భానుని విశ్వరూపం? పెరుగుతున్న నమ్మకం!
Publish Date:Oct 2, 2012
Advertisement
భానుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సూర్యోదయాన్ని తన వెలుగులతో నింపాడు. ఇది ఏ రచనలో వాడిన వాక్యాలు కావు. నిజంగానే అరసవిల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయంలో అరుదైన వెలుగులు ప్రసరించాయి. అసలు ఆలయ నిర్మాణంలో సూర్యుని కిరణం పడటానికి అవకాశాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా ఆ సూర్యకిరణాలు కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో విగ్రహంపై పడి భక్తుల నమ్మకాన్ని పెంచుతుంటాయి. గ్రహదోషాలతో బాధపడే వారి కోసం అరసవిల్లిలో నిర్మించిన ఈ సూర్యదేవాలయం హిందువులకు ఎంతో పవిత్రమైనది. గ్రహదోషాలను పరిహరించే శక్తి ఉన్న సూర్యనారాయణమూర్తి విగ్రహాన్ని శాస్త్రరీతుల ప్రకారం నిర్మించారు. ఆ విగ్రహం నిర్మించినప్పటి నుంచి ప్రతీ ఏడాది ప్రత్యేకదినాల్లో క్రమంగా తప్పకుండా సూర్యనారాయణుడు వెలుగులు విరజిమ్ముతూనే ఉన్నాడు. ఆయన వెలుగులు అరుదైన వింతగా చరిత్రపుటల్లో నమోదవుతూనే ఉంది. భారతదేశంలో సూర్యనారాయణమూర్తికి కోణార్క్, ఆ తరువాత అరసవిల్లిలో ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాలను ప్రతిపాదికగా చేసుకుని తూర్పుగోదావరి జిల్లా గొల్లలమామిడాడలోనూ సూర్యనారాయణమూర్తి దేవాలయం నిర్మించారు. ఈ మూడు ఆలయాల్లోనూ సూర్యకాంతి పడటానికి ప్రధానద్వారం, గవాక్షంలో సుదూరంగా ఖాళీలు ఉంచితే ప్రత్యేకదినాల్లో సూర్యకాంతి విగ్రహాలపై పడుతోంది. ఇది ఎలా సాధ్యమైందని పరిశోధకులు పలురకాల పరిశీలనలు జరిపారు. కానీ, వైజ్ఞానికశాస్త్రానికి ఇది అంతుబట్టని రహస్యంగానే మిగిలిపోయింది. అటువంటి అరుదైన సందర్భం తాజాగా ఆదివారం నమోదైంది. ఈ వారాన్నే భానువారం అని కూడా పిలుస్తారు. అందువల్ల తన వారపురోజున వింత ప్రకాశంతో సూర్యనారాయణమూర్తి దర్శనమివ్వటం భక్తుల్లో నమ్మకాన్ని పెంచింది. అలానే హిందువులు విశ్వసించే గ్రహదోషాలు నివారించుకునేందుకు పూజలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ ఆలయంలోని పూజారులూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/arasavilli-suryanarayana-murthi-temple-24-17811.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





