుతున్నారు.

ఇలా ఆలోంచించడం వల్ల మనసును నెమ్మది చేయవచ్చు. ఏదైనా పని చేసే ముందు లేదా ఆలోచించి నిర్ణయం తీసుకునే ముందు,  ఏదైనా మాట్లాడే ముందు ఇలా 5 నిమిషాల సమయం తీసుకోవడం వల్ల బావోద్వేగాన్ని చాలా వరకు నియంత్రణలో ఉంచవచ్చు.

ఇది5 నిమిషాల తర్వాత ముఖ్యమా? 5 రోజుల తర్వాత కూడా ముఖ్యమా? 5ఏళ్ల తర్వాత కూడా ముఖ్యమైనదేనా? అనే విషయాలు ఆలోచించడం వల్ల చేయాలనుకున్న పని లేదా మాట్లాడాలి అనుకున్న మాట తాత్కాలిక విషయమా లేదా జీవితానికి సంబంధించినదా? దాని ప్రయోజనం ఏంటి? నష్టం ఏంటి అనే విషయాలు బాగా అర్థమవుతాయి.

5-5-5 టెక్నిక్ పాటించినప్పుడు,  ఆ టెక్నిక్ పాటించకుండా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి. వాటి మధ్య తేడా ఏంటి అనేది స్పష్టంగా అర్థం చేసుకుని తమను తాము మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది.

                                   *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
అత్తాకోడలు ఇద్దరూ వేరే ఇంట్లో తమ తల్లిదండ్రుల మధ్య గారాభంగా పెరిగి వివాహం పేరుతో ఒక ఇంటిని చేరే వారు.  అయితే ఏ ఇంట్లో చూసినా అత్తాకోడళ్లు అంటే ఒకానొక శత్రుత్వమే కనిపిస్తుంది, వినిపిస్తుంది...
కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు, ఇతరుల నుండి అన్యాయాన్ని ఎదుర్కుంటున్నప్పుడు, ఇతరుల తప్పులకు తాము నష్టాన్ని  అనుభవిస్తున్నప్పుడు చాలా మంది న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తారు.
మోసపోవడం,  మోసం చేయడం,  తప్పు చేయడం,  తప్పించుకు తిరగడం,  చట్టానికి విరుద్దంగా, న్యాయానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం..  ఒకటి రెండు కాదు..
ఏ సంబంధానికైనా నమ్మకం పునాది.  కానీ నేటి డిజిటల్ యుగంలో ఈ నమ్మకం కొన్ని విషయాల చుట్టూనే తిరుగుతుంది. వాటిలో ఫోన్ చాలా ముఖ్యమైనది. భార్యాభర్తలు ఒకరి ఫోన్ మరొకరు చెక్ చేయడంలో తప్పేముందని చాలా మంది అంటుంటారు....
జీవితం చాలా విచిత్రమైనది. నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు,  ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో లేదో తెలియదు.  కానీ చాలామంది రేపు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆశాభావంతో ఉంటారు.  ప్రతీది ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని కొన్ని అంచనాలు కూడా పెట్టుకుంటారు....
ఎమోషన్స్  అనేవి మాటలకు అందని చర్యలు.  మాటల ద్వారా చెప్పలేని ఎన్నో విషయాలను ఎమోషన్స్ ద్వారా వ్యక్తం చేస్తుంటారు.  ఈ ఎమోషన్స్ ద్వారా అనుబంధం ఉన్నంత వరకు ఎవరైనా, ఏ బంధమైనా బాగుంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.