Publish Date:Feb 13, 2020
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్ననే ప్రధానిని కలిసిన సీఎం జగన్ రేపు మరోసారి ఢిల్లీ వెళ్ళి ప్రముఖ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. పీఎం మోడీని కలిసిన రోజునే వైఎస్ జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మూడు రాజధానుల అంశం, మండలి రద్దు వంటి అంశాలపై చర్చిస్తారని అంతా భావించారు. కానీ.. నిన్న ప్రధాని మోదీని కలవడం.. ఆ తర్వాత కేంద్ర హోమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఏపీకి వెనుతిరిగారు వైఎస్ జగన్.
పీఎం మోదీని కలిసిన వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించారు. అలాగే.. పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని కూడా అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అవే అంశాలను ఇప్పుడు అమిత్ షాతో కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ ఇంకా ఎవరిని కలవబోతున్నారు.. ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రధాని మోదీకి ఇచ్చిన నివేదిక కాకుండా ఇంకా ఏయే విషయాలపై అమిత్ షాతో చర్చించనున్నారు అనేదానిపై సర్వత్రా ఆశక్తి నెలకుంది.
రేపు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకొని ఏడు గంటలకు అమిత్ షాతో అపాయింట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశంతో పాటు ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించి బిజెపిలో అసమ్మతి నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే.. ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది ఏపీ ప్రభుత్వం. ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఈ కార్యక్రమానికి ఇప్పటికే మోడీని ఆహ్వానించిన నేపధ్యంలోనే అమిత్ షాను కూడా ఆహ్వానించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రాజకీయపరంగా ఈ భేటీలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ కొన్ని విమర్శలను చేస్తుంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు పలు రకాల విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు అమిత్ షాతో భేటీ ఏ విధంగా చూస్తారనేది చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-jagan-to-visit-delhi-again-to-meet-amit-shah-39-94244.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.