ఒక్క నాటికీ క్షమించరు.. ఒక్క శాతం దాట నీయరు!

Publish Date:Sep 22, 2023

Advertisement

బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా,  ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర  సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో, ఉభయ పార్టీల నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి.

ఆ సమయంలోనే,  వాజ్ పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో టీడీపీని  విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రునిగా పేర్కొన్నారు. గౌరవించారు.  టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని, బీజేపీ నాయకులను అదే విధంగా గౌరవించారు.అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలూకూ  లబ్ధి చేకూరింది. రెండు పార్టీలూ ప్రయోజనం పొందాయి. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ పార్టీలూ కలిసి పోటీ   చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలాలలో భాగస్వాములయ్యాయి. 

అయితే  అదంతా చరిత్ర. ఒకప్పటి మాట. నిజానికి  ఒక్క తెలుగు దేశం పార్టీని, పార్టీ నాయకులను మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలను, మిత్ర పక్షాల నాయకులను కూడా వాజ్ పేయి, అద్వానీ నాయకత్వంలో  పనిచేసిన బీజేపీ నాయకులు గౌరవించారు. సంకీర్ణ ధర్మాన్ని చక్కగా పాటించారు. అందుకే  ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ళ పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని చక్కగా  నడిపించారు. అంతవరకు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు  సుస్థిర పాలన ఇవ్వలేవన్న ఆనాటి కాంగ్రెస్ నాయకుల విశ్వాసాన్ని వాజ్ పేయి  వమ్ము చేశారు. సరే  ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిం నుకోండి అది వేరే విషయం.  

అయితే  బీజేపీ ప్రస్తుత నాయకత్వం ,(మోడీ షా జోడీ) మిత్ర పక్షాలకు గౌరవం ఇవ్వక పోవడమే కాదు, అవకాశం చిక్కితే మిత్ర పక్షాల అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది  లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే  విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న టీడీపీ సహా అనేక మిత్ర పక్షాలు బీజేపీకి దూరమ య్యాయి.ఇప్పుడుకేంద్రంలో ఉన్నది పేరుకు మాత్రమే ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వం. మోదీ మంత్రివర్గంలో  మిత్ర పక్షాలకు పెద్దగా స్థానం లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు పెద్ద ప్రాముఖ్యత లేదు. వాస్తవానికి మోడీ కేబినెట్ లో   అమిత్ షా మినహా మిగిలిన మంత్రులెవరికీ పెద్దగా ప్రాధాన్యత, ప్రాముఖ్యతా లేదు.  

 ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే  రాష్ట్రంలో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడింది. బీజేపీకి నిండా ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మాజీ మిత్ర పక్షం తెలుగుదేశం అడ్డు తొలిగించి ఆ తర్వాత వైసీపీనీ టార్గెట్ చేసే దీర్ఘకాల వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఆ వ్యూహంలో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని మట్టు పెట్టే కుట్రలు పన్నుతున్నది. అందులో భాగంగానే  చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా, చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తెర వెనక కథ నడుపుతున్నది కేంద్రంలోని కమల దళమే అయినా తెర ముందు మాత్రం రాష్ట్ర నేతలతో మరో రకం డ్రామాను నడిపిస్తోందనే నిన్నటి అనుమానాలు, ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పడు  వాస్తవం అని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పరిశీలకుల విశ్లేషణలే కాదు సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు. ఇంతవరకూ జనసేనతో కలిసి  తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని  వైసేపీని గద్దె దించడంలో బీజేపీ తమ వంతు పాత్రను పోషిస్తుందని అనుకున్న, ఆశించిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీజీపే అసలు రంగు బయట పడిందని అంటున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో వామ్మో  బీజేపీ క్రిమినల్ బ్రెయిన్ మరీ ఇంత షార్పా అని విస్తుపోతున్నారు.

అంత క్రిమినెల్ బ్రెయిన్ ఉంది కనుకనే జగన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడమన్నట్లల్లా ఆడేలా చేసుకోగలిగారని అంటున్నారు. అయితే ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు , కుతంత్రాలకు పాల్పడినా, ప్రత్యేక హోదా సహా, ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేర్చక పోగా, వైసీపీ అరాచక,అవినీతి ప్రభుత్వానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర ప్రజలు ఒక్క నాటికీ క్షమించరనీ,  ఒక్క  శాతం ఓటుకు మించి రానీయరనీ అంటున్నారు.  

