గవర్నరునే బుక్ చేశారు.. మేమో లెక్కా? జగన్ తీరుతో ఐఏఎస్ ల బెదురు..

Publish Date:Nov 16, 2021

Advertisement

ఏపీలో ఐఏఎస్ అధికారులు హడలెత్తిపోతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న ఏపీ సర్కార్ నిధులు ఇవ్వాలంటూ ఎప్పుడు ఏ శాఖపై పడుతుందో అని తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల తీరుతో ఒక్కొక్క శాఖ నిర్వహణకు కూడా నిధుల్లేక అల్లాడిపోయే దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. శాఖల నిధులు ఇవ్వడం ఫైనాన్షియల్ కోడ్ కు విరుద్ధం.. ఆ విషయమే చెబితే తమను ఉండనిస్తారా? అని పలువురు ఐఏఎస్ లు ఆందోళన చెందుతున్నారు.

రోజువారీ ఖర్చుల కోసం కూడా ఏపీ సర్కార్ ఏదో ఒక శాఖపై పడి నిబంధనలకు విరుద్ధంగా నిధులు తరలించుకుపోతోంది. అడిగిన విధంగా నిధులు ఇవ్వని ఆయా శాఖల ఐఏఎస్ లను ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీచేసి భయపెడుతోంది. ఏపీలో ఏ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కలిసినా ఇప్పుడు ఇదే అంశంమీద చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఇద్దరు ఐఏఎస్ లు ప్రైవేటుగా కలుసుకున్నా.. ఆరోగ్యాలు, వీకెండ్ టూర్ ల గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు వారిలో ఆ పరిస్థితి లేదు. వచ్చే నెల జీతాలు వస్తాయా? లేదా అని వారి సంభాషణల్లో కనిపిస్తోంది. అప్పు కోసం గవర్నర్ నే బుక్ చేసిన ప్రభుత్వ పెద్దలు తమను మాత్రం ఎలా వదిలిపెడతారనే టెన్షన్ ఐఏఎస్ లలో పెరిగిపోతోంది.

రాష్రంలోని ఆర్థికశాఖే కాకుండా అన్ని శాఖలూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి శాఖలు వెళ్లిపోతున్న వైనం ఐఏఎస్ అధికారుల మాటల్లో వ్యక్తం అవుతోంది. తప్పు అని తెలిసినా ప్రభుత్వ పెద్దల వత్తిడితో తమ తమ శాఖల్లోని నిధులు ఇవ్వక తప్పడంలేదని వారు నిట్టూర్పులు విడుస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీయడం తథ్యం.. అయితే.. అది ఎప్పుడనేదే తేలాలని ఓ ఐఏఎస్ వ్యక్తం చేసిన ఆందోళన. ఏపీ దివాలా తీసిన వాస్తవాన్ని అరచేయి అడ్డంపెట్టి దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరో అధికారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆర్థిక శాఖకే పరిమితమైన సంక్షోభం ఇప్పుడు అన్ని శాఖల్నీ చుట్టేస్తోందని వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

‘మా శాఖలో ఉణ్న కొద్దిపాటి నిధుల్నీ ప్రభుత్వం లాగేసుకుంది. ఇన్నాళ్లూ ఆ డబ్బులపై వచ్చే వడ్డీతోనే ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు, ఆఫీసు నిర్వహణ నడుస్తోంది. మా శాఖ డబ్బుల్ని తిరిగి ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి అతి త్వరలోనే దాపురిస్తుందనే భయం మరో ఐఏఎస్ అధికారి మాటగా ఉంది. డబ్బుల కోసం ప్రభుత్వం తనపై ఒత్తిడి తీరును సహచర ఐఏఎస్ లతో పంచుకున్నారు. ‘నిధుల గోల్ మాల్ పై భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు విచారణ చేయిస్తే.. తమ పరిస్థితి ఏంటనే కలవరం పలువురిని పట్టుకుందని తెలుస్తోంది. తమ శాఖలో రెండేళ్లుగా పేమెంట్ల లేవని, చిన్న చిన్న మెయింటెనెన్స్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని, ఇలా అయితే.. ఆఫీసులు ఇంకెన్నాళ్లు నడపగలమంటే ఓ ఐఏఎస్ వాపోతున్నారట. ఈ పరిస్థితి చూసి సెలవుపెట్టి వెళ్లిపోవాలనిపిస్తోందని కొందరు ఆవేదనతో చెప్పుకుంటున్నారని సమాచారం. గతంలో కాస్త ఫేవర్ చేసినందుకే సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్న విషయం వారు గుర్తుచేసుకుంటున్నారు.

బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు శాఖలకు ఇవ్వాల్సింది పోయి.. రివర్స్ లో అన్ని శాఖల నుంచీ నిధుల్ని ప్రభుత్వం లాగేసుకుంటోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ శాఖ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ‘నో‘ చెబితే బదిలీ చేసి మరీ లాగేసుకుంటోందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కట్టిన ఫీజులు, పరీక్షల నిర్వహణకు వచ్చిన నిధుల్ని కూడా విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర ప్రభుత్వానికి ముట్టజెప్పిన వైనాన్ని పలువురు ఐఏఎస్ లు ప్రస్తావించుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రామకృష్ణ తమ వద్ద ఉన్న 500 కోట్ల రూపాయలు ఇచ్చేందుక నిరాకరించారు. అంతే.. ఆయనను ఊహించని విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు బదిలీ అయిపోయారు.
ఇలా ఒక్కటేమిటి ప్రతి శాఖ నుంచి నిధులు లాక్కుపోయేందుకు ప్రభుత్వం రకరకాల ఫీట్లు చేస్తోందీ ప్రభుత్వం.

ఈ ప్రభుత్వం తీరు కారణంగా ఐఏఎస్ లు, ప్రభుత్వ సలహాదారులు వినియోగిస్తున్న కార్లకు కూడా నెలనెలా అద్దె చెల్లించే పరిస్థితి లేదు. ఒక్కో కారుకు నెలకు 60 వేల చొప్పున ఆరు నెలల అద్దె బకాయిలు ఉన్నాయట. దీంతో యజమానులు ఏ క్షణమైనా అద్దె కార్లను ఆపివేసే చాన్స్ ఉంది.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.