ప్రధాన్ రాజీనామా.. ఆప్ విద్యామంత్రికీ ఎసరు?

Publish Date:Jul 28, 2026

Advertisement

నీట్ పేపర్ లీకేజీల నిరసనల్లో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా ఇప్పుడు పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ సర్కార్ ను ఇరుకున పెట్టింది. నీట్ లీకేజీకి నిరసనగా.. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో హస్తిన వేదికగా జరిగిన ఆందోళనకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ,   ప్రధాన్ మస్ట్ గో’ అంటూ ప్రచారం చేసింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఆపార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాలు జంతర్ మంతర్ కు వెళ్లి మరీ కాక్రోచ్ ఆందోళనలకు సంఘీ భావం ప్రకటించారు.   ఆ సందర్భంగా  ఆప్ సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా   పంజాబ్‌లో  అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంలో ఇప్పటి వరకూఅంటే గత నాలుగున్నర ఏళ్లుగా  ఒక్క పేపర్ లీక్  అవ్వలేదని ప్రకటించారు. అక్కడితో ఆగకుండా, ఒక వేళ అలా లీక్ అయి ఉంటే పంజాబ్ విద్ాయమత్రి చేత రాజీనామా చేయించి ఉండేవారమని సవాల్ చేశారు.  

ఆ సవాలే ఇప్పుడు ఆప్ విద్యామంత్రి పదవికి ఎసరు తెచ్చింది.  మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన   కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్  పార్టీలు  పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో  కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు,  లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.  ఇటీవల ఫరీద్‌కోట్‌లో జరిగిన 454 ఫార్మసిస్ట్ పోస్టుల నియామక పరీక్షలో చోటుచేసుకున్న హైటెక్ కాపీయింగ్ వ్యవహారం పంజాబ్‌లో పెద్ద కలకలం రేపిన సంగతి విదితమే. అభ్యర్థులు పెన్ కెమెరాల ద్వారా ప్రశ్నపత్రాలను ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకు పంపి, వైర్‌లెస్ పరికరాల ద్వారా సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమాలకు సంబంధించి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 3.5 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు లంచాలు వసూలు చేసినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది.

అలాగే ఫిబ్రవరి 2023లో..  పంజాబ్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ 12వ తరగతి ఇంగ్లీష్ బోర్డు పరీక్ష ప్రారంభానికి   ముందు  లీక్ కావడంతో ఆ పరీక్షను అత్యవసరంగా రద్దు చేశారు. ఇవే కాకుండా,  నైబ్ తహసీల్దార్ రిక్రూట్‌మెంట్, పంజాబ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష , అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, పిఎస్‌ఎస్‌ఎస్‌బి గ్రూప్-బి పరీక్షలలో కూడా   కుంభకోణాలు బయటపడ్డాయి.

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే, నీతికి కట్టుబడి పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బేన్స్, ఆరోగ్య శాఖ మంత్రి బల్బీర్ సింగ్ కూడా  తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని కాంగ్రెస్, అకాలీదళ్ నాయకురాలు హ డిమాండ్ చేస్తున్నారు.  దీంతో ప్రధాన్ మస్ట్ గో’ ఉద్యమం కాస్తా పంజాబ్‌లో  బేన్స్ రాజీనామా’ డిమాండ్ కు  దారి తీసింది. చూడాలి మరి ఇప్పుడు ఆప్ ఏ విధంగా స్పందిస్తుందో?  

Harjot Singh Bains, Manish Sisodia Challenge, Punjab Paper Leak Scam, Dharmendra Pradhan Resignation, Punjab Elections

By
en-us Political News

  
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.