Publish Date:Jan 27, 2022
ఒక పక్కన కొత్త పీఆర్సీ వద్దు.. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. వారికి ట్రెజరీ సిబ్బంది కూడా మద్దతుగా నిలిచారు. ట్రెజరీ ఉద్యోగులు కూడా పీఆర్సీ ఉద్యమంలో భాగం అయ్యారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు, పెన్షన్ బిల్లులు ప్రాసెస్ చేయాలని జగమొండి జగన్ సర్కార్ ట్రెజరీ సిబ్బందిపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతోంది. రివైజ్ డ్ పేస్కేల్ కు సంబంధించిన ప్రక్రియను ట్రెజరీ సిబ్బంది ప్రారంభించ లేదు. ఈ నేపథ్యంలో భారత గణతంత్ర దినోత్సవం నాడు సెలవు రోజైనా రాష్ట్ర ఆర్థికశాఖ ఓ సరికొత్త సర్క్యులర్ జారీ చేయడం కలకలం రేపుతోంది. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ సర్క్యులర్ విడుదల చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి నెల వేతనాలు, పెన్షన్ బిల్లులను రివైజ్డ్ పే స్కేల్ 2022ను అనుసరించి ప్రాసెస్ చేయాలంటూ ఆ సర్క్యులర్ లో ట్రెజరీ ఉద్యోగులను ఆయన ఆదేశించారు. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం బిల్లుల ప్రక్రియ నిర్వహించకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా ఆ సర్క్యులర్ లో ఎస్ ఎస్ రావత్ హెచ్చరించడం గమనార్హం. చెప్పిన పని చేయకపోతే డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు జమ అయ్యేలా చర్యలు చేపట్టాలని ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ సూచించింది.
అయితే.. గత కొన్ని నెలలుగా వైసీపీ సర్కార్ ఉద్యోగులకు ప్రతి నెలా ఠంచన్ గా ఫస్ట్ తారీఖునే జీతాలు ఇవ్వడం లేదనేది ఇక్కడ ప్రస్తావించదగ్గ అంశం. కొత్త పీఆర్సీ వద్దు, పాత పీఆర్సీ ప్రకారమే తమకు జీతాలు ఇవ్వాలని పట్టుబట్టి, ఫిబ్రవరి 6 నుంచి సమ్మెలోకి వెళ్తున్న ఉద్యోగులపై కక్షతోనే ఏపీ సర్కార్ ఇలా వేధింపుల సర్క్యులర్ జారీ చేసిందని ఉద్యోగ సంఘాల నేతలు ఫైరవుతున్నారు. జీతాల బిల్లులు ప్రాసెస్ చేయబోమంటున్న ట్రెజరీ సిబ్బందిపై ఇలా సర్క్యులర్ జారీచేయడాన్ని తప్పుపడుతున్నారు. పైగా టైమ్ లైన్ విధిస్తూ.. గురువారం సాయంత్రంలోగా రివైజ్డ్ బిల్లులు అప్ లోడ్ చేయాలని పే అండ్ అకౌంట్స్ విభాగంలోని డీడీఓలకు సర్క్యులర్ లో సూచించడాన్ని ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్ర ఆర్థిక శాఖ ఇలా ఒత్తిడి పెంచుతూ సర్క్యులర్ జారీ చేయడంపై పీఆర్సీ సాధన సమితి నేత బండి శ్రీనివాసరావు ఫైరవుతున్నారు. వేతన సవరణపై అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నిర్ణయించి మధ్యంతర భృతి 27 శాతం కన్నా ఫిట్ మెంట్ తక్కువకు అంటే 14.29 శాతానికే పరిమితం చేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలా ఐఆర్ కన్నా ఫిట్ మెంట్ తక్కువ ఇచ్చిన దాఖలాలు చరిత్రలో లేవంటున్నారు.
ఒక పక్కన ట్రెజరీ ఉద్యోగుల సహాయ నిరాకరణ.. మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో జనవరి నెల జీతాలు అందుతాయో లేదో అని పలువురు చిన్నా చితకా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-new-circular-on-new-pay-scale-39-130815.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.