Publish Date:Sep 30, 2024
జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అభివృద్ధి అన్న మాటే వినిపించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఐదేళ్ల అరాచకపాలన నుంచి విముక్తి చెందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పడు పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచీ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టారు. ఆయన ప్రతి అడుగూ రాష్ట్ర అభివృద్ధి దిశగానే సాగుతోంది. చంద్రబాబు రాష్ట్ర ప్రగతి కోసం చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. వివిధ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. జగన్ ఐదేళ్ల అరాచకపాలనలో రాష్ట్రం వదిలి వెళ్లిపోయిన ఒక్కో పరిశ్రమా తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నది.
అందులో భాగంగానే ప్రసిద్ధ లులు గ్రూప్ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఆ గ్రూప్ చైర్మన్ యుసుఫ్ అలీ చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై చర్చించారు. ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. లులు గ్రూప్ తన వ్యాపార విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ను ఎన్నుకోవడాన్ని స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. లులు గ్రూప్ ఎండీ యుసుఫాలీలో అమరావతిలో జరిగిన చర్చల్లో విశాఖపట్నంలో 8 స్క్రీ న్ల ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ సహా అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మిం లులూ గ్రూప్ ఛైర్మన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. అదే విధంగా విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్లను కూడా లులూ గ్రూప్ ఏర్పాటు చేయ నున్నది. ఇలా ఉండగా తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అమరావతిలో శనివారం (సెప్టెంబర్ 28) భేటీ అయినట్లు పేర్కొన్న లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తమకు సాదర స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియ జేశారు. చంద్రబాబుతో తనకు ఉన్న 18 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్ లు, షాపింగ్ మాల్స్, హైపర్ మార్కెట్లతో పాటు రాష్ట్రంలో ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్ ల్యాబ్ లను కూడా ప్రారంభించ నున్నట్లు లులు ఎండీ తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/aps-ist-imax-in-vizag-39-185876.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.