రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు బ్లూ ప్రింట్ సిద్దం చేసారా?

Publish Date:Jun 15, 2014

Advertisement



ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి క్యాబినెట్ సమావేశం తరువాత రాష్ట్ర రాజధానితో బాటు వైజాగ్, తిరుపతి మరియు నగరాలను మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలనుకొంటున్నట్లు తెలిపారు. పదమూడు జిల్లాలలో ఒక్కో ప్రాంతానికి ప్రత్యేకమయిన వనరులున్నాయని, వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకొనేలా ఆ ప్రాంతాల అభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్దం చేస్తామని ఆయన తెలిపారు. నిన్న ఆయనతో సమావేశమయిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు తమతో కూడా మళ్ళీ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారని తెలిపారు. అభివృద్ధి అంతా కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా మొత్తం అన్ని జిల్లాలకు సమానంగా వ్యాపింపజేయాలని ఆయన కోరుకొంటున్నారని వారు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాల తగిన స్థలం కోసం తమ అన్వేషణ కొనసాగిస్తామని, అయితే ఈ విషయంలో తాము ఆయనకు కేవలం సలహాలు, సూచనలు మాత్రమే చేస్తామని అంతిమ నిర్ణయం ఆయనే తీసుకోవలసి ఉంటుందని వారు తెలిపారు. అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చంద్రబాబు భావిస్తున్నందున రాజధానితో బాటు ఇతర నగరాలు, పట్టణాల అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు, వాటికీ ఉన్న అవకాశాలు, అవసరమయిన వనరులు, నిధుల గురించి కూడా తమ నివేదికలో చేర్చుతామని తెలిపారు. రేపటి నుండి రాయలసీమలో పర్యటించి ఆ ప్రాంతపు వివరాలు కూడా సేకరిస్తామని తెలిపారు. చంద్రబాబు, శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చాలా లోతుగా చర్చించారు గనుక ఇప్పుడు రాజధాని నిర్మాణం, ఇతర నగరాలు, పట్టణాలు అభివృద్ధి విషయంలో వారందరూ సరయిన అవగాహనకు వచ్చి ఉండవచ్చును. అందువల్ల ఈసారి కమిటీ నుండి మరింత నిర్దిష్టమయిన, మెరుగయిన ప్రతిపాదనలు సూచనలు సలహాలు వచ్చే అవకాశం ఉంది.

 

ఇక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం. వెంకయ్య నాయుడు వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రజలు ఎటువంటి అనుమానాలు, అపోహలకు లోను కావద్దని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఆర్ధిక లోటు ఉన్న సంగతి కేంద్రానికి కూడా తెలుసునని, అందువల్ల కనీసం మొదటి సంవత్సరం ఆ లోటును కేంద్ర ప్రభుత్వమే భరించవచ్చని ఆయన తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురయినా కేంద్రం వాటిని అధిగమించి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని యోచిస్తోందని తెలిపారు. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండవచ్చును గనుక ఆ విధంగా కూడా రాష్ట్రంలో కొన్ని జిల్లాల అభివృద్దికి కేంద్రం నుండి అధనపు నిధులు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఆర్ధిక సమస్యలున్నాయి తప్ప సహజ వనరులు, మానవ వనరులకు లోటు లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఆర్ధికంగా సహాయపడతామని స్పష్టమయిన హామీ ఇస్తోంది గనుక ఇక ప్రయత్నా లోపం లేకుండా కేంద్రం నుండి నిధులు రాబట్టుకొంటూ, రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాల్సి ఉంది.

By
en-us Political News

  
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.