సెకండ్ల వ్యవధిలో గుండె ఘోష కనిపెట్టేసే యాప్!.. 14 ఏళ్ల బుడతడి అద్భుత సృష్టి

Publish Date:Mar 18, 2025

Advertisement

గుండె ఘోష తెలియాలంటే..ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ఆ స్మర్ట్ ఫోన్ లో  తాను ఆవిష్కరించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే సెకండ్ల వ్యవధిలో గుండెకు సంబంధించిన అన్ని రుగ్మతలనూ ఇట్టే తెలుసుకోవచ్చునంటున్నాడు ఈ 14 ఏళ్ల బుడతడు. అనడమే కాదు.. స్వయంగా స్మార్ట్ ఫోన్ ద్వారా గుండె పరీక్షలు నిర్వహించి ఔరా అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 14 ఏళ్ల సిద్ధార్థ్ నంద్యాల గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో గత మూడు రోజులుగా దాదాపు వెయ్యి మందికి హార్ట్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్ లో గుండె సంబంధిత రుగ్మతలు ఉన్నాయని తేలిన వారందరికీ ఈసీసీ, 2డి ఎకో వంటి పరీక్షలు నిర్వహించి గుండె జబ్బు ఉందని వైద్యలు నిర్ధారించారు. దీంతో  సిద్ధార్థ్ నంద్యాల ఆవిష్కరించిన యాప్ పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.   

ఈ తరుణంలో సిద్ధార్థ నంద్యాల ఆవిష్కరించిన యాప్ వైద్య సేవల విషయంలో ఒక విప్లవానికి నాంది పలికినట్లేనని అంటున్నారు  వైద్య నిపుణులు.  పిట్ట కొంచెం కూత ఘనం అన్న మాట ఈ 14 సంవత్సరాల బుడతడికి అతికినట్లు సరిపోతుంది. సందేహం లేదు.. ఈ బుడతడి మేధస్సు, సాధించిన విజయాలు, ఆవిష్కరించిన అద్భుతం ప్రపంచానికే దిక్సూచిగా మారబోతున్నది. ఆధునిక సాంకేతికతను గుప్పిట పట్టిన ఈ చిన్నారి తాజాగా సాధించిన అద్భుతం వైద్య సేవలలో అత్యంత కీలకంగా మాపోనున్నది. ఇంతకీ ఈ చిచ్చరపిడుగు ఏం చేశాడనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం..

  సాంకేతిక పరిజ్ణానాన్ని అందిపుచ్చుకుని గుండె చప్పుడు వినడానికి ఒక అత్యధునిక అప్లికేషన్ తయారు చేశాడు  ఈ అపర మేధావి పేరు సిద్ధార్థ్.. భారత సంతతికి చెందిన సిద్ధార్థ పుట్టింది అనంతపురంలో అక్కడ నుంచి అతగాడి కుటుంబం హైదరాబాద్ కు అటు నంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది.  సిద్ధార్థ నంద్యాల తండ్రి మహేష్ అమెరికాలో వ్యాపార వేత్త. ఈయన కుటుంబం 2010లోనే అమెరికాలో స్థిరపడింది. ఇక సిద్ధార్థ  యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో ఏఐ బేస్డ్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సిద్ధార్థ ఒక యాప్ ను ఆవిష్కరించాడు. సిర్కాడియావి అనే ఈ యాప్ 93 శాతం యాక్యురెసీతో గుండె చప్పుడును బట్టి గుండె జబ్బులను నిర్ధారిస్తుంది. అమెరికాలో దాదాపు 15 వేల  మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించగా వారిలో 3500 మందికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తేలింది. ఈ యాప్ సాయంతో ఇప్పుడు గుంటూరులోని జీజీహెచ్ ఆస్పత్రిలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల పాటు 500 మందికి  సిద్ధార్ధ్ ఆవిష్కరించిన యాప్ సాయంతో  స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో పది మందికి గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు తేలింది. ఆ పది మందినీ వార్డుకు తరలించి ఈసీజీ, 2డి ఎకో పరీక్షలు చేయగా, వారికి గుండె జబ్బు ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఈ స్క్రీనింగ్ టెస్టులను తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్మర్ట్ ఫోన్ తో సిద్ధార్ధ స్వయంగా చేయడం విశేషం. 

