మద్యం స్కాం అంతిమ లబ్ధిదారు జగనే.. కోర్టులో బేవరేజెస్ మాజీ ఓఎస్డీ వాంగ్మూలం.!

Publish Date:Sep 18, 2026

Advertisement

జగన్ హయాంలో ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో  దర్యాప్తు ముమ్మరమైన తరుణంలో అత్యంత కీలకమైన పరిణామం వెలుగు చూసింది. అప్పటి జగన్ ప్రభుత్వంలో  వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో అసలు సిసలైన అంతిమ లబ్ధిదారు అప్పటి సీఎం జగనేనని రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ ఓఎస్డీ సత్యప్రసాద్‌ న్యాయస్థానం ఎదుట  వాంగ్మూలం ఇచ్చారు. తాడేపల్లిలోని మాజీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనే ఈ మొత్తం స్కాప్ కు రూపకల్పన జరిగిందని, అక్కడే మద్యం విధివిధానాలు, పాలసీలు ఖరారయ్యాయని ఆయన తన వాంగ్మూలంలో విస్పష్టంగా చెప్పారు.  ఈ కేసులో ఇప్పటికే సిట్‌ అధికారులు అనేక ఆధారాలు సేకరించినప్పటికీ, మాజీ అధికారి ఏకంగా కోర్టులో ఈ స్కాం కు స్కెచ్ ఎక్కడ వేశారు. అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న వివరాలను పూసగుచ్చినట్లు  వెల్లడించడం సంచలనంగా మారింది. 

ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం(సెప్టెంబర్ 18) దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.   డిస్టిలరీల నుంచి పెద్ద ఎత్తున కమీషన్లు వసూలు చేయడం, నచ్చిన బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు ఇవ్వడం, మిగిలిన బ్రాండ్లను పక్కన పెట్టడం వంటి అంశాలన్నింటినీ ఆయనీ సందర్భంగా కళ్లకుకట్టినట్లు చెప్పారు. ఆటోమేటిక్‌ విధానాన్ని పక్కన పెట్టి పూర్తిగా మాన్యువల్‌ విధానాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనే విషయాలను ఆయన కోర్టు ముందు వివరించారు. 

విజయవాడ ఏసీబీ కోర్టులో నమోదు చేసిన ఈ వాంగ్మూలం ప్రకారం..  మద్యం విక్రయాల డేటా పరిశీలన, కమీషన్ల వసూళ్ల బాధ్యతలను తొలుత తనకు, నాటి ఎండీ వాసుదేవరెడ్డికి అప్పగించారని సత్యప్రసాద్ వెల్లడించారు. నాన్‌ కేడర్‌ ఐఏఎస్‌ లేదా తూడా కార్యదర్శిగా పోస్టింగ్ ఇస్తామని నమ్మబలికి తనను ఈ వ్యవహారంలోకి లాగారని సత్యప్రసాద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తాడేపల్లిలోని జగన్‌ నివాసంలో జరిగిన సమావేశంలో కీలక వ్యక్తుల సమక్షంలో లిక్కర్ పాలసీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ భేటీలో కొద్దిమంది ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారన్న సత్యప్రసాద్.. డిస్టిలరీల నుంచి నెలకు  50 కోట్ల నుంచి  60 కోట్ల రూపాయల వరకు ముడుపులు వసూలు చేసేవారనీ, ఈ సొమ్మును వివిధ మార్గాల ద్వారా సమీకరించి   నాటి ముఖ్యమంత్రి జగన్‌కు చేరవేశారని ఆయన వెల్లడించారు.

ఈ  కుంభకోణంలో భాగంగా ఆటోమేటిక్‌ విధానానికి స్వస్తి పలికి పూర్తిగా మాన్యువల్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగిందని సత్యప్రసాద్‌ తెలిపారు. డిస్టిలరీల యజమానులతో ప్రత్యేక యాప్‌ల ద్వారా సంప్రదింపులు జరిపి, విక్రయాలు, డిపోల సమాచారాన్ని సేకరించేవారని చెప్పారు. కమీషన్లు చెల్లించడానికి అంగీకరించిన కంపెనీలకే ఆర్డర్లు కేటాయించడమే కాకుండా.. ధరలు కూడా పెంచారని వెల్లడించారు. ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన కంపెనీల ఆర్డర్లను నిలిపివేశారని తెలిపారు. ఒక్కో మద్యం కేసుపై నిర్దిష్ట మొత్తంలో వసూళ్లు చేసి, వాటిని సంబంధిత వ్యక్తుల ద్వారా పంపిణీ చేసి అంతిమంగా అప్పటి ముఖ్యమంత్రికి చేరవేసేవారని సత్యకుమార్ తన వాంగ్మూలంలో విస్పష్టంగా పేరుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 

గతంలో ఎక్సైజ్ శాఖలోనూ, బేవరేజెస్‌ కార్పొరేషన్‌లోనూ వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న సత్యప్రసాద్, ఈ కుంభకోణానికి సంబంధించిన గుట్టును  బయటపెట్టడం విశేషం. కేవలం బ్రాండ్ల ఎంపిక మాత్రమే కాకుండా, ఫీల్డ్‌ మానిటర్ల నియామకం, రవాణా బాధ్యతల అప్పగింత, సాఫ్ట్‌వేర్ మార్పుల వంటి ప్రతి దశలోనూ భారీస్థాయిలో అక్రమాలు జరిగాయని సత్యప్రసాద్ వాంగ్మూలమిచ్చారు.  కొన్ని కంపెనీలకు రాష్ట్రంలో డిస్టిలరీలు లేకపోయినా నాసిరకం బ్రాండ్లను విరివిగా అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చారని, జీవోల ద్వారా ధరలను అమాంతం పెంచేశారని వివరించారు.   ఈ అక్రమాల ద్వారా సమీకరించిన మొత్తం సుమారు 3 వేల 2 వందల కోట్ల రూపాయలు ఉంటుందనీ,   ఈ నిధులన్నీ వివిధ స్థాయిలలో  చేరాల్సిన వారికి చేరాయని పేర్కొన్నారు.

ఈ కేసులో మాజీ అధికారి అప్రూవర్‌గా మారడానికి ముందుకు రావడం, నేరుగా న్యాయస్థానం ఎదుట  వాంగ్మూలం ఇవ్వడం  రానున్న రోజుల్లో మరికొన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే జగన్ ను కూడా ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు అంటున్నారు.   

[AP Liquor Scam, YS Jagan Mohan Reddy, Satya Prasad Statement, Vijayawada ACB Court, Final Benificiary, Telugu One] 

By
en-us Political News

  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.