By
en-us Political News

  
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కలిశారు. ఇటీవల రాష్ట్రపతి చేతుల మీదగా పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు.
రుమల తిరుపతి భద్రతకు ముప్పు పొంచి ఉందా? అన్న ప్రశ్నకు పరిశీలకులు ఔననే అంటున్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం శ్రీవారి దర్శనం చేసుకున్న హరీష్ కుమార్ గుప్తా.. దర్శనానంతరం తిరమల భద్రతపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
రాజకీయ, సినిమా రంగాల సంబంధ బాంధవ్యాల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ, సినిమా రంగాలు పాలు నీళ్ళలా కలిసి పోయాయి.
అది పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్. అక్క‌డ పీఎంఎంఎల్ అంటే పాకిస్తాన్ మ‌ర్క‌జీ ముస్లిం లీగ్ అనే ఒక రాజ‌కీయ పార్టీ ర్యాలీ నిర్వ‌హిస్తే అందులో ఒక‌డు క‌నిపించాడు. ఈ మ‌ధ్య అంటే, మే 28న అత‌డిని అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదిగా ముద్ర వేసింది ఐక్య రాజ్య‌స‌మితి. అందుకు అత‌డ‌న్న మాట నేనిపుడు వ‌ర‌ల్డ్ వైడ్ ఫేమస్ అయ్యాను అని. ఇంత‌కీ అత‌డు చేసిన ఘ‌న‌కార్యం ఏంట‌ని చూస్తే ప‌హెల్గాం దాడి ద్వారా 26 మంది భార‌తీయుల‌ ప్రాణాలు పోయేలా చేయ‌డం. అతడి పేరు సైఫుల్లా కసూరి.
పెద్దపల్లి జిల్లా మంచిర్యాల పర్యటనలో మరోసారి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు సొంత అజెండా ఏమీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నదే నా వాదన అని ఆమె అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత మరో సంచలనానికి తెర తీశారు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరుగున్నాయని మీడియా చిట్ చాట్ లో చెప్పారు. నిజానికి మై డియర్ డాడీ అంటూ కేసేఅర్ కు రాసిన, లేఖలోనూ కవిత, బీజేపీ, బీఆర్ఎస్ సంబంధాలని ప్రస్తావించారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణీ, దివ్వెల మధురిల వ్యవహారం ఎంత అలజడి రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హై ఎనర్జిటిక్ ఫ్యామిలి డ్రామా అప్డేట్స్ అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో సైతం సేన్షేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ టోటల్ ఎపిసోడ్ లో దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాధురి ప్రవేశించడం.. అక్కడితో దువ్వాడ వాణి అకస్మాత్తుగా తన నిరసనకు మంగళం పాడి మాయం అవ్వడం.. క్లైమాక్స్ లేని కధగా మారింది.
కడప వైఎస్ జగన్ అడ్డా అన్న అపోహ ఈ మహానాడుతో తొలగిపోయిందనని వారు అన్నారు. కడపలో తెలుగుదేశం మహానాడు ఇంత పెద్ద ఎత్తున విజయవంతం కావడం వైఎస్ కుటుంబానికి చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమం వినూత్నంగా నిలిచింది. పర్యాటక ప్రదేశం అయిన రామనారాయణం లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో రామధనస్సు ఆకృతిలో పదిహేను వందలమంది యోగాసనాలు వేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.
బనకచర్లపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఆరు శాసనాలతో నూతనత్వాన్నీ, కొత్త నాయకత్వాన్నీ తీసుకు వచ్చామని చంద్రబాబు అన్నారు. మహానాడు ముగింపు సందర్భంగా కడపలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన మహానాడులో తీర్మానించుకున్న ఆరు శాసనాలనూ తు.చ. తప్పకుండా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి సుమాలను పూయిస్తానన్నారు. రాయలసీమ అంటే రాళ్ల సీమ కాదన్న చంద్రబాబు.. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని చెప్పారు.
నిజానికైతే క‌న్న‌డ‌కు త‌మిళానికీ ఉన్న లింకు మాట ఎలాగున్నా... తెలుగు క‌న్న‌డ‌కు మాత్రం చాలానే సంబంధ బాంధ‌వ్యాలున్న‌ట్టు క‌నిపిస్తాయ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.