అమ్మో ఒకటో తారీకు!.. పింఛన్లు, వేతనాలూ చెల్లించేదెలా?

Publish Date:Jul 30, 2024

Advertisement

జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, ఆ సర్కార్ ఆర్థిక అరాచకత్వం కారణంగా తెలుగుదేశం కూటమి చిక్కులు ఎదుర్కొంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, సామాజిక పింఛన్లు, ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఎన్ని సమస్యలున్నా అన్న మాట ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీకే పించన్ల పంపిణీ, వేతనాల చెల్లింపులు చేస్తున్నా.. అమ్మో ఒకటో తారీకు అన్న బెంగ మాత్రం తప్పడం లేదు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు చెల్లిస్తోంది. అధికార పగ్గాలు అందుకున్న తరువాత తొలి నెలలో చెప్పినట్లుగానే అరియర్స్ తో సహా పింఛన్లు చెల్లించింది. అలాగే ఏ అవాంతరాలూ లేకుండా ఉద్యోగుల వేతనాలను కూడా వాటి ఖాతాలో వేసేసింది. వలంటీర్లతో పని లేకుండా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించింది. 

ఇక ఇప్పుడు ఆగస్టు ఒకటో తేదీ రాబోతోంది. ఆగస్టు 1నే పించన్ల పంపిణీ పూర్తికి చంద్రబాబు సర్కార్ అన్ని ఏర్పాట్లూ చేసేసిందనుకోండి అది వేరే సంగతి. కానీ ఆర్థిక శాఖ నిధుల కొరతతో సతమతమౌతోంది. అప్పో సొప్పో చేసి ఈ నెల పించన్లు, వేతనాల పంపిణీని గట్టెక్కించేసినా మళ్లీ ఒకటో తారీకు వచ్చే సరికి మళ్లీ అప్పుల కోసం వెతుకులాట తప్పని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల నెలా అమ్మో ఒకటో తారీకు అనుకుని బెంబేలు పడే స్థితిలో ఉంది. పింఛన్లు వేతనాలు సరే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కూడా నిధులు అవసరం.  ఫించన్లు,జీతాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్న సర్కార్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై మల్లగుల్లాలు పడుతోంది.  67లక్షల మందికి సామాజిక ఫించన్లు,ఉద్యోగుల జీతాలు,రిటైర్ అయిన వారి పింఛన్లకు1వ తేదీన చెల్లించాలి. గత నెలలో రిజర్వ్ లో ఉన్న రూ.ఏడువేల కోట్లు ఉపయోగపడ్డాయి.ఆగస్టు నెల  సామాజిక పింఛన్లకు ప్రతి మంగళవారం ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల మీద రుణాలు సేకరిస్తున్నారు. ఇవి సామాజిక ఫించన్లకు, ఉద్యోగులజీతాలు ,రిటైర్ ఉద్యోగుల ఫించన్లులకు చెల్లించాల్సిన 5వేల కోట్లకు కూడా సరిపడా వస్తాయని భావిస్తున్నారు. 
అధికారంలోకి వచ్చి 50  రోజులైనా గ్యారెంటీలు అమలు పై ఇంకా నిర్ణయం కాలేదు. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెబుతున్నది.ఆర్టీసీ కొత్త బస్సులు కావాలంటోంది. ఈ పథకానికి ప్రతి నెలా ఆర్టీసీకీ రూ.250కోట్లు చెల్లించాల్సి ఉందని అంచనా.ఇక అన్న క్యాంటిన్లు అన్నీ ఆగస్టు 15 నాటికి సిద్ధం కాలేవని అధికార వర్గాలు చెబుతున్నాయి.183 క్యాంటిన్ 100 మాత్రమే సిద్ధమవుతాయని తెలుస్తున్నది.
సమగ్ర భూ సర్వేలో జగన్ ఫోటో ఉన్న 77లక్షల రాళ్లను తొలగించాలంటే రూ.15కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తేల్చడం గమనార్హం. జగన్ ఫోటో లపిచ్చితో రూ.700కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది.ఇది కాక విశాఖలో 500కోట్లతో రుషికొండపై కట్టిన రాజభవనం వల్ల ప్రజా ధనం దుర్వినియోగం అయింది. అలాగే విశాఖలో  ప్రభుత్వ కార్యాలయాలు,ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టి జగన్ హయాంలో అప్పులు చేసారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వైసీపీ హయాంలో జరిగిన తప్పులు,అవకతవకలు, ప్రజా ధనం స్వాహ వెలికితీయడానికే సమయం సరిపోవటంలేదు. రోజుకో కుంభకోణం బయట పడుతోంది. మరో పక్క ఆ ప్రభుత్వం చేసిన అప్పులతోనే సతమతమవుతోంది. కొత్త అప్పులు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు.  రోజువారీ ఖర్చులతో పాటు గ్యారెంటీల అమలు చేయాలంటే అప్పుచేయక తప్పదు.అభివృద్ధి చూపించి ఆ ఫలాలతో హామీలు నెరవేర్చుతామని  తెలుగుదేశం కూటమి ఎన్నికలలో  చెప్పింది. అయితే అభివృద్ధి, దానిఫలాలు వెంటనే రావు.  అభివృద్ధి పనులు జరగాలి. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆ తరువాత వాటి ఫలాలు వస్తాయి. సంపద సృష్టి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. అయితే ఇదంతా జరగడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ కు ఆర్థిక కష్టాలు తప్పవు.  వచ్చే నెలలో అమ్మ ఒడి, రైతు భరోసా చెల్లించాల్సి ఉంది.స్కూళ్లు ప్రారంభం అయ్యాయి. వరినాట్లు కూడా మొదలయ్యాయి.ముఖ్యంగా రైతు రుణాలు మంజూరు చేయించాలి. కౌలు రైతులకూ రుణాలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాల్సిఉంది. మరి ప్రభుత్వం నిధులు ఎలా సమకూర్చుకుంటుందన్నదే ప్రశ్న. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం హామీల అమలుతో పాటు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏ పథకానికీ నిధుల కొరత లేకుండా చూస్తామని చెబుతున్నారు. అదే సమయంలో అభివృద్ధినీ పట్టాలెక్కిస్తామంటున్నారు.  మొత్తం మీద కొంత కాలం పాటు ఏపీకి ఆర్థిక ఇక్కట్లు తప్పవని అంటున్నారు. 

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.