Publish Date:Aug 11, 2025
సింధూనది పై ప్రాజెక్టు కడితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్నటికి మొన్న ఇదే అణు బాంబుల విషయంలో భారీ ఎత్తున భయపడబట్టే కదా? కాళ్లు పట్టుకుని మరీ ఇండియాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది? ఈ విషయం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మరచిపోతే ఎలా? మొన్నటి యుద్ధంలో భారత్ పాక్ ని భయపెట్టకుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వలున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది. జస్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్రహ్మోస్ లు వదిలినందుకే తల్లడిల్లిపోయింది పాక్. ఈ ఎయిర్ బేస్ కి దగ్గర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్టర్ తో పాటు అటు అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్కడ భారత్ బాంబులు పడ్డంతనే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్.. జడుసుకుని బంకర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మళ్లీ బీరాలు పలుకుతున్నాడు.
సింధూనది మీద ప్రాజెక్టు కడుతున్నందుకే ఇలా అంటుంటే మరి బ్రహ్మపుత్రా నది మీద చైనా కడుతున్న ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? సింధూనది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మరి చైనాపై కూడా భారత్ అణు బాంబులు వేయాలా? మొన్న పహెల్గాం దాడి తర్వాత ఇదే సింధూజలాల విషయం వెలుగులోకి వస్తే మేం అణుబాంబులు వేస్తామని అన్నారు పాక్ దేశ నాయకులు. తీరా భారత్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయడం మానేసి.. బంకర్లలో దాక్కున్నారు.
ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే.. ప్రపంచానికే అతి పెద్ద విపత్తుగా భావించిన అమెరికా.. పాక్ విషయంలో ఎందుకో వెనకడుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భారత్ ని భయపెట్టి ఆయుధాలు కొనిపించాలన్న యోచన అమెరికాది. అందుకే ఆ దేశ గడ్డపై నుంచి ఇలాంటి బీరాలు పలికిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువడుతున్నాయ్. మేం పోతే సగం ప్రపంచాన్ని లాక్కెళ్లిపోతామని మీరు భయపెడతారేమో.. కానీ భారత్ మొన్నటిలా చేసి చూపిస్తుంది. అయినా యుద్ధం జరుగుతుంటే మన దగ్గర ప్లాన్స్ లేవు ప్రేయర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భారత్ ను భయపెట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాకట్టి పెట్టి బతుకుతున్న మునీర్ సైన్యాధ్యక్షుడంటే ఆసియాకే అవమాన కరంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/are-pakistan--nuclear-bombs-just-to-scare-25-204002.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.