ఇటీవల డల్లాస్ లో సిద్ధార్థ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను కలిశారు. ఆయనకు తన సృజనను వివరించి తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా గుండె జబ్బులను గుర్తించవచ్చనీ, అది కూడా స్మార్ట్ ఫోన్ ద్వారా ఏడు సెకన్లలో నిర్ధారించవచ్చని డిమాన్ స్ట్రేట్ చేసి వివరించారు. దీంతో ఇంప్రెస్ అయిన పెమ్మసాని చంద్రశేఖర్ సిద్ధార్థ్ ను భారత్ కు ఆహ్వానించారు. దీంతో సిద్ధార్థ్ గుంటూరులోని జీజీహెచ్ లో తాను ఆవిష్కరించిన యాప్ ద్వారా స్క్రీనింగ్ పరిక్షలు నిర్వహించారు. ఆ యాప్ కచ్చిత్వానికి వైద్యులు సైతం అబ్బురపడ్డారు. 

ఇంతకీ ఈ యాప్ ఎలా పని చేస్తుందంటే... స్మార్ట్ ఫోన్ లో సిద్ధార్థ ఆవిష్కరించిన సిర్కాడియావీ యాప్ ను ఇన్ స్టాల్ చేస్తే చాలు. ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పని చేసే ఈ యాప్ ను ఛాతిపై ఉంచితే  హార్ట్ బీట్ ను రికార్డ్ చేస్తుంది. సదరు వ్యక్తిగా గుండె సంబంధిత రుగ్మత ఏదైనా ఉంటే బీప్ సౌండ్ వస్తుంది. రెడ్ లైట్ వెలిగి.. అబ్ నార్మల్ హార్ట్ బీట్ అనే అక్షరాలు ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తాయి. సిద్ధార్థ తన యాప్ ద్వారా గుంటూరు జీజీహెచ్ లో చేసిన స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు యాక్యురేట్ గా ఉన్నాయి. 

ప్రపంచంలోనే అత్యంత పిన్నవయస్కుడైన సర్టిఫైడ్ ఏఐటెకీగా రికార్డు సృష్టించిన సిద్ధార్థ్ తన ప్రాజెక్టు గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  కలిసి వివరించి ఆయన అభినందనలు అందుకున్నారు.   

By
en-us Political News

  
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 02వ తేదీ వరకు జరగనున్న సాక్షాత్కార వైభవోత్సవాలను పురస్కరించుకుని గురువారం వేడుకగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు.
పాకిస్తాన్‌లోని ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ లో బాంబు పేలుడు జరిగింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో నలుగురు మరణించగా, పలువురికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్లు కాగ్నిజెంట్ సంస్థ ప్రకటించింది.
తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ రోబ్‌లాక్స్ సృష్టించి భక్తులను మోసగిస్తున్నది. భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకొని సోషియల్ మీడియాలో నయో మోసాలు పాల్పడుతున్నదని జనసేన నేత కిరణ్ రాయల్ తెలిపారు.
రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఏపీలో రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపన చేశారు.
తిరుమల ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎన్‌ఆర్‌ఐ తోట చంద్రశేఖర్‌ రూ.కోటి విరాళం అందించారు. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడును ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలి‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని ఐఎస్ బీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న నిఖిల్ మదన్ 17వ అంతస్తు బాల్కనీ నుంచి కిందికి దూకాడు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు.
రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్‌చల్‌ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నాగుపల్లి-శంకర్‌పల్లి మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ వెళ్లింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ బైపాస్‌లోని దుర్గాపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఉత్తరాఖండ్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు.
తెలంగాణ‌లో ఆషాడ‌మాస బోనాలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌జ‌ల‌కు భోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.