లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ అరెస్టు కావడం ఖాయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ మద్యం కుంభ కోణం కన్నా ఇదీ పెద్దదని అంతటా ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంటే ఇక్కడి లిక్కర్ షాపులో మాత్రం క్యాష్ తీసుకొని మద్యం అమ్మకాలు చేశారని ఖచ్చితంగా స్కాం జరిగిందని విచారణ జరుగుతుందని అందరు శిక్ష అనుభవిస్తారని టీజీ భరత్ అన్నారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో కలిసి సింగపూర్లో పర్యటించామని గత ప్రభుత్వం సింగపూర్ ను తప్పుడు విధంగా చిత్రీకరించి వారి మంత్రులు విచారణ, అవినీతి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి రాష్ట్రంపై ఉన్న అపోహలు తొలగించారని త్వరలోనే సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
తమకంటూ విజన్ ఉందని దానికి అనుగుణంగా పనిచేస్తూ వెళ్తున్నామని, సింగపూర్,గుజరాత్ లో స్థిరంగా ప్రభుత్వం కోసగడంతో అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చిందన్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని,తాము కుదుర్చుకున్న ఒప్పందాలను త్వరలోనే వెల్లడిస్తామని, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహాలు సంబంధించి మంత్రి నారా లోకేష్ త్వరలోనే సంచలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని టీజీ భరత్ వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-liquor-scam-25-203391.html
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.