Publish Date:Aug 11, 2025
సింధూనది పై ప్రాజెక్టు కడితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్నటికి మొన్న ఇదే అణు బాంబుల విషయంలో భారీ ఎత్తున భయపడబట్టే కదా? కాళ్లు పట్టుకుని మరీ ఇండియాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది? ఈ విషయం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మరచిపోతే ఎలా? మొన్నటి యుద్ధంలో భారత్ పాక్ ని భయపెట్టకుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వలున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది. జస్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్రహ్మోస్ లు వదిలినందుకే తల్లడిల్లిపోయింది పాక్. ఈ ఎయిర్ బేస్ కి దగ్గర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్టర్ తో పాటు అటు అణు నిర్వహణ చేసే నేషనల్ కమాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్కడ భారత్ బాంబులు పడ్డంతనే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్.. జడుసుకుని బంకర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మళ్లీ బీరాలు పలుకుతున్నాడు.
సింధూనది మీద ప్రాజెక్టు కడుతున్నందుకే ఇలా అంటుంటే మరి బ్రహ్మపుత్రా నది మీద చైనా కడుతున్న ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? సింధూనది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మరి చైనాపై కూడా భారత్ అణు బాంబులు వేయాలా? మొన్న పహెల్గాం దాడి తర్వాత ఇదే సింధూజలాల విషయం వెలుగులోకి వస్తే మేం అణుబాంబులు వేస్తామని అన్నారు పాక్ దేశ నాయకులు. తీరా భారత్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయడం మానేసి.. బంకర్లలో దాక్కున్నారు.
ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉంటే.. ప్రపంచానికే అతి పెద్ద విపత్తుగా భావించిన అమెరికా.. పాక్ విషయంలో ఎందుకో వెనకడుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భారత్ ని భయపెట్టి ఆయుధాలు కొనిపించాలన్న యోచన అమెరికాది. అందుకే ఆ దేశ గడ్డపై నుంచి ఇలాంటి బీరాలు పలికిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువడుతున్నాయ్. మేం పోతే సగం ప్రపంచాన్ని లాక్కెళ్లిపోతామని మీరు భయపెడతారేమో.. కానీ భారత్ మొన్నటిలా చేసి చూపిస్తుంది. అయినా యుద్ధం జరుగుతుంటే మన దగ్గర ప్లాన్స్ లేవు ప్రేయర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భారత్ ను భయపెట్టేందుకు ప్రయత్నించడం ఆశ్చర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాకట్టి పెట్టి బతుకుతున్న మునీర్ సైన్యాధ్యక్షుడంటే ఆసియాకే అవమాన కరంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/are-pakistan--nuclear-bombs-just-to-scare-25-204002.html
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.