రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచుతున్న తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. ఇరువురే ముఖాముఖీ కూర్చుని తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారంలో వైసీపీ దుర్మార్గపు ప్రచారం చేయడమే కాకుండా కుల చిచ్చు రేపడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. బుధవారం (ఫిబ్రవరి 4)జరిగిన ఈ భేటీలో అటు లడ్డూ కల్తీ నివేదికపై తదుపరి యాక్షన్, ఇటు రాజ్యసభ సీట్ల కేటాయింపు.. రాష్ట్రంలో పాలన తదితర అంశాలపై కూడా ఈ భేటీలో వీరు చర్చించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో కులచిచ్చు రేపేందుకు వైసీపీ చేస్తున్న దుష్టయత్నాలను మొగ్గలోనే తుంచేయాలని వీరిరువు అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, విపక్షం విసిరే కులపరమైన ట్రాప్లో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆ మేరకు క్యాడర్ కు కూడా తగు సూచనలు చేయాలని వీరిరువురూ నిర్ణయించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా వైసీపీ కుట్రలను దీటుగా ఎదుర్కొనేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలనీ, క్షేత్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ ఎత్తుగడలకు క్యాడర్ సమన్వయంతో చెక్ పెట్టేలా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసి పని చేయాలని వారికి దిశానిర్దేశం చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
తిరుమల శ్రీవారి లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదిక పై కూడా వీరిరువురూ సుదీర్ఘంగా చర్చించారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో 68 లక్షల కిలోల నకిలీ నెయ్యి సరఫరా అయిందని, కేవలం రసాయనాలు, పామాయిల్ కలిపి దీనిని సృష్టించారని సిట్ నివేదిక నిర్ధారించిన నేపథ్యంలో ఈ కల్తీ వ్యవహారంలో సూత్రధారులను వదిలిపెట్టకూడదన్న నిర్ణయానికి వచ్చారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో, కేవలం శాఖాపరమైన చర్యలకే పరిమితం కాకుండా.. బాధ్యులందరిపై చట్టప్రకారం చర్య తీసుకునే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు జనసేన, తెలుగుదేశం వర్గాల ద్వారా లెతుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cm-cbn-and-deputy-cm-pk-meet-39-213520.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!