స్పష్టమయిన సందేశమిచ్చిన ఏపీఎన్జీవో సభ

Publish Date:Sep 7, 2013

Advertisement

 

అందరూ భయపడినట్లుగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏపీఎన్జీవోల సభ, టీ-జేయేసీ బంద్ ప్రశాంతంగా ముగిసాయి. ఇరువర్గాల నేతలు ప్రజలకు సంయమనం పాటించమని పదే పదే చేసిన విజ్ఞప్తి కారణంగానే ఇది సాధ్యమయిందని చెప్పవచ్చును.

 

ఇక ఈ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో ప్రసంగించిన ఎన్జీవో నేతలు, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర రాజకీయ పార్టీ నేతలకి, తెలంగాణా నేతలకి చాలా స్పష్టమయిన సందేశమే ఇచ్చారు. కేంద్రం రాష్ట్రవిభజన నిర్ణయం వెనక్కు తీసుకొనే వరకు తమ సమ్మె, ఉద్యమం కొనసాగుతాయని స్పష్టం చేసారు. (సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్ర విభజనపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం విశేషం.) సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, తమ రాజీనామాలతో దారికి తేవాలని ఎన్జీవో నేతలు స్పష్టం చేసారు. వారు వెంటనే తమ తమ పదవులకు రాజీనామాలు ఇచ్చి, కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకొనేలా ఒత్తిడి చేయాలని వారు కోరారు. ఒకవేళ రాజీనామాలు చేయకుండా పదవులను పట్టుకొని వ్రేలాడినట్లయితే వారికి గట్టిగా బుద్ది చెపుతామని హెచ్చరించారు.

 

ప్రజాభీష్టం తెలుసుకోకుండా కాంగ్రెస్ తీసుకొనే నిర్ణయాలను తాము ఆమోదించలేమని స్పష్టం చేసారు. ప్రజలు వారిని ఎన్నుకొనేది పాలించడానికే కానీ విభజించడానికి కాదని అన్నారు. ఉద్యమాల వలన ప్రజలు తప్ప, రాజకీయ నాయకులెవరూ నష్ట పోలేదని వారు అన్నారు. కాంగ్రెస్ తీసుకొన్న నిర్ణయంపై ఇప్పుడు ముందుకు కానీ, వెనక్కు గానీ వెళ్ళలేని స్థితిలో ఉందని అన్నారు.

 

ఇక సభలో ప్రసంగించిన నేతలందరూ హైదరాబాదుపై తమ హక్కులను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజల సమిష్టి కృషి మూలంగా నేడు హైదరాబాదు ఈ స్థితికి వచ్చిందని, అందువల్ల హైదరాబాదుపై అందరికీ సమాన హక్కులు ఉంటాయని, తమను పొమ్మనే అధికారం ఎవరికీ లేవని వారు స్పష్టం చేసారు. అదేవిధంగా హైదరాబాదులో స్థిరపడిన ఆంద్ర ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామనే భరోసా కల్పించారు.

 

పాలకులు కేవలం హైదరాబాదునే అభివృద్ధి చేసుకొంటూ పోయి, రాష్ట్రంలో మిగిలిన జిల్లాలన్నిటినీ నిర్లక్ష్యం చేయడం వలననే నేడు ఈ దుస్థితి వచ్చిందని అన్నారు. అందువల్లే రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలయినా హైదరాబాదుపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడిందని, అటువంటప్పుడు తమను ఇప్పుడు అకస్మాత్తుగా బయటకి పొమ్మంటే ఎక్కడికి పోతామని వారు ఆవేదన వ్యక్తం చేసారు. హైదరాబాదును ఎట్టి పరిస్థితుల్లో వదులుకొనే ప్రసక్తి లేదని వారుస్పష్టం చేసారు.

 

రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అప్పటి పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు ప్రజల అభిమతం మేరకు ఆ లేఖలు వెనక్కు తీసుకొని సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తమతో కలిసి ఉద్యమించాలని లేకుంటే వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు.

 

రాజకీయ నాయకులు బస్సు యాత్రలు, రధ యాత్రలు చేస్తూ ప్రజలకు చరిత్ర పాటాలు భోదించనవసరం లేదని, ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వారికి తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఇప్పటికయినా సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్న ప్రజలకు అండగా నిలిస్తే ప్రజలు వారిని క్షమిస్తారని తెలిపారు.

 

మొత్తం మీద ఎన్జీవో నేతలు విభజనపై దూకుడు ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, పదవులను అంటి పెట్టుకొని నాటకాలు ఆడుతున్న ప్రజా ప్రనిధులకు, యాత్రల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న రాజకీయ పార్టీ నేతలకి, హైదరాబాదు నుండి పొమ్మని చెపుతున్న తెలంగాణా నేతలకి ఈ సభ ద్వారా స్పష్టమయిన సందేశం ఇచ్చారు. దీనిపై సదరు వర్గాల ప్రతిస్పందనలు రేపటి నుండి గమనించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.