ఏపీ స్పీకర్, సత్తెనపల్లి ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఆయన్ను నరసరావుపేట ఎంపీగా పోటీ చేయించాలని టీడీపీ భావిస్తుండగా.. ఆయన మాత్రం అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది.
గతంలో నరసరావుపేట నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెలకు ఆ ప్రాంతంపై మంచి పట్టు ఉంది. అయితే 2004, 2009 ఎన్నికల్లో పరాభవం ఎదురవడంతో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గానికి మారారు. 2014లో స్తతెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ వేరే అభ్యర్థి వైపు చూస్తుంది. ఆ సీటును టీడీపీ నిలుపుకోవాలంటే.. కోడెలనే సరైన అభ్యర్థి అని పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి సీటును త్యాగం చేయాల్సిందిగా కోడెలను పార్టీ కోరింది. అందుకు అంగీకరించిన కోడెల.. దీనికి బదులుగా తన కుమారుడికి కూడా ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలన్న ప్రతిపాదనను చంద్రబాబు ముందు పెట్టారు. కోడెల ప్రతిపాదనకు ఓకె చెప్పిన చంద్రబాబు.. నరసరావుపేట ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని చెప్పారు. దీంతో నరసరావుపేట నుంచి ఎంపీగా కోడెల పోటీ దాదాపు ఖాయమైపోయిందని అంతా భావించారు.
అయితే తాజాగా కోడెల తాజాగా చంద్రబాబుకి ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ రాజకీయాలు తనకు సరిపడవని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దంగా లేనన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. ఎంపీగా పోటీకి నిన్న మొన్నటిదాకా సుముఖంగానే ఉన్నట్టు కనిపించిన కోడెల.. ఉన్నట్టుండి మాట మార్చడం చర్చనీయాంశంగా మారింది. మరి కోడెలకు టీడీపీ నచ్చజెప్పుతుందా..? లేక మరోసారి సత్తెనపల్లి టిక్కెట్నే కేటాయిస్తుందా? చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-speaker-kodela-not-interested-to-contest-as-mp-39-86132.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.