ఏపీ ఎన్జీవోలు రాజకీయ మద్దతు తీసుకోక తప్పు చేసారా

Publish Date:Sep 2, 2013

Advertisement

 

సమైక్యాంధ్ర కోరుతూ ఏపీ ఎన్జీవోలు మొదలుపెట్టిన నిరవధిక సమ్మె మూడు వారాలుపైగా గడిచినప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ కాంగ్రెస్ అధిష్టానంలో గానీ ఎటువంటి చలనము లేదు. కాంగ్రెస్ అధిష్టానం వారిని సమ్మె విరమించి, అంటోనీ కమిటీకో లేక కొత్తగా ఏర్పరచబోయే మరో ప్రభుత్వ కమిటీకో తమ సమస్యలను నివేదించుకోమని ఉచిత సలహా ఇచ్చింది తప్ప వారి సమ్మెను, అభ్యర్ధనలను పట్టించుకోలేదు. పైగా, ప్రధాన మంత్రితో సహా అందరూ కూడా తెలంగాణా ఏర్పాటుపై ఇక వెనకడుగు వేయబోమని కుండలు బ్రద్దలు కొడుతున్నారు.

 

దీనితో హతాశులయిన ఏపీ ఎన్జీవో నేతలు ప్రతిపక్ష నేతలను, ఇతర రాజకీయ నేతలను కూడా మద్దతు కోసం కలిసినా ప్రయోజనం లేకపోయింది. వారు సీమంధ్రకు చెందిన చిరంజీవి, పళ్ళంరాజు, శీలం, కావూరి, పనబాక, పురందేశ్వరి తదితర కేంద్రమంత్రులను రాజీనామాలు చేసి ఉద్యమాలలోకి రాకపోతే వచ్చే ఎన్నికలలో గట్టిగా బుద్ధి చెపుతామని హెచ్చరించినప్పటికీ, వారు త్వరలో తమ నిర్ణయం చెపుతామని నచ్చజెప్పి సాగనంపారు.

 

ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి, సీమంధ్ర మంత్రులు కూడా రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్నారనే విషయం ఏపీ ఎన్జీవోలకు తెలిసి ఉన్నపటికీ, వారు చేతలుడిగి కూర్చోవడంతో వారిని దూరం పెట్టారు. ఇక తమ మద్దతుకోసం వస్తున్నశాసనసభ్యులను రాజకీయ నాయకులను కూడా నిలదీస్తూ ఏపీ ఎన్జీవోలు వారిని దూరంగా తరిమేశారు. ఇక ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, వైకాపాల మద్దతు తీసుకోకుండా ఏపీ ఎన్జీవోలు తమ సమ్మెతో సమైక్యాంధ్ర సాధించాలని భావించారు.

 

ఈవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలనదరినీ దూరంపెట్టడం వలన వారి సమ్మెకు అవసరమయిన రాజకీయ మద్దతు కరువవడంతో, వారి మాట వినేవారే లేకుండాపోయారు. ముల్లును ముల్లుతోనే తీయలన్నట్లు, రాజకీయనాయకులను రాజకీయ నాయకుల సహాయంతోనే డ్డీ కొనాలనే జ్ఞానోదయం ఏపీ ఎన్జీవోలకు చాలా ఆలస్యంగా జరిగింది.

 

బహుశః అందువల్లేనేమో ఈ నెల 7న హైదరాబాదులో తాము తలపెట్టిన భారీ బహిరంగ సభకు సమైక్యాంధ్ర కోరుతున్న నేతలందరూ పార్టీలకతీతంగా వస్తే ఆహ్వానిస్తామని వారు ప్రకటించారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తునందున తెదేపా ఈ సభలో పాల్గోనలేకపోవచ్చును. కానీ, సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్న సీమంధ్ర కాంగ్రెస్, వైకాపాలు ఈసువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయవచ్చును. కానీ అసలు సభకు పోలీసుల నుండి అనుమతి లభిస్తుందా? లభించినా తెలంగాణా నేతలు తలపెడుతున్న పోటీ సభలతో సభ జరుగుతుందా? అనే అనుమానాలున్నాయి.

 

ఏమయినప్పటికీ, రాజకీయ మద్దతు లేకుండా ఏపీ ఎన్జీవోలు చేసిన నెలరోజుల సమ్మె వ్యర్ధం అయిపోయే అవకాశాలే ఎక్కువ. ఈ నెల జీతాలు అందక ఉద్యోగులు నిరాశ చెందుతూ, సమ్మె ఎంత త్వరగా ముగిస్తే అంత మేలనే ఆలోచన మొదలవుతున్న ఈ తరుణంలో, ఏపీ ఎన్జీవోనేతలు ఇంత ఆలస్యంగా రాజకీయ నాయకులను, పార్టీలను సమ్మెకు మద్దతు కోరడం వలన ప్రయోజనం ఉండకపోవచ్చును.

 

ఒకసారి ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించుకోవడం మొదలుపెడితే రాజకీయ పార్టీలు కూడా ఉద్యమాలు నిలిపివేసి ఎన్నికల సన్నాహాలలో పడిపోతాయి. బహుశః అంతిమంగా ఇదే జరుగుతుందేమో?

By
en-us Political News

  
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినలో బిజీబిజీగా ఉన్నారు. ఓ వైపు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూనే, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతూ క్షణం తీరక లేకుండా గడుపుతున్నారు.
ఐడీపీఎల్ భూముల విషయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ కవిత ఇటీవల పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భూముల వ్యవహారం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
జగన్ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు.
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.