ఏపీ మద్యం తాగితే అంతే సంగతులు!

Publish Date:Oct 27, 2023

Advertisement

 ఆంధ్రప్రదేశ్ లో మద్యం విధానం ఓ పెద్ద కుంభకోణం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకొనే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇది మాత్రం మా చేత.. మా కొరకు..మేమే తెచ్చుకున్న మద్యం విధానాన్ని జగన్ సర్కార్ అవలంబిస్తోంది. ఏపీలో మద్యం విధానంపై మొదటి నుంచీ విమర్శలు, ఆరోపణలూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. జగన్ సర్కార్ మందు బాబుల ప్రాణాలను హరించేలా నాసిరకం మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తోందని, మొత్తం మద్యం విధానమంతా వైసీపీ అగ్రనేతల కనుసన్నలలో సాగుతోందన్న విమర్శలూ ఉన్నాయి. అయితే తాజాగా భువనేశ్వరి ఏపీ ప్రభుత్వ మద్యం వ్యాపారం బండారాన్ని బట్టబయలు చేశారు. దీని వెనుక ఉన్న పెద్దల పేర్లనూ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందన ఏమిటో ఇంకా తెలియలేదు కానీ.. ఏపీలో మాత్రం మరెక్కడా వినని, కనని బ్రాండ్ల పేరుతో విషంలాంటి మద్యాన్ని యథేచ్ఛగా ప్రభుత్వమే విక్రయించేస్తోంది. 

ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, యూత్ స్టార్, యంగ్ స్టార్, టాప్ స్టార్, సూపర్ స్టార్, 999 పవర్ స్టార్, ఛాంపియన్, సెలబ్రిటీ, రాయల్ సింహ, బ్లాక్ బస్టర్, భూమ్ భూమ్, బ్యాచిలర్ ఛాయిస్, కౌంట్ డౌన్, గెలాక్సీ, రాయల్ గోల్డ్, ఆంధ్ర గోల్డ్, ఆల్ సీజన్ బ్రాందీ, కల్ట్ విస్కీ.. ఈ పాటికే అర్ధం అయ్యే ఉంటుంది ఈ చిత్ర విచిత్రమైన పేర్లన్నీ ఏంటో. మన దేశంలో ఓ యాభై ఏళ్లుగా రోజూ మందుకొట్టే మహారాజులకు కూడా ఈ బ్రాండ్స్ గురించి తెలియదేమో. అసలు ఇలాంటి బ్రాండ్లు ఉన్నాయనీ కానీ వస్తాయని కానీ ఎవరూ ఊహించి ఉండరేమో. కానీ, ఏపీలో ఇదే మందు.. ఇవే బ్రాండ్లు. ఇప్పటికే ఈ పేర్లలో సోషల్ మీడియాలో కావాల్సినన్ని మీమ్స్, వీడియోలు కూడా ఉండగా.. కనీస పరీక్షలు కూడా చేయని మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి అమ్మేస్తూ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్షాలు ఎన్ని ఆరోపించినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ కంపెనీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని దబాయిస్తారు.

 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. అప్పటి నుండి నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడుపుతూ వస్తుండగా.. ఇందులో వైసీపీ కార్యకర్తలే జీతాలకు పనిచేస్తున్నారు. ప్రభుత్వమే నడపనీ, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వనీ ప్రజలకు కావాల్సింది క్వాలిటీ. కానీ, ఏపీలో ఆ ఒక్కటే అడగకూడదు అన్నట్లు ఉంది పరిస్థితి. గతంలో ఎన్నడూ చూడని.. ఎప్పుడూ వినని బ్రాండ్లు, సీసాలు ఏపీలో కనిపిస్తున్నాయి. దీనికి ప్రతిపక్షాలు జే బ్రాండ్ మద్యం అంటూ పేరు కూడా పెట్టారు.    ఈ జే బ్రాండ్ మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఏపీలో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిలో సగం మంది రుగ్మతలకు మద్యమే కారణమని తేలింది. కనీస పరీక్షలు కూడా చేయకుండా మద్యాన్ని అడ్డగోలుగా తయారుచేసి ప్రభుత్వ దుకాణాలకు అందిస్తున్నారు. తెలిసిన కంపెనీ మద్యం ఒక్కటీ లేకపోవడంతో ప్రజలు ఉన్న దాన్నే తాగేసి రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. 

నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే వైసీపీ అభ్యర్థులు సొంత చీఫ్ లిక్కర్ బ్రాండ్ పేరుతో రాష్ట్రమంతా దొంగతనంగా పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. కానీ, ఆ తర్వాత టీడీపీ హయాంలో దీనికి అడ్డుకట్ట పడింది. అయితే, ఇప్పడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు వైసీపీ అభ్యర్థుల సొంత చీప్ లిక్కర్ అధికారిక మద్యంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా ఈ మద్యాన్ని ల్యాబుల్లో పరిశీలించగా నకిలీ మద్యంగా నిర్ధారణ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈ నకిలీ మద్యం, మద్యం పాలసీలపై పోరాడుతున్నారు. రాష్ట్రంలో మద్యం ద్వారా 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపణలు చేస్తూ సీబీఐ విచారణ కోరారు. ఇదే అంశంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 

ఇక ఇటీవల పురందేశ్వరి నరసాపురంలో ఓ మద్యం దుకాణానికి వెళ్లి క్రయవిక్రయాలపై ఆరా తీసి అవినీతిని బయటపెట్టారు. నేరుగా ఆసుపత్రికి కూడా వెళ్లి రోగులను పరామర్శించారు. మద్యం తాగడం వల్లే ఆసుపత్రి పాలైనట్లు మెడికల్ రిపోర్టులు ఉన్నాయని ఆమె పరిశీలనలో వెల్లడైంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఆరా తీస్తే మద్యం వలనే అనారోగ్యం పాలైన కేసులు వేలల్లో ఉన్నట్లు తేలింది. దీంతో ఏపీ మద్యం తాగితే ప్రాణాలు హరీ అనడం ఖాయమని నిర్ధారణయింది. ఒకవైపు లిక్కర్ షాపులతో వైసీపీ కార్యకర్తల దందా పెరిగిపోతోంది. లిక్కర్ అమ్మకాలపై వచ్చిన డబ్బు, ఆదాయానికి.. పలుచోట్ల లెక్కలు గోల్ మాల్ చేసినట్లు ఆరోపణలు ఉండగా.. అక్రమ మార్గాలలో బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేసి మరికొందరు జేబులు నింపుకుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడులుగా వెలిశాయి. ఈ నకిలీ మద్యాన్నే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలకు విక్రయిస్తూ వారి ఆరోగ్యాలను పీల్చి పిప్పి చేస్తోంది.  

By
en-us Political News

  
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.