చిక్కుల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి!
Publish Date:Sep 14, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లోని మంత్రులు వరుసగా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలము సురేష్ పై జిల్లా కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కులం విషయం కోర్టు బోనులోకి వెళ్లింది. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించి వాస్తవం తేల్చాలంటూ న్యాయవాది రేగు మహేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో న్యాయవాది బి.శశిభూషణ్రావు వాదనలు వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎస్టీ కాదని, ఆమె కుల ధ్రువీకరణకు సంబంధించి వాస్తవం తేల్చాలంటూ న్యాయవాది రేగు మహేశ్వరరావు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కోర్టుకు తెలిపారు. అయితే జిల్లా స్థాయి స్క్రూటినీ కమిటీ ఆమె ఎస్టీ అని తేల్చిందని పేర్కొన్నారు. దీంతో పిటిషనర్ జూన్ 10న అప్పీల్ దాఖలు చేసినట్టు చెప్పారు. అయితే కుల ధ్రువీకరణ విషయంలో మంత్రి తానే విచారణ చేయించడం చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి ఏపీ కుల ధ్రువీకరణ పత్రాల జారీ నిబంధనల మేరకు అప్పీల్ అథారిటీని ఏర్పాటు చేసేలా ముఖ్యమంత్రిని ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు పిటిషనర్ వాదనలపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్. ఎం.సత్యనారాయణమూర్తి.. పత్రాలను పరిశీలిస్తే రాష్ట్ర స్థాయి పునస్సమీక్ష కమిటీ వద్ద అప్పీల్ చేసినట్టుగా ఉందన్నారు. కాబట్టి అప్పీల్ను ఉపసంహరించుకుని సంబంధిత అథారిటీ ముందు దాఖలు చేసుకోవాలని సూచించారు. అప్పీలు అథారిటీ విచారణకు సంబంధించిన వివరాలను తమకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
http://www.teluguone.com/news/content/ap-deputy-cm-pushpa-sreevani-in-trouble-39-122930.html





