ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి తన స్వంత ఎజెండా కారణంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. షర్మిల ఒంటెత్తు పోకడలతో సీనియర్లకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా జగన్ వ్యతిరేకతే పార్టీ సిద్ధాంతం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాకుండా ఒక స్వతంత్ర వ్యక్తిగా తన ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని పార్టీ సీనియర్లు సైతం అంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు తిలోదకాలిచ్చి జగన్ ను విమర్శిస్తూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా అదే తన బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, దీని వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని సీనియర్లు అంటున్నారు.
అంతే కాకుండా షర్మిల తీరు పార్టీ సినియర్లను పార్టీ కార్యక్రమాలకు దూరం చేస్తున్నదనీ, ఇసుమంతైనా ఖాతరు చేయకుండా ఆమె తమను అవమానిస్తున్నారని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాలం చెల్లిన కబుర్లు అంటూ సీనియర్ల సలహాలను ఆమె తీసి పారేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన కారకుడైన కేవీపీ ఆమె ఆ పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రతి సమావేశంలోనూ ఆమె వెన్నంటి ఉండి మార్గదర్శనం చేసేవారనీ, అయితే ఇప్పుడు ఆయన ఎక్కడా కనిపించడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
షర్మిల వైఖరికి విసిగి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనపై ప్రజలు తీర్పు ఇచ్చేశారనీ, ఆయన పార్టీని దారుణంగా ఓడించి జగన్ పట్ల తమ అభిప్రాయమేమిటో చెప్పేశారనీ, అయినా ఇప్పటికీ షర్మిల జగన్ పై విమర్శలకే పార్టీని, పార్టీ కార్యక్రమాలను పరిమితం చేయడం విడ్డూరంగా ఉందనీ అంటున్నారు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రంలో ఉనికి మాత్రంగానే మిగిలిన కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి క్షేత్ర స్థాయి నుంచీ పని చేయాల్సి ఉంటుందనీ, అయితే షర్మిల తీరు అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న విమర్శలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆమె పీసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన కొత్తలో కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపించిన జోష్ ఇప్పుడు లేశమాత్రమైనా కనిపించకపోవడానికి ఆమె వ్యవహారశైలే కారణమంటున్నారు. ఇప్పటికైనా షర్మిత తన తీరు మార్చుకుని అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కాంగ్రెస్ సీనియర్లు సూచిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-congress-chief-sharmila-unilateral-attitude-25-186496.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.