కుంభమేళాను తలదన్నేలా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు.!

Publish Date:Aug 11, 2026

Advertisement

గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పవిత్ర ఘట్టాన్ని నభూతో అన్న చందంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ లో  అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకుసంబంధించిన ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తోంది.  దక్షిణ భారత కుంభమేలాగా భావించే గోదావరి పుష్కరాలకు దేశం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. ఈ సారి పుష్కారాలకు పది కోట్ల మందికి పైగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

పుష్కరాలకు వచ్చే భక్త కోటికి ఎటువంటి ఇబ్బందులూ ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకుఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా గోదావరి పుష్కరాల ఏర్పాట్లు కుంభమేలా ఏర్పాట్లను తలదన్నేలా ఉండాలని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.  భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణకు చర్యలు,  మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఇప్పటికే చర్యలు ప్రారంభించి పకడ్బందీగా ముందుకు సాగుతోంది.  పుష్కరాల నిర్వహణ నభూతో అన్నట్లుగా నిర్వహించడంతో పాటు..  రాజమహేంద్రవరం, కొవ్వూరు, ఇతర తీర ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తోంది. శాశ్వత మౌలిక వసతుల కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయల పనులకు పాలనా అనుమతులు మంజూరు చేసింది.

పుష్కరాల నిర్వహణలో భాగంగా మున్సిపల్,  పర్యాటక, దేవాదాయ,  నీటిపారుదల శాఖలు సమన్యయంతో ఉమ్మడి కార్యాచరణ చేపట్టాయి.  ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 150 కోట్ల నిధులలో సింహభాగం అంటే వంద కోట్ల రూపాయలు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు, కొవ్వూరు మున్సిపాలిటీకి   20 కోట్లు, నర్సాపురం మున్సిపాలిటీకి రూ. 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది.  ఇంకా నిడదవోలు, పాలకొల్లు, మండపేట మున్సిపాలిటీలకు కూడా ప్రత్యేక నిధులను కేటాయించింది. ఈ నిధులతో  రోడ్ల వెడల్పు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణ,  విద్యుద్దీపాల ఏర్పాటు పనులను చేపడతారు. 

గోదావరి  తీరం పొడవునా కొత్తగా  పుష్కర ఘాట్లను నిర్మించడంతో పాటు, గతంలో ఉన్న ఘాట్లకు సమగ్ర మరమ్మతులు చేపట్టనున్నారు. పుష్కర ఘాట్ల వద్ద   తొక్కిసలాటలు జరగకుండా, భక్తులకు ఎటువంటి  ఇబ్బందులు ఎదురుకాకుండాఏర్పాట్లు చేస్తున్నారు.  ఘాట్ల వద్ద నిరంతర నీటి శుద్ధి, మహిళలకు బట్టలు మార్చుకునే ప్రత్యేక గదులు, అత్యవసర వైద్య శిబిరాలు,  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

అలాగే.. గోదావరి తీరంలో తాత్కాలికంగా సువిశాలమైన  టెంట్ సిటీలు  ఏర్పాటు, హోమ్‌స్టే ఏర్పాట్లు చేయడం ద్వారా పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.   అలాగే..  రాజమహేంద్రవరం నుంచి గోదవరి నదిపై పాపికొండల విహారయాత్ర, బోటింగ్ సదుపాయాలను  భద్రంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం సర్కార్ అధికా రులను ఆదేశించింది.  12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ గోదావరి పుష్కరాలు ఈ సారి వచ్చే ఏడాది  జూన్ 26 నుండి జులై 7 వరకు జరుగుతాయి.  

AP government Preparations for Godavari Pushkaralu, Godavari Pushkaralu,  AP Government Funds, Rajamahendravaram,  Pushkaram Ghats, Infrastructure

By
en-us Political News

  
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
రాజకీయాలు వ్యాపారంగా మారాయి.. ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలి సభాపతి పిలుపు
ప్రత్యేకంగా బీఆర్‌టీఎస్ కారిడార్‌తో పాటు రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్లను అందుబాటులోకి తెచ్చారు. రవాణాతో పాటే విద్యుత్తు, తాగునీటి సరఫరా, గ్యాస్ నెట్‌వర్క్, డ్రైనేజీ, కమ్యూనికేషన్ కేబుళ్ల నిర్వహణ కోసం భూగర్భ మౌలిక వసతులు సమకూర్చారు.   పాదచారుల కోసం ఫుట్‌పాత్‌లు, సైకిల్ ట్రాక్‌లు,   గ్రీన్‌బెల్ట్ నిర్మాణంతో ఆధునిక  రవాణా వ్యవస్థకు ఈ రోడ్డు దర్పణం పడుతుంది.  
దక్షిణాసియా ప్రాంతంలో అల్‌ఖైదా, ఐసిస్ వంటి ఉగ్రవాద అనుబంధ సంస్థల   దాడుల సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని హెచ్చరించింది. ఈ ఉగ్ర సంస్థలు  రసాయన, జీవాయుధాలను సేకరించి.. వాటితో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాయనీ, కుట్రలు పన్నుతున్నాయనీ వెల్లడించింది.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పదవిపై బిసిసిఐ స్పష్టత ఇచ్చింది. జట్టు ట్రాన్సిషన్ ఫేజ్, ఆటగాళ్ల గాయాల దృష్ట్యా గంభీర్‌ను 2027 వరల్డ్ కప్ వరకు కోచ్‌గా కొనసాగించేందుకు బిసిసిఐ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
షేక్ రషీద్ అహ్మద్ లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంధు, ఆ ఉగ్ర సంస్థ కేంద్ర సలహా మండలి సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్‌లతో కలిసి వేదికను పంచుకున్నారు. ఆ సందర్భంగా ప్రసంగించిన ఆయన తాను లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు బానిసనని బాహాటంగా ప్రకటించారు.
జడేజా కెరీర్ ముగింపునకు చేరువవుతున్న వేళ టీమిండియా తదుపరి స్పిన్ లీడర్ ఎవరు కుల్దీప్ యాదవ్ విరాట్, రోహిత్, గిల్ కెప్టెన్సీలలో సాధించిన రికార్డులు, డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక సవాళ్లు మరియు మురళీ కార్తీక్ విశ్లేషణపై సమగ్ర కథనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.