ఏపీ ఎన్జీవోలు, తెలంగాణావాదుల పోరాటం దేనికోసం

Publish Date:Sep 6, 2013

Advertisement

 

రేపు హైదరాబాదులో ఏపీ యన్జీవోలు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరిట సభ నిర్వహించాలనుకోవడం, దానిని అడ్డుకొనేందుకు తెలంగాణావాదులు బంద్ కు పిలుపునీయడం వారివారి అందోళనలకు అద్దం పడుతున్నాయి. ఏపీ యన్జీవోలు హైదరాబాదులోనే సభ నిర్వహించాలనుకోవడానికి ప్రధాన కారణం అక్కడ పనిచేస్తున్న ఆంధ్ర ఉద్యోగులకు, నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలకు దైర్యం కలిగించడం, తెలంగాణవాదులకు తమ శక్తిని ప్రదర్శించి తాము ఎవరి బెదిరింపులకీ భయపడమని తెలియజేయడానికేనని భావించవచ్చును. కేవలం ఉద్యోగుల సమస్యలను చర్చించడానికే అయితే, ఈ సభను ఆంధ్ర ప్రాంతంలో మరెక్కడయినా పెట్టుకోవచ్చును.

 

రాష్ట్ర విభజన జరిగిన తరువాత తమకు ఉద్యోగపరంగా అనేక సమస్యలు వస్తాయని ఏపీ యన్జీవోలు ఆందోళన చెందడం సహజమే. ఒక ప్రభుత్వ హయాములో పని చేస్తున్నపుడే వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక విభజన జరిగితే రెండు ప్రభుత్వాలు తమ జీవితాలతో ఫుట్ బాల్ ఆడుకొంటాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో టీ-యన్జీవోలు కూడా వారి పరిస్థితి పట్ల సానుకూలంగానే ప్రవర్తిస్తున్నారు.

 

అయితే, ఏపీ యన్జీవో నేతలు రాజకీయంగా వాదిస్తుండటంతో వారి సభకు అభ్యంతరం చెపుతున్నారు. ఏపీ యన్జీవోలు ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించకుండా, ఆ సాకుతో రాష్ట్ర విభజనను అడ్డుకొంటామని చెప్పడం వారి ఆగ్రహానికి కారణం అవుతోంది. కొందరు సీమంధ్ర రాజకీయ నేతల ప్రోద్బలంతో, వారి వ్యూహంలో భాగంగానే ఏపీ యన్జీవోల ఈ సభ జరుగుతోందని తెలంగాణావాదులు అనుమానిస్తున్నారు.

 

ఏపీ యన్జీవోలకు రాష్ట్ర విభజనను అడ్డుకొనేంత శక్తి లేదనే సంగతి ఇరుప్రాంత యన్జీవోలకి బాగా తెలుసు. అయినా, ఒకరు విభజనను అడ్డుకొంటామని హుంకరించడం, దానికి అంతే ధీటుగా మరొకరు జవాబు చెప్పడం కేవలం ఇరువర్గాల నేతల భేషజాల వల్లనే జరుగుతోంది.

 

వారిరువురి వాదనలలో ‘రాష్ట్ర విభజన’, ‘ఉద్యోగుల హక్కులు’ అనే రెండు అంశాలు మాత్రమే పైకి వినిపిస్తున్నపటికీ, వారి అసలు పోరాటం మాత్రం హైదరాబాద్ గురించేనన్నది బహిరంగ రహస్యమే. హైదరాబాదు, దాని ఆదాయంపై తమకు పూర్తి హక్కులు ఉన్నాయని భావిస్తున్న సీమంద్రా ప్రాంత ఉద్యోగులు, ప్రజలు ఆవిషయాన్నీ మరింత బలంగా నొక్కి చెప్పడానికే ఈ సభను నిర్వహిస్తున్నారనేది కాదనలేని విషయం. సరిగ్గా ఇదే అంశంపై వారిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నతెలంగాణావాదులు ఏపీ యన్జీవోల సభను అడ్డుకోవాలని భావిస్తున్నారు.

 

ఇటువంటి ఆలోచనలను మొగ్గ దశలో త్రుంచి వేయకపోయినట్లయితే, సీమంధ్ర రాజకీయ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హైదరాబాదుపై వారికి అనుకూల నిర్ణయం వచ్చేలా ఒప్పించే ప్రమాదం ఉందని తెలంగాణావాదుల ఆందోళన చెందుతున్నారు. అంటే, ఇరువర్గాల నేతలు నిర్వహించదలచిన ఈ పోటాపోటీ కార్యక్రమాల వెనుక అసలు కారణం కేవలం హైదరాబాదు అంశమేనని అర్ధం అవుతోంది.

 

అయితే ఇటువంటి సంక్లిష్టమయిన అంశంపై పోటాపోటీగా బహిరంగ సభలు,ర్యాలీలు, బందులు చేయడంవలన సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప ఎటువంటి పరిష్కారం దొరకదు. ఇటువంటి సమస్యలు చట్టపరంగా పరిష్కరించుకోవలసి ఉంటుందని వారికీ తెలుసు.

 

ఇంత కాలం యావత్ రాష్ట్రాన్ని ఎంతో సమర్ధంగా నడిపిన ప్రభుత్వోద్యోగులు, తమ పంతాలను, భేషజాలను పక్కన బెడితే ఇప్పుడు తమ స్వంత సమస్యలను కూడా అవలీలగా పరిష్కరించుకోగలరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇరుప్రాంత ఉద్యోగులు చిరకాలం కలిసి పనిచేయక తప్పదనే సంగతి వారికీ తెలుసు. ఇంతకాలం ఒకే కుటుంబ సభ్యులవలే కలిసిమెలిసి పనిచేసిన వారు, స్వార్ధ రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆడే రాజకీయ చదరంగంలో పావులుగా మారకుండా జాగ్రత్త పడాలి.

 

అదేవిధంగా ఇరు ప్రాంతాల ఎన్జీవో నేతలలో సమస్యలు సృష్టిస్తున్నకొందరు అతివాదులను గుర్తించి అటువంటి వారిని దూరంగా పెట్టగలిగితే సమస్యలు చాల వరకు సానుకూలంగా పరిష్కరించుకొనే అవకాశముంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.