Publish Date:Jul 31, 2025
కర్మఫలం ఎవరైనా అనుభవించక తప్పదు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన ఒక్కొక్కరూ ఇప్పడు కర్మ అనుభవిస్తున్నారు. తాజాగా ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ వంతు వచ్చింది. జగన్ హయాంలో అప్పటి ఏపీసీఐడీ చీఫ్ ఐపీఎస్ అధికారిగా.. అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా కాకుండా వైసీపీ పోలీస్ సర్వీస్ అధికారిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. జగన్ హయాంలో ఏపీ సీఐడీ చీఫ్ గా వ్యవహరించిన సంజయ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి ఇష్టారీతీగా, జగన్ చెప్పినట్లు చేయడమే విధినిర్వహణ అన్నట్లుగా వ్యవహరించారు. సర్వీస్ రూల్స్ అనేవి ఉంటాయనీ కూడా మరిచిపోయారు.
మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా సర్వీసు నిబంధనలకు వ్యతిరేకంగా ఆ కేసులపై మీడియా సమావేశాలలో మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడ్డారు. అలాగే చంద్రబాబు స్కిల్ కేసులో అక్రమంగా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని సమర్ధిస్తూ పొన్నవోలుతో కలిసి హస్తినలో మీడియా సమావేశాలలో మాట్లాడారు. అయితే అంతకంటే ముందు అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో అడ్డగోలుగా పాల్పడిన అవినీతికి సంబంధించిన కేసులో ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందారు. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీం కోర్టు హైకోర్టు సంజయ్ కు బెయిలు మంజూరు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిలు పిటిషన్ విచారణలో ప్రభుత్వ వాదన వినకుండా బెయిలు ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించింది.
అలాగే సంజయ్ పాల్పడిన అవినీతికి ఆధారాలుసమర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో అందుకు సంబంధించి పోలీసు దర్యాప్తులో లభించిన ఆధారాలను ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించింది. చివరికి సుప్రం కోర్టు సంజయ్ ముందస్తు బెయిలును రద్దు చేస్తూ గురువారం (జులై 31) తీర్పు వెలువరించింది. మూడు రావాలలోగా సంజయ్ లొంగిపోవాలని ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-cid-former-chief-sanjay-anticipatory-bail-cancil-25-203183.html
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.