Publish Date:May 27, 2021
తెలుగుదేశం పార్టీ సహా విపక్షాల పోరాటానికి జగన్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై వెనక్కి తగ్గింది. పదో తరగతి పరీక్షలను కూడా వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం... జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నందున పరీక్షలను వాయిదా వేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలన్ని పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పరీక్షలు కూడా రద్దు కావడం జరిగిందన్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టు వీడకండా వ్యవహరించింది. షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాడమాడుతుందనే ఆరోపణలు వచ్చాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాశారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున పరీక్షలు రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు న్యాయ పోరాటానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులూ పరీక్షలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఎట్టకేలకు వాయిదా వేసింది. కరోనా విజృంభణ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ పరీక్షల తేదీలను కరోనా తగ్గుముఖం పట్టాక ప్రకటిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు పదో తరగతి పరీక్షలపై జులైలో మళ్లీ సమీక్షించి నిర్ణయం తీసుకోనుంది. ఇంటర్ పరీక్షలపై కూడా ఆ నెలలోనే ప్రకటన చేసే అవకాశం ఉంది.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. పరీక్షల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. దీంతో పదో తరగతి పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతానికి స్కూళ్లు తెరిచే ఉద్దేశం లేదని కూడా చెప్పింది. ఉపాధ్యాయులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించలేదంటూ దాఖలైన అఫిడవిట్పై విచారణ ముగించాలని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టును కోరారు. అయితే పరీక్షల వాయిదా, స్కూళ్లు తెవబోమని అఫిడవిట్ వేయాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-ssc-exams-postpone-39-116352.html
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.