కాలం మారుతోన్నకొద్దీ సాంకేతికత ఇబ్బందికరంగా మారుతోంది. మొబైల్, యాప్ల రాజ్యం ఇది. ప్రతీదీ యాప్లకు అనుసంధానం చేయడం మీద దృష్టిసారిస్తున్నారంతా. బడికి ఉపాధ్యాయుల రాకపోకల గురించి తెలుసుకోవడానికి ఫేస్ రికగ్నిషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం పెట్టిన నిబంధన ఉపాధ్యాయుల్లో ఆగ్రహం రెండింతలు చేసింది. అసలే జీతబత్యాలు, ట్రాన్స్ఫర్లు విషయాల్లో ప్రభుత్వ నియమ నిబంధనలతో సతమతమవుతున్న ఉపాధ్యాయులకు ఇపుడు ఈ యాప్ మరింత తలభారంగా మారింది.
ఉపాధ్యాయుల మీద బైండోవర్, అక్రమకేసులు, నోటీసులనిస్తూ అప్రజా స్వామి కంగా ప్రభుత్వం వ్యవహ రిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారని ఉపా ధ్యాయ సంఘాల నేతలు అన్నారు. ప్రభుత్వం సొంత ఫోన్లలో ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా హాజరు వేసేలా ఒత్తి డి చేస్తున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు.
యాప్ గురించి ప్రభుత్వంతో యుద్ధానికి తలపడ్డారు. పరిస్థితులు గ్రహించిన జగన్ సర్కార్ యాప్ నిబం ధన అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని, లోపాలు సవరించి నిర్ణయం తెలియజేస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. దీంతో ఉపాధ్యాయులు కాస్తంత మెతకబడ్డారు. కానీ ప్రభుత్వం చెప్పినట్టుగా ఇచ్చిన హామీని విస్మరించింది. దాన్ని గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో ఉపాధ్యా యులు తాడోపేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల అవలంబి స్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ప్రభుత్వ సత్కా రాలు, సన్మానాలు తిరస్కరించారు.
ప్రభుత్వ యాప్ విద్యార్ధులకు అస్త్రంగా మారితేనే మరీ తలనొప్పి. ఒకవేళ యాప్లో గడ్డం ఉన్నపుడు చూసిన ఉపాధ్యాయుడికి గడ్డం లేకుండా కనపడితే అటెండెన్స్ సమయంలో ఫేస్ గుర్తుపట్ట లేదని తిర స్కరిస్తే వచ్చే ఇబ్బంది అంతా యింతా కాదని విద్యార్ధులు సరదాగా యాప్ల మీద నెట్లో జోక్స్ పంచు కుంటున్నారు. యాప్ అనేది నిరంతరం బ్రహ్మాండంగా పనిచేస్తుందన్ననమ్మకం ఎవరు ఇస్తారు. నిరం తరం లోపాలు ఉండవన్న గ్యారంటీ లేదు. ఇలాంటి అర్ధరహిత విధానాలను అమలుచేసి జగన్ సర్కార్ తన తెలివిని స్వయంగా బయటపెట్టుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-govt-teacher-app-game-25-143247.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.