ప్రభుత్వ సలహాదారులుగా కార్టూనిస్టు శ్రీధర్, మంతెన సత్యనారాయణ రాజు

Publish Date:Feb 21, 2026

Advertisement

ఈనాడు కార్టూనిస్టు శ్రీధర్ గా తెలుగు పాఠకులకు తన కార్టూన్ల ద్వారా చిరపరిచితుడైన  పోచంపల్లి శ్రీధర్ రావును, ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజులను ప్రభుత్వ సలహాదారులుగా   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం   నియమించింది.  శ్రీధర్ నుసమాచార ప్రచార విభాగం సలహాదారుగా, డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రకృతి వైద్యం విభాగం సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు  జారీ చేశారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవులలో వారిరువురూ  రెండేళ్ల పాటు కొనసాగుతారు.   రాజకీయ, సామాజిక అంశాలపై తన కార్టూన్లతో  శ్రీధర్  ప్రజాభిమానాన్ని చూరగొన్న కార్టూనిస్ట్ శ్రీధర్ ను ప్రభుత్వం సమాచార ప్రచార విభాగం సలహాదారుగా నియమించి గౌరవించింది.  

అలాగే   ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా గుర్తింపు పొందారు. సహజ, సేంద్రీయ ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై టీవీ ప్రోగ్రామ్‌ల ద్వారా, సోషల్ మీడియాలో వీడియోల ద్వారా సత్యనారాయణ రాజు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రిని నిర్వహి స్తున్నారు. విజయవాడ, నరసాపురంలో కూడా సత్యనారాయణ రాజు ఆరోగ్యాలయం కేంద్రా లున్నాయి.

By
en-us Political News

  
